Monday, June 30, 2008

"కథానాయకుడు"లో కొత్తగా కనిపించనున్న రజినీ

సూపర్ స్టార్ రజినీ కాంత్ "కథానాయకుడు" చిత్రంలో కొత్తగా కనిపించనున్నారు. పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్న ఈ తెలుగు, తమిళ చిత్రంలో రజినీ కాంత్ అభిమానులను ఇరవై పాత్రలతో అలరించనున్నారు.ఈ చిత్రంలో సూపర్ స్టార్ స్మార్ట్ గా, హ్యాండ్ సం గా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత వైజయంతీ ఫిలింస్ అధినేత సి.అశ్వినీ దత్ తెలుగులో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో ప్రముఖ దర్శకనిర్మాత కె.బాలచందర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీ కాంత్ నిజజీవితంలోని పాత్రనే పోషిస్తున్నారు. నిజజీవితంలో సినీ కథానాయకుడైన రజినీకాంత్ అదే పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరవై గెటప్ లలో కనిపించనున్నారు. ఆయన సరసన నయనతార, మమతా మోహందాస్ సహా పలువురు కథానాయికలు నటించనున్నారు. రజినీ కాంత్ చిన్ననాటి మితృడి పాత్రలో హీరో జగపతి బాబు నటిస్తున్నారు. ఆయన సరసన మీనా కథానాయకిగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, సునీల్, ఎం ఎస్ నారాయణ, నర్సింగ్ యాదవ్ సహా పలువురు హాస్య నటులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం జి వి ప్రకాశ్. దలేర్ మెహందీ రజినీకాంత్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో ఈ నెల 30వ తేదీన విడుదలవుతోంది.




No comments: