Tuesday, March 11, 2008

దీపామెహతా దర్శకత్వంలో నటించనున్న "శ్రియ"


తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన హీరోయిన్ శ్రియ. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసిన లక్కీభామ. ఈ భామ తాజాగా బాలీవుడ్‌పై దృష్టిసారించింది. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు విరివిగా వస్తుండటంతో ఆమె దక్షిణచిత్ర సీమకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన దీపామెహతా దర్శకత్వంలో శ్రియ నటించనుంది. దీపామెహతా గతంలో "ఫైర్", "వాటర్" వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన విషయం తెల్సిందే.అమీర్ ఖాన్, నందితాదాస్, జాన్ అబ్రహాం లు దీపామెహతా దర్శకత్వంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.ఇప్పుడు వీరి సరసన శ్రియ చేరుతోంది.ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఈ తాజా చిత్రం షూటింగ్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైనట్లు తెలిసింది. ఇందులో సీమా బిశ్వాస్‌ కూడా ఒక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం శ్రియ, విక్రమ్ హీరోగా నటిస్తున్న "మల్లన్న" ద్విభాషా చిత్రంలో నటిస్తోంది.

No comments: