Thursday, May 15, 2008

క్రియాశీల రాజకీయాల్లోకి రానున్న సినీనటుడు బాలకృష్ణ

సినీనటుడు బాలకృష్ణ వచ్చే నెలాఖరులో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన జూన్ 10 న లాస్ ఏంజిలిస్ లో జన్మదినం జరుపుకుని, అక్కడి ప్రవాసాంధ్రులతో సమావేశమై తిరిగి వస్తారు. జూన్ 28న విజయవాడ వేదికగా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించనున్నారు. ఆరోజుకు చంద్రబాబు నాయుడు "మీకోసం" యాత్ర విజయవాడకు చేరుకునేలా ప్రణాళిక సిద్ధమైంది. నిన్న బాలయ్య తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని, పుల్లేటి కుర్రులో రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. తన అభిమానులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో, వివిధ సామాజిక వర్గాల నాయకులతో ఆయన సమావేశమై రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

No comments: