Saturday, March 8, 2008

"జోధా అక్బర్" ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది: ఐశ్వర్య రాయ్

"జోధా అక్బర్" హిట్ కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ బాలివుడ్ నటి ఐశ్వర్య పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు దర్శకుడు రిసెర్చ్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రం విజయం తమ యూనిట్‌లో ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని పంచి పెట్టిందన్నారు. ఈ చిత్రాన్ని ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో "జోధా అక్బర్" తెలుగు వెర్షన్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కథకు తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా చక్కగా సమకూరిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
దర్శకుడు అశుతోశ్ గోవారికర్ మాట్లాడుతూ హిందీ అర్ధం కాని తెలుగు సినీ అభిమానులకు తమ కథను చూపాలనే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించామన్నారు. హీరో హృతిక్ మాట్లాడుతూ మొదట్లో కొంత సందేహం ఉన్నప్పటికీ, ఈ చిత్రంలో హీరో పాత్రను సవాల్‌గా తీసుకుని పోషించానన్నారు.

No comments: