Friday, March 14, 2008

రజినీకాంత్ విడుదల చేయనున్న ఎన్టీఆర్ "కంత్రి" ఆడియో

యంగ్ ఎన్టీఆర్ "కంత్రి" సినిమా ఆడియోను ప్రముఖ దక్షిణాది నటుడు రజినీకాంత్ విడుదల చేయనున్నాడు. ఈ చిత్రం యొక్క విదేశీ ప్రదర్శన హక్కులను కెఎడి ఎంటర్ టైన్ మెంట్ సంస్ధ చేజిక్కించుకుంది. వైజయంతి మూవీస్ బ్యానరుపై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హన్సిక మోత్వాని, తనీష్ నటించారు. ఈ వేసవిలోనే విడుదల కానున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్ కు అసోసియేట్ గా అనేక సినిమాలకు పని చేసిన మెహెర్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఎన్టీఆర్ గతంలో నటించిన "ఆంధ్రావాలా" చిత్రాన్ని కన్నడంలో దర్శకత్వం వహించి సంచలన విజయాన్ని చేకూర్చిన మెహర్ రమేష్ కు దర్శకుడిగా ఇది తొలి తెలుగు చిత్రం. మణీశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం పాటల సీడీ, కేసెట్లు ఈ నెల మూడో వారంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

No comments: