Monday, May 12, 2008

పద్మ విభూషణ్ గానకోకిల

గానకోకిలకు పద్మ విభూషన్ దక్కింది. పి.సుశీల (పానులేటి సుశీల) . 5యాభై సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 25 వేలకు పైగా గీతాలు పాడిన ప్రముఖ గాయకురాలు పానులేటి సుశీల(పి.సుశీల)కు భారత ప్రభుత్వం కొత్తగా పద్మ విభూషన్ అవర్డును ఇచ్చి గౌరవించింది. ఉత్తమ గాయనిగా ఐదు సార్లు (1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం మరియు 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు)జాతీయ అవార్డును అందుకున్న గానకోకిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య పురస్కారం 2001 లో లభించింది.1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించిన సుశీల గారి తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో "కన్నతల్లి") అనే సినిమాలో "ఎదుకు అలత్తాయ్" అనే పాటను తను మొదటిసారిగా పాడింది. అలా మొదలైన పి.సుశీల గానవాహిని అలా కొనసాగుతూనే ఉంది.

No comments: