Friday, May 30, 2008

డా.రాజశేఖర్ ఇంట్లో సి డి ల దొంగతనం


సినీ నటుడు రాజశేఖర్ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. జూబిలీహిల్స్ లోని ఫిల్మ్ నగరులో ఉన్న ఆయన కార్యాలయంలోకి దుండుగులు ప్రవేశించి పలు విలువైఅన్ సి డి లు ఎత్తుకెళ్ళారు. దుండగులు కంప్యూటరును కూడా ధ్వంసం చేశారు. పలు విలువైన సిడిలను, కీలక పత్రాలను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని రాజశేఖర్, జీవిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. "పథకం ప్రకారమే ఎవరో దొంగతనం చేయించారని, దొంగతనం కోసం వచ్చినవారికి కంప్యూటర్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంటుందని" రాజశేఖర్ భార్య జీవిత అన్నారు. బతుకు దెరువు కోసం దొంగతనం చేసేవారికి సిడీలు, పత్రాలతో పనేముంటుందని, ఇది కావాలనే ఎవరో చేయించారని ఆమె తన కంప్లైంట్ లో పేర్కొన్నారు.

No comments: