Friday, May 2, 2008

శ్రీనువైట్ల దర్శకత్వంలో నాగార్జున "కింగ్"

తెలుగు సినిమా "మన్మథుడు" నాగార్జున, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. నాగార్జున మితృడు డి. శివప్రసాద్‌రెడ్డి నిర్మాతగా "కామాక్షి కళా మూవీస్" పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా ప్రారంభమైంది. దేవుని చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ కొట్టగా, అక్కినేని అమల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున కుటుంబసభ్యులతో పాటు కెమెరామెన్ ప్రసాద్ మారెళ్ల, రచయిత గోపీ తదితరులు పాల్గొన్నారు. మే 21 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో త్రిష కథానాయకగా నటించనుండగా ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. "డాన్" తర్వాత హీరో నాగార్జున నటిస్తున్న ఈ చిత్రానికి "కింగ్" అనే పేరును ఖరారు చేశారు.

No comments: