Tuesday, July 8, 2008

సినీనటుడు ప్రకాశ్ రాజ్ పై 406,420 చీటింగ్ కేసులు

ఇప్పటికే వివాదాలతో సతమతమవుతున్న సినీనటుడు ప్రకాశ్ రాజ్ పై చీటింగ్ కేసు నమోదైంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం షూటింగ్ కు రాకపోవడంతో నిర్మాత ఇచ్చిన కంప్లెయింట్ మేరకు పోలీసిలి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన సినీ నిర్మాత ప్రసాద్ 2005 ఫిబ్రవరిలో 'సిద్ధు' అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రఘువరన్ లు ప్రధాన పాత్రదారులు. క్లైమక్స్ సన్నివేశాలను చ్త్రీకరించేందుకు ప్రకాశ్ రాజ్ నిరాకరించారు. దీంతో 'సిద్ధు' చిత్రం క్లైమాక్స్ దశలోనే ఈ సినిమా నిలిచిపోయింది. దీని వల్ల 40 లక్షల రూపాయలనష్టం వచ్చిందని ప్రసాద్ క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు ప్రకాశ్ రాజ్ పై 406,420 కేసులు నమోదు చేశారు.

No comments: