Thursday, February 28, 2008

పిరమిడ్ గ్రూప్ విడుదల చేయనున్న "గమ్యం"

నరేష్, శర్వానంద్ హీరోలుగా, కమలిని ముఖర్జీ హీరోయింగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "గమ్యం" చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా గ్రూప్ విడుదల చేస్తోంది. ఫర్స్ట్ ఫ్రేం పతాకంపై జగర్లమూడి సాయిబాబు రూపొందించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఎవరికైనా గమ్యం ఉంటుంది, అది చేరుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేయడం సహజం. అలాగే ఈ చిత్రంలో కథా నాయకులకు, హీరోయిన్ కు వేరు వేరు గమ్యాలు వుంటాయి, వాటిని చేరుకోవడానికి వారు చేసిన ప్రqయత్నమే ఈ "గమ్యం" చిత్రం కథ.ఆద్యంతం వినోదాన్ని పంచుతూపోయే ఈ చిత్రంలో అభిషేక్, బ్రహ్మానందం, గిరిబాబు, శ్వేత అగర్వాల్, ఎల్ బీ శ్రీరాం, ఎం ఎస్ నారాయణ, హేమ ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తాయని పత్రికలు తమ రివ్యూలలో పేర్కొనడం ఇక్కడ గమనార్హం.











No comments: