Tuesday, January 8, 2008

"కేప్టెన్సీ" కోల్పోయి "దీపికాను" దక్కించుకున్న యువరాజ్


భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్సీని పొందలేకపోయినా యువరాజ్ సింగ్ దీపికా పదుకొనే ప్రేమను సాధించి "ప్రేమ" విషయంలో తనదే పైచేయి అని నిరూపించుకున్నాడు. భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెటర్ యువరాజ్ సింగ్ లు "ఓం శాంతి ఓం" సినిమా హీరోయిన్ దీపికా పడుకొనే ను ప్రేమించారు. ముందుగా మహేంద్ర సింగ్ ధోనితో దోస్తి కట్టిన దీపికా ఇప్పుడు యువరాజ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. కెప్టెన్ పదవిని దక్కించుకోలేక పోయిన యువరాజ్ సింగ్ దీపికకు దగ్గరవడంలో మాత్రం విజయం సాధించాడు. ధోని కూడా దీపకతో దోస్తి చేసినప్పటికీ ఆమె మాత్రం ఇపుడు యువరాజ్ అంటేనే మక్కువ చూపుతోంది.యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే సిడ్నీ చేరుకున్న దీపికా తన 22వ జన్మదినోత్సవాన్ని యువరాజ్ సమక్షంలో జరుపుకుంది. తాజా సమాచారం ఏమంటే యువరాజ్ సింగ్, దీపికా పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. చక్కగా కలిసిపోతున్న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారి సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. లేట్ నైట్ రెస్టారెంట్లలో గడపడం మూలంగానే దాని ప్రభావం యువరాజ్ సింగ్ పై పడినట్టు విమర్శలు కూడా వచ్చాయి. ఇంకో విషయం ఏమంటే యువరాజ్ సింగ్ కు సినీ తారలతో తిరగడం కొత్తేం కాదు. కొన్నాళ్లు కిమ్ శర్మతో తిరిగిన యువరాజ్ ఇపుడు దీపిక ప్రేమలో పడ్డాడు. దీపికా పదుకొనే కూడా తక్కవేం తినలేదు, ఆమె కూడా గతంలో రణబీర్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. అంతకుముందు కూడా దీపిక సినిమా పరిశ్రమకు చెందని వ్యక్తితో కూడా ప్రేమాయణం నడిపింది. అనుభవం విషయంలో ఇద్దరూ ముదుర్లే.

No comments: