Friday, January 4, 2008

ప్రిన్స్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఖరారు



మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ రెండు మూడు విడతలుగా కలుసుకున్నప్పుడే ఈ విషయం పై వదంతులు వినిపించినా, ఈ చిత్రం దదాపు ఖరారయినట్లు కొత్తగా పద్మాలయా స్టూడియోలో జరుగుతున్న అంతర్గత చర్చలవల్ల తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్ కృష్ణలతో కలిసి గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ హీరోగా "జల్సా" సినిమాను రూపొందిస్తున్నాడు. గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన "అతడు" సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా తాజాగా తలపెట్టిన ప్రాజెక్టు ఏప్రిల్ లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

No comments: