Tuesday, January 29, 2008

రాజశేఖర్ పై దాడికేసు: నిందితుల లొంగుబాటు


సినీ నటుడు రాజశేఖర్ పై దాడి కేసులో పది మంది మంగళవారంనాడు హైదరాబాదులోని పంజగుట్ల పోలీసు స్టేషనులో లొంగిపోయారు. రాయపురెడ్డి సూరిబాబు అలియాస్ రాజా నాయకత్వంలో తాము రాజశేఖర్ ను వెంబడించామని నిందితులు చెప్పారు. తాము రాజశేఖర్ పై దాడి చేయలేదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడానికి రాజశేఖర్ కారును వెంబడించామని వారు చెప్పారు. తమను చూసి రాజశేఖర్ భయానికి గురై లారీని, శాంత్రో కారును ఢీకొట్టారని, దాడి చేసే ఉద్దేశం తమకు లేదని వారు చెప్పారు.
నగేష్ బాబు, రాజు, నాయుడు, నగేష్ బాబు, విష్ణు, పల్లంరాజు, గణేష్, కళ్యాణ్, షేక్ సలీం అలీ, రాంమోహన్ అనేవారిని రాజశేఖర్ పై దాడి కేసులో నిందితులుగా గుర్తించారు. తాము పదిమందిమి ముందు నాంపల్లి స్టేషనుకు వెళ్లామని, ఆ తర్వాత సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు వెళ్లి రాజశేఖర్ కారును వెంబడించామని వారు చెప్పారు. నిందితులను పోలీసులు విచారించారు

No comments: