Wednesday, March 26, 2008

బాలకృష్ణ "పాండురంగడు" వివరాలు ఉగాదికి...

వరుస అపజయాలను ఎదుర్కొన్న నందమూరి బాలకృష్ణ భక్తిరస చిత్రం "పాండురంగడు" తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భక్తిరసాల చిత్రీకరణలో అందెవేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో "పాండురంగడు" చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీని పూర్తి వివరాలను ఉగాది శుభదినాన తెలియజేయాలని దర్శకేంద్రులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ "భక్త పుండరీకుని"గా, "శ్రీకృష్ణుని"గా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. స్నేహ, టబు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు వేశ్యగా నటించడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి భారవి, వేటూరి, సుద్దాల అశోక్ తేజ, వేదవ్యాస్ కలాల నుంచి జాలువారే పాటలు ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.గతంలో వైవిధ్య పాత్రలలో వచ్చిన "ఆదిత్య 369", "భైరవ ద్వీపం", "శ్రీకృష్ణార్జున విజయం" సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విభిన్న తరహాలో రాబోతున్న "పాండురంగడు" చిత్రం కూడా బాలయ్య నటనాచాతుర్యంతో సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని ఆశిద్దాం.

No comments: