Saturday, December 15, 2007

ప్రెస్ కాంఫరెన్స్ లో మీడియాపై భూమిక చిందులు



సినీనటి భూమిక మీడియాపై చిందులు తొక్కారు. గత శుక్రవారం భూమిక నటించిన కొత్త చిత్రం "అనసూయ" చిత్రంపై ఏర్పాటు చేసిన ప్రెస్ కాంఫరెన్స్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సినీ ప్రమోషన్ కార్యక్రమంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. కార్యక్రమం జరుగుతుండగా ఒక జర్నలిస్టు సెల్ ఫోన్ మోగింది. దాంతో భూమిక అసహనం ప్రదర్శిస్తూ - సెల్ ఫోన్లు స్విచాఫ్ చేయాలని, లేదంటే బయటకు వెళ్లాలని కసురుకున్నారు. దీంతో జర్నలిస్టులు షాక్ తిన్నారు. ఈ సినిమాలో భూమికది జర్నలిస్టు పాత్ర కావడం గమనార్హం.

No comments: