
Tuesday, September 30, 2008
Monday, September 29, 2008
చిరంజీవి ప్రజాయాత్ర
చిరంజీవి ప్రజాయాత్రకు సమయం ఆసనమవుతోంది. ప్రజాయాత్ర తేదీలు ఇంకా ఖరారు కాలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పినా ఈ అక్టోబర్ రెండు నుంచి ఆయన అనధికారికంగా అధికార యాత్రనే చేయనున్నారు.Thursday, September 25, 2008
గోపీ చంద్ 'శౌర్యం'
గోపిచంద్, అనుష్క జంటగా సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం "శౌర్యం"। ఈ రోజు (గురువారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబయ్యింది. కధ ప్రకారం ''విజయ్ (గోపీచంద్) తన చిన్నప్పటి లక్ష్యం కోసం కఠోరంగా శ్రమిస్తుంటాడు. అందులో భాగంగానే కోల్కతాకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ
శ్వేత (అనుష్క), దివ్య (పూనమ్కౌర్) పరిచయమవుతారు. అతనికి లక్ష్యసాధనలో ఎదురైన అడ్డంకులేమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరం'' అని దర్శకుడు పేర్కొన్నారు.అలాగే గోపిచంద్, అనుష్కలపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొంటాయని చెప్పారు. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఇక భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన మాట్లాడుతూ యాక్షన్, ఎంటర్టైన్మెంట్తో కూడిన చిత్రంగా ఇది ఉంటుంది. అలాగే మా సి
నిమా పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. గోపీచంద్ సినిమాల్లో ఉండే యాక్షన్ సన్నివేశాలతోపాటు చక్కటి వినోదం, లవ్లీ రొమాన్స్ కూడా మా చిత్రంలో ఉంటాయి. స్విట్జర్లాండ్ లొకేషన్లు కూడా కనువిందు చేస్తాయని అన్నారు.
Tuesday, September 23, 2008
Saturday, September 20, 2008
Thursday, September 18, 2008
తెలంగాణపై చిరంజీవికి స్పష్టత లేదు: విజయశాంతి
తెలంగాణ కోసం ఇదే చివరి యుద్ధమని తల్లి తెలంగాణ అధినేత విజయశాంతి అన్నారు. తెలంగాణ వాదులంతా ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో ఆమె తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్థూపానికి నివాళులర్పించారు.తెలంగాణపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి స్పష్టత లేదని ఆమె విమర్శించారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదనే డొంక తిరుగుడు ప్రకటనలు వద్దని ఆమె అన్నారు.తెలంగాణపై అన్ని పార్టీలు స్పష్టంగా ముందుకు రావాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో తల్లి తెలంగాణ విలీనంపై విలేకరులు వేసిన ప్రశ్నకు ఆమె జవాబు దాటవేశారు. తెలంగాణ పార్టీల మధ్య ఐక్యతకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చొరవ చూపడం హర్షణీయమని ఆమె అన్నారు.
Wednesday, September 17, 2008
Wednesday, September 10, 2008
అక్కినేని నాగార్జున 'కింగ్'
అక్కినేని నాగార్జున కొత్త చొత్రం 'కింగ్'తో ఒకనాటి రాజరికాన్ని మరో మారు చూయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అలాగని ఇది ఏ జానపద లేక పౌరాణిక చిత్రమో కాదని, కథలో వచ్చే మలుపులలో రాజరికపు కథనం ఉంటుందని తెలుస్తోంది. ఒకప్పటి రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కథతో "కింగ్" చిత్రం రూపొందుతోంది. తను ఇప్పటి కింగ్ననుకుంటాడా? ఆయనేం చేస్తాడు? అనేవి తెలుసుకోవాలంటే "కింగ్" సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనని చిత్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి అంటున్నారు.
27 నుంచి గోవాలో జరుగనున్న షూటింగ్లో ఛేజ్, ఓ పాటను చిత్రీకరిస్తామని నిర్మాత వెల్లడించారు. మళ్ళీ అక్టోబర్ ఆరు నుంచి నెలాఖరు వరకు బెంగళూరు పేలస్లో చిత్ర నిర్మాణం కొనసాగుతుందన్నారు. నవంబరులో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ షూటింగ్ డిసెంబర్ 5వరకు జరుగుతుందని, అనుకున్నట్లుగా డిసెంబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు. మైసూర్ ప్యాలెస్లో దాదా 40 మంది నటీనటులు పాల్గొంటారని పేర్కొన్నారు. Friday, September 5, 2008
Thursday, September 4, 2008
ఈ శుక్రవారం విడుదలవనున్న నాలుగు సినిమాలు
ఈ వారంలో నాలుగు సినిమాలు ఒక చిన్న సినిమా విజయం సాధిస్తే చాలు వెంటనే అదే తరహాలో పది సినిమాలు తెరకెక్కటం దక్షిణాదిన ఉన్న ఓ అలవాటు. ఈ మధ్య విడుదలైన కొన్ని చిన్న సినిమాలు నిర్మాతలను గట్టెక్కించటమే కాకుండా వటిల్లో నటించిన వారికి కొంచం పేరు కూడా తెచ్చిపెట్టాయి. దీంతో చిన్న సినిమాల సీజన్ ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమ చిన్న సినిమాల విజయాలతో కాస్త ఊపిరి పీల్చుకుంటుండటంతో ఇదే శుభతరుణంగా భావించిన పలువురు చిన్న నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఈ వరుసలోనే శుక్రవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.
స-రో-జ
తమిళ్ లో చెన్నై-28 వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం స-రో-జ. నలుగురు కుర్రాళ్ల జీవితంలో ఒక రోజు చోటు చేసుకున్న సంఘటన ఆదారంగా తెరక్కెక్కిన సినిమా ఇది. ఇందులో శ్రీ హరి ప్రధాన భూమికను పోషించగా ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడి కుమారుడైన వైభవ్ హెరోగా, కాజల్ హీరోయిన్ గా, ఎస్పీ చరణ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిర ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
అష్టా చెమ్మా
గ్రహణం చిత్రం ద్వారా ఉత్తమ చిత్ర దర్శకుడిగా మన్ననలు పొందిన మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన చిత్రమిది. ఇందులో మా టీవీలో కలర్స్ ప్రోగ్రాం ద్వారా సుపరిచితమైన స్వాతి హీరోయిన్ గా, కొత్త కుర్రాడు నాని హీరోగా నటించారు. పూర్తి స్థాహి అహ్లాదం ఈ చిత్రంలో ఉంటుందని అందుకే అష్టా చెమ్మా అనే పేరుపెట్టినట్లు దర్శకుడు అన్నారు.
అంకిత్ పల్లవి అండ్ ప్రెండ్స్
హ్యాపీడేస్ చిత్రం ద్వారా పరిచయమైన అఖిల్, కొత్త తార అక్ష, హరి ఎల్లెటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. కాలేగ్ వయస్సులో యువతలోని భావాలకు అనుగునంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు ప్రారంభం నాడే చెప్పారు. శిక్రవారం విడుదలవుతిన్న ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందనే రావటంతో సినిమా కూడ విజయం సాధిస్తుందనే ఆకాంక్షను చిత్ర యూనిట్ వెలిబుచ్చారు.
బ్యాంక్
కొంతకాలంగా విడుదలకు నోచుకోక ఎట్టకేలకు విముక్తి పొందుతున్న చిత్రం బ్యాంక్. ఇప్పటికే ఈ చిత్రం విడుదలను పలుమార్లు ప్రకటించి వెనక్కు తగ్గిన నిర్మాతలు చివరిగా ఈ శుక్రవారం తాడోపేడోకు సిద్దమయ్యారు. ఇక ఈ చిత్రంలో బాలివుడ్ నటుడు జాకీష్రాప్, అబ్బస్, అర్చన(వేద) నటించగా దివంగత రఘువరన్ ప్రధాన భూమికను పోషించిన చివరి చిత్రం ఇదే.
రజనీకాంత్ వర్సెస్ చక్రీ...!
ఇదేంటీ అనుకుంటున్నారా నిజమే.. రజనీ నటించే రోబో చిత్రంలో చక్రీ విలన్ గా నటించనున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శివ చిత్రం ద్వారా రాం గోపాల్ వర్మ పరిచయం చేసిన నటుల్లో జేడి చక్రవర్తి(గడ్డం చక్రవర్తి) ఒకరు. శివ తర్వాత చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక పంధాను ఏర్పర్చుకున్న జేడి ఈ మద్య కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తిరిగి దుబాయ్ శీను చిత్రం ద్వారా నటుడిగా కనిపించిన చక్రీ నటనకంటే తన గురువైన రాం గోపాల్ వర్మ పంధాలో దర్శకుడు కావాలనే కలను నిజం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో బాగంగానే ఈ మద్య జగపతిబాబును నటించిన "హోమం" ద్వారా చక్రీ దర్శకుడయ్యారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా చక్రీ మంచి మార్కులే కొట్టెశాడని కోలివుడ్ నుంచి వచ్చిన ప్రశంస. Tuesday, September 2, 2008
విఘ్నాలు వదిలే "చవితి" శుభాకాంక్షలు
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం... అంటూ వక్రతుండుడైన విఘ్న రాజ వినాయకుడిని మొక్కందే ఏ రోజు ప్రారంభం కాదు. ముందు ఆయనకు పూజ చేసిన తర్వాతే మిగిలిన దేవుళ్లకు. అలా శాశించింది కూడా పరమేశ్వరుడే. అందుకే ఎంతటి వారైన సరే ముందుగా విఘ్నేశ్వరున్ని తలంచుకుని తమ విఘ్నాలన్ని తొలగిపొయ్యి అంతా శుభం జరగాలని కోరుకుంటారు. అంతేకాదు భారతీయ సంసృతి, సాంప్రదాయాల్లో, ఆచార, వ్యవహారాల్లో కూడా విఘ్న రాజుకు ప్రధమ నివేదనకే ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు భారతీయులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి (వినాయకచతుర్థి)ని మొదటి పండుగగా వ్యవరిస్తారు. వినాయకుడి గజాననుని కథ
శివపార్వతుల ప్రథమ కుమారుడు వినాయకుడు. సర్వవిజ్ఞాలను తొలగించే దేవునిగా వినాయకుడు ప్రఖ్యాతి గాంచాడు. ఏ కార్యక్రమాన్ని అయినా ప్రారంభించే ముందు వినాయకుని పూజించడం హిందూవుల ఆనవాయితీ. ఈ వినాయక చవితి వేడుకలను పది రోజుల పాటు అతి వైభవంగా నిర్వహిస్తారు.కుమారస్వామి వలె వినాయకుడు పార్వతీ దేవి గర్భం నుంచి జన్మించలేదు. ఒక నాడు కైలాసంలో పార్వతీ దేవీ నలుగు పెట్టుకుని స్నానం చేస్తోంది. ఆ సమయంలో ఏమీ తోచక నలుగు పిండితో చిన్న బొమ్మను తయారు చేసింది. పార్వతీ దేవీ చెలికత్తె ఆ బొమ్మను చూసి బొమ్మ ముద్దుగా ఉందమ్మా ప్రాణం పోస్తే బాగుంటుందని అన్నది. దీంతో ముచ్చటపడిన పార్వతీ దేవీ ఆ బొమ్మను బ్రహ్మ వద్దకు తీసుకెళ్లి ప్రాణం పోయించి తీసుకురమ్మని చెలికత్తెలను పంపింది.అలా ప్రాణం పోసుకున్న ఆ బాలుడిని ఆమె స్నానాల గది బయట కాపలాకు పెట్టింది. ఆభరణాలను అలంకరించుకుని ఆమె భర్త రాకకై నిరీక్షించసాగింది. ఈ విషయం తెలియని పరమశివుడు పార్వతీ దేవీ మందిరంలోకి ప్రవేశించబోగా, ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆశ్చర్యపోయిన శివుడు ఎవరు నీవని ప్రశ్నించాడు? లోనికి ప్రవేశము లేదని ఆ బాలుడు చెప్పాడు. చాలా సేపు ఇద్దరి మధ్యా వాగ్యుద్దము జరిగిన తర్వాత ఆగ్రహోపేతుడైన పరమ శివుడు త్రిశూలంతో బాలుని తల నరికాడు. బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. అప్పుడే యుద్ధం చేసి ఖండించి తీసుకువచ్చిన గజాననుడు అనే రాక్షసుని తలను కుమారుడికి అతికించాడు. అప్పటినుంచి వినాయకుడికి గజాననుడు అనే పేరు వచ్చింది.
విఘ్నేశ్వరుడి పత్రి పూజ
ఈ పూజలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే స్వామి వారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. దీనిని దూర్వా పత్రమని అంటారు. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. తర్వాతది మాచీ పత్రం అంటే చేమంతి జాతికి ఆకులు. ఈ ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తర్వాతి పత్రం అపామార్గ పత్రాలు. ఇవి గుండ్రంగా ఉంటాయి. దీనినే తెలుగులో ఉత్తరేణి అని అంటారు. బృహతీ పత్రం, వీటినే ములక అని అంటారు. వీటిలో చిన్న ములక, పెద్ద ములకలు అని రెండు రకాలు ఉన్నాయి. దుత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త ఆకులు. వంకాయ జాతికి చెందిన చెట్లు ఇవి. తులసీ పత్రం, ఈ పత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేదీ ఏమీ లేదు. దేవతార్చనలో వాడే ఈ పత్రాలు మంగళదాయకమైనవి.
హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాన్... ఈ పేరు వినగానే యువతలో టక్కున ఓ షార్ప్ నెస్ కనిపిస్తుంది. అంతేకాదు కొత్త ప్యషన్లు... స్టైల్.. తాను ఏది చేసిన కొత్తదనాన్ని చూపటం అయనకే సాద్యం. అందుకే ఆయన పేరు వినగానే కుర్రకారు చిందేస్తారు. అయితే సినిమాలేమోగానీ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్బావానికి చమతోడ్చిన పవన్ కళ్యాన్ కొద్ది రోజుల విరామం తర్వాత ఇదిగో ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. విభిన్నతను కోరుకుంటూ ఆచితూచి సినిమాల్లో నటించే పవన్ ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వలో "పులి" చిత్రంలో నటిస్తున్నాడు.


















































