Wednesday, December 12, 2007

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించనున్న విక్టరీ వెంకటేశ్



తెలుగు తెరపైకి మరో కొత్త కాంబినేషన్ వస్తోంది. తనదైన బాణీలో చిత్రాలను నిర్మిస్తూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఈనాటి క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, విక్టరీ వెంకటేశ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. శేఖర్ కమ్ములకు బందువు అయిన సానం నాగ అశోక్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథా రూపకల్పన ప్రస్తుతం జరుగుతోంది. గతంలో సానం నాగ అశోక్ కుమార్ విక్టరీ వెంకటేశ్ హీరోగా నిర్మించిన "వసంతం", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" చిత్రాలు బాక్స్ ఆఫీసు దగ్గర అఖండ విజయాన్ని చవిచూసాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనుండటం తో సినీ పరిశ్రమలో భారీ అంచనాలకు తెరలేచింది. పూర్తి స్థాయి వినోదం, కుటుంబ నేపధ్యం, మానసిక భావోద్వేగాల కలయికలో రూపొందనున్న ఈ చిత్రం పై సహజంగానే తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దృష్టి సారించింది. ఈ చిత్రం వెంకటేశ్ కెరీర్ లోనే మంచి చిత్రం కావచ్చనే ఊహాగానాలూ బయలుదేరాయి. ఏదేమినా అభిరుచి గల నిర్మాత, ప్రతిభావంతుడైన దర్శకుడు, విభిన్న భావోద్వేగాలను పలికించడంలో, సెంటిమెంటు కురిపించడంలో దిట్ట అయిన హీరోల కలయికలో చిత్రం రూపొందనుండటం నిజంగా మంచి పరిణామమే.

No comments: