Wednesday, June 18, 2008

ఆంజనేయా...ఆదుకోవా: చిరంజీవి

ఈ ఫోటోలు చూస్తుంటే చిరంజీవి ప్రస్తుత రాజకీయాలనుంచి రాష్ట్రాన్ని ఆదుకోవలసిందిగా కోరుతున్నట్లు ఉంది కదూ. అయితే నిజం వేరు. ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవి మంగళవారం జూబిలీ హిల్స్ లోని దాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమారుడు రాంచరన్ తేజ, భార్య సురేఖ లతోబాటు, ప్రముఖ నటులు మురలీ మోహన్, నిర్మాత ఆలయ కమిటీ చైర్మెన్ వి బి రాజేంద్ర ప్రసాద్ లు సహితం ఈ పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజూకీయ ప్రవేశం పై స్పందించవలసిందిగా తనతో మాట్లాడిన విలేఖరులతో చిరంజీవి, ఆ విషయాలు ప్రస్తుతానికి వద్దని తోసిపుచ్చారు. మరి దేవుడిని ఏం కోరుకున్నారని అడగగా "సర్వేజనా సుఖినోభవంతు" అని కోరుకున్నానంటూ ముందుకు కదిలిపోవడం గమనార్హం.


No comments: