Monday, June 16, 2008

చిరంజీవి రాజకీయ పార్టీ అధికారిక ప్రకటన ఆగస్టులో: నాగబాబు

చిరంజీవి తాను పెట్టబోయే పార్టీ గురించి ఆగస్టులో ప్రకటిస్తారని ఆయన సోదరుడు, సినీ నటుడు నాగబాబు చెప్పారు. ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ పార్టీ బిసి, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పాటు పడుతుందని ఆయన చెప్పారు. ప్రజల మేలు కోసమే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన చెప్పారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విభజించి పాలించు అనే బ్రిటిష్ పాలకుల నీతిని అనుసరిస్తున్నారని, చిరంజీవి పార్టీ అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. పార్టీలో చిరంజీవి అభిమానులకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మాత్రమే ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా నాగబాబు ఆ విషయాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments: