Tuesday, December 18, 2007

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీ కానున్న త్రిష


ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ భూం కొనసాగుతోంది. అది సినీ పరిశ్రమలో కూడా విస్తృతంగా వ్యాపించింది. వెటరన్ హీరోలు మురళీ మోహన్, శోభన్ బాబు తదితరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత హీరోలు ఈ దిశగా పెద్దగా దృష్టి సారించడంలేదు. హీరోయిన్లు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని తపనపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ లిస్ట్ లో స్నేహ ముందంజలో ఉండగా ఇపుడు తాజాగా త్రిషా కూడా చేరింది. ఇంతకుముందే నందనం లాంటి పెద్ద బిల్డింగ్ లను సొంతం చేసుకున్న త్రిషా హైదరాబాద్ లోనూ ఒక ఇల్లు కొనుక్కున్నట్టు సమాచారం. గతవారం చెన్నయ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 50 ఎకరాల ఫామ్ హౌస్ ను కొన్నది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయట. ఇంతటితో త్రిషా ఊరుకోవడం లేదు. అల్వార్ పేట్ సమీపంలోనూ ఒక బిల్డింగ్ ను కొనడానికి సిద్ధపడిందట. 26 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయల విలువగల ఆస్తులను భూముల రూపంలో సొంతం చేసుకోవడానికి మరిన్ని ప్రణాళికలు చేస్తోంది.

No comments: