Monday, June 23, 2008

సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన "స రి గ మ ప"

పిరమిడ్ సాయిమిరా ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాదు విభాగం నిర్మిస్తున్న "స రి గ మ ప" రియాలిటీ షో విజయవంతంగా సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ లో భాగమైన పిరమిడ్ సాయిమిరా ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ "స రి గ మ ప" గానలహరి ఆంధ్ర ప్రదేశ్ లోని ఆబాలగోపాలాన్ని ఎంతగానో అలరిస్తోంది. గత కొన్ని నెలల క్రితం 'జీ టీవీ'లో ప్రసారం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇంకా చివరి దశకు చేరుకోకుండానే, ఇందులో పాల్గొంటున్న అభిరాం, సాహితి, పూజ మరియు రఘురాం లకు పలు చిత్రాలలో పాటలు పాడే అవకాశం రావడం గమనార్హం. 14 నుంచి 24 మద్య వయసున్న 30 మంది వర్దమాన గాయకులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల సెమీ ఫినల్స్ కు చేరుకుంది. ప్రతి బుధ, గురు వారాలలో రాత్రి 9:00 గంటలనుంచి, రాత్రి 10:30 నిమిషములదాకా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి గాయని గీతా మాధురి యాంకర్ గా వ్యవహరిస్తుండగా, మ్యూజిక్ కంపోసర్ కోటేశ్వర రావ్, "గోదావరి" చిత్ర సంగీత దర్శకుడు రాధాకృష్ణ లు న్యాయ నిర్నేతలుగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ దర్శకత్వంలో కొనసాగుతున్న "స రి గ మ ప" కార్యక్రమ క్వార్టర్ ఫైనల్స్ లో సాహిథి, పూజ, పవన్, శ్రీకృష్ణ, అభిరాం మరియు అనుదీప్ లు సెమీ ఫినల్స్ కు చేరుకున్నారు.












No comments: