ప్రపంచ స్థాయి అందాల భామలలో ఒకరైన బాలీవుడ్ నటీమణి అందాల ఐష్వర్యా రాయ్ అంటే చాలామందికి చాలా చాలా ఇష్టం. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని అందరు అభిమానులూ ప్రత్యేక ఉత్సాహాన్ని చూయిస్తుంటారు. ఆమెకు సంబంధించిన పాస్ పొర్ట్ చూస్తే ఎలా వుంటుంది. భారత దేశ ప్రభుత్వం జారీచేసిన ఈ పాస్ పోట్ ఫొటో కాపీ ప్రత్యేకంగా మీకోసం. Monday, March 31, 2008
అందాల అభినేత్రి ఐష్వర్య రాయ్ "పాస్ పోర్ట్" చూద్దామా
ప్రపంచ స్థాయి అందాల భామలలో ఒకరైన బాలీవుడ్ నటీమణి అందాల ఐష్వర్యా రాయ్ అంటే చాలామందికి చాలా చాలా ఇష్టం. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని అందరు అభిమానులూ ప్రత్యేక ఉత్సాహాన్ని చూయిస్తుంటారు. ఆమెకు సంబంధించిన పాస్ పొర్ట్ చూస్తే ఎలా వుంటుంది. భారత దేశ ప్రభుత్వం జారీచేసిన ఈ పాస్ పోట్ ఫొటో కాపీ ప్రత్యేకంగా మీకోసం. Saturday, March 29, 2008
ఎన్ టి రామారావు బర్త్ డేకు విడుదలవనున్న బాలకృష్ణ "పాండురంగడు"

నందమూరి అభిమానులకు మే 28 పండుగ రోజు కానుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న "పాండురంగడు" చిత్రాన్ని స్వర్గీయ ఎన్ టి రామారావు పుట్టిన రోజైన మే 28వ తేదీన విడుదలచేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక,నిర్మాత కె రాఘవేంద్రా రావు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. "పాండురంగడు" చిత్రంలో బాలకృష్ణ కృష్ణుడు గానూ,భక్తుడు పాండురంగడు గా పించనున్నారు.రామోజీ ఫిలిం సిటి,రాయచూరు,ధాయలాండ్,ఇండోనేషియా,కంబోడియా లలో రమణీయంగా సన్నివేశాలు చిత్రీకరించారు.ఎప్పటిలానే రచయిత జె.కె.భారవి ఈ పౌరాణికానికి కొత్త సొగసులు అద్దారంటున్నారు. కీరవాణి సంగీతం,జయరాం కెమెరా,స్నేహా,టాబు,ప్రియమణి వంటి హీరోయిన్ల అభినయం చిత్రానికి అదనపు హంగులు అవుతుందంటున్నారు.ఈ చిత్రాన్ని ఆర్.కె బ్యానర్ పై కె.కృష్ణ మోహన్ నిర్మిస్తున్నారు.
Friday, March 28, 2008
చీరకట్టులో ఇలియానా
ఈ ఫోటోలు చూస్తే మీకేమనిపిస్తోంది. భారతీయ సాంప్రదాయ వస్త్రమైన చీరకట్టులో ఉండే అందం మరే వస్త్రాలలో రాదనిపించడం లేదూ. ఏప్రిల్ 2వ తేదీన విడుదలయ్యే "జల్సా" చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రేమ పాఠాలలో చీరకట్టులో ముద్దుగుమ్మలు ఎంత అందంగా ఉంటారో సెలవిచ్చినట్లున్నాడు. అందుకే "జల్సా"లో ఇలియానా చాలా సన్నివేశాలలో చీరకట్టులో దర్శనమిస్తుంది. చూస్తుంటే చీరకట్టు మళ్ళీ అమ్మాయిలకు ఫ్యాషన్ అవుతుందా ఏమిటనేలా ఉన్న ఫోటోలను మీరే చూడండి. 





బర్త్ డే బాయ్ రామ్ చరణ్ తేజ
"చిరుత" చరణ్ ఈ రోజు 24 వ సంవంత్సరం లోకి అడుగుపెడుతున్నాడు.మెదటి సినిమాతోనే తన దైన ముద్ర వేసి ముందుకెలుతున్న చరన్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. క్రిందటి బర్తడే ని బ్యాంకాక్ లో తల్లి,తండ్రి సమక్షంలో "చిరుత" సెట్ లో జరుపుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చితం సెట్లో, యూనిట్ అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోబోతున్నాడు.విష్ యూ హ్యాప్పీ బర్త్ డే రామ్ చరణ్.
Thursday, March 27, 2008
భారతీ రాజా కూరురు వివాహం సెప్టెంబర్ 1న
ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూతురు జనని వివాహం సెప్టెంబర్ 1వ తేదీన చెన్నైలో జరుగనుంది. మలేషియాలోని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ తో జరుగనున్న ఈ పెళ్ళికి సంబధించిన నిశ్చితార్తం ఈరోజు చెన్నైలో జరిగింది.కాగా ప్రస్తుతం మలేషియాలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న రాజ్ కుమార్ తమిళనాడులోని మధురై జిల్లాకు చెందినవాడు. ఈరోజు చెన్నైలోని ఆకార్డ్ మెట్రోపాలిటన్ హోటల్ లో జనని, రాజ్ కుమార్ ల వివాహ నిశ్చితార్తం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధువులు, కొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సెప్టెంబర్ లో జరిగే వివాహాన్ని తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని భారతీరజా భావిస్తున్నట్లు సమాచారం.
"ఆవకాయ బిర్యాని"
"ఆనంద్", "గోదావరి", "హ్యాప్పీడేస్" చిత్రాల దర్శక, నిర్మాత శేఖర్ కమ్ముల తన తాజా ప్రాజెక్టు "ఆవకాయ బిర్యానీ" ని ప్రారంభించాడు. "ఆవకాయ బిర్యానీ" పేరుతో నిర్మించే ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల నిర్మాతగా మాత్రమే ఉంటూ, దర్శకత్వ బాధ్యతలను అనీష్ కురువిల్లాకు అప్పగించాడు.అనీష్ శేఖర్ తొలి చిత్రం "ఆనంద్" లో రాజాకు ఫ్రెండ్ పాత్రలో నటించాడు. అనీష్ చెప్పిన కథ బాగా నచ్చడంతో అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త నటీనటులు బిందు, కమల్ లు ఇందులో నటిస్తున్నారు.
Wednesday, March 26, 2008
బాలకృష్ణ "పాండురంగడు" వివరాలు ఉగాదికి...
వరుస అపజయాలను ఎదుర్కొన్న నందమూరి బాలకృష్ణ భక్తిరస చిత్రం "పాండురంగడు" తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భక్తిరసాల చిత్రీకరణలో అందెవేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో "పాండురంగడు" చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీని పూర్తి వివరాలను ఉగాది శుభదినాన తెలియజేయాలని దర్శకేంద్రులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ "భక్త పుండరీకుని"గా, "శ్రీకృష్ణుని"గా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. స్నేహ, టబు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు వేశ్యగా నటించడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి భారవి, వేటూరి, సుద్దాల అశోక్ తేజ, వేదవ్యాస్ కలాల నుంచి జాలువారే పాటలు ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.గతంలో వైవిధ్య పాత్రలలో వచ్చిన "ఆదిత్య 369", "భైరవ ద్వీపం", "శ్రీకృష్ణార్జున విజయం" సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విభిన్న తరహాలో రాబోతున్న "పాండురంగడు" చిత్రం కూడా బాలయ్య నటనాచాతుర్యంతో సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని ఆశిద్దాం.
Tuesday, March 25, 2008
పాక్లో విడుదలవనున్న "తారే జమీన్ పర్"
నటుడు అమీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం "తారే జమీన్ పర్" చిత్రం పాకిస్థాన్లో విడుదల కానునంది. ఈ చిత్రంతో పాటు, "రేస్" సినిమాను ఈనెల 28వ తేదీన విడుదల చేసేందుకు యూటీవీ సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. "తారే జమీన్ పర్" చిత్రానికి పాకిస్థాన్ సెన్సార్ బోర్డు యూనివర్సల్ సర్టిఫికేట్ (యు)ను జారీ చేసింది. "తారే జమీన్ పర్" చిత్రానికి ఎ
క్కడా సెన్సార్ కత్తెర వేయకుండా పాకిస్తాన్ సెన్సార్ అనుమతిని ఇచ్చింది. అలాగే "రేస్" చిత్రంలో అక్కడకడ్కడా సెన్సార్ కట్ చేసి యూ/ఏ సర్టిఫికేట్తో విడుదల చేసేందుకు పాక్ బోర్డు అనుమతి ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ హక్కులను కలిగిన యూటీవీ సంస్థ పాకిస్థాన్లోని ఐదు ముఖ్య నగరాల్లో విడుదల చేయనుంది. ఒక్కో నగరం
లో ఐదు సినిమా థియేటర్లలో ఈ చిత్రాలు విడుదల చేస్తున్నారు. యూటీవీ గతంలో "గోల్" చిత్రాన్ని విడుదల చేసింది.
Monday, March 24, 2008
Saturday, March 22, 2008
అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తొలి పది మంది కథానాయికలు
(Courtesy: Show Buzz)
ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తొలి పది మంది కథానాయికలు వరుసగా ఈ క్రింది విధంగా ఉన్నారు.
Friday, March 21, 2008
Thursday, March 20, 2008
అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు

అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు. నటన భూషణ శోభన్ బాబు గురువారం ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. యోగా చేస్తుండగా ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. భక్త శబరి సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన శోభన్ బాబుకు అందాల నటుడిగా పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయనకు ఎనలేని అభిమానులున్నారు. ఇటీవల చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నటించిన చివరి సినిమా అడవి దొర. తెలుగు సినీ రంగంలో శోభన్ బాబుది ఒక ప్రత్యేక
అద్యాయం. శోభన్ బాబు పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ప్రముఖ తెలుగు కథానాయకులలో ఒకరిగా వెలుగొందిన ఈయన 14 జనవరి, 1937 రోజున జన్మించారు. అందమైన రూపం, క్రమశిక్షణ తో కూడిన సినీ జీవితం శోభన్ బాబుది. 1959లో విడుదలైన "దైవబలం" సినిమాలో శోభన్బాబుకు ఒక చిన్నపాత్ర లభించింది.1960లో విడుదలైన "భక్త శబరి"లో మునికుమారునిగా శోభన్ బాబుకు పాత్ర మరికాస్త ముఖ్యమైన పాత్ర లభించింది. ఇంకా "సీతారామ కళ్యాణం"లో లక్ష్మణుడు, "భీష్మ"లో అర్జునుడు, "లవకుశ"లో శత్రుఘ్నుడు వంటి పాత్రలలో నటించారు. "పుణ్యవతి", "చదువుకున్న అమ్మాయిలు", "పూలరంగడు", "ఇద్దరమ్మాయిలు", "బుద్ధిమంతుడు" వంటి సినిమాలలో కూడా నటించారు."వీరాభిమన్యు" సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. మొదట ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన శోభన్ బాబు 1965 వచ్చిన "వీరాభిమన్యు"తో సోలో హీరోగా నిలదొక్కుకున్నారు. అప్పటి నుంచి 1997లో "మనుషులు మారాలి" సినిమా వరకు ఆయ
న వెనక్కి చూడలేదు. "గోరింటాకు", "మల్లెపువ్వు", "శారద", "బలిపీఠం", "ముందడుగు", "కార్తీక దీపం" వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు ఐదు సార్లు "నంది అవార్డులు" వచ్చాయి. నాలుగు సార్లు ఆయన "ఫిల్మ్ ఫేర్ అవార్డులు" అందుకున్నారు. తన సమకాలీన నటుడు కృష్ణతో కలిసి ఆయన మంచిమిత్రులు, "కురుక్షేత్రం" వంటి సినిమాల్లో నటించాడు. ఏ మాత్రం బేషజాలు లేని నటుడిగా శోభన్ బాబుకు పేరుంది.శోభన్ బాబు మొత్తం 220పైగా చిత్రాలలో నటించారు.
అద్యాయం. శోభన్ బాబు పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ప్రముఖ తెలుగు కథానాయకులలో ఒకరిగా వెలుగొందిన ఈయన 14 జనవరి, 1937 రోజున జన్మించారు. అందమైన రూపం, క్రమశిక్షణ తో కూడిన సినీ జీవితం శోభన్ బాబుది. 1959లో విడుదలైన "దైవబలం" సినిమాలో శోభన్బాబుకు ఒక చిన్నపాత్ర లభించింది.1960లో విడుదలైన "భక్త శబరి"లో మునికుమారునిగా శోభన్ బాబుకు పాత్ర మరికాస్త ముఖ్యమైన పాత్ర లభించింది. ఇంకా "సీతారామ కళ్యాణం"లో లక్ష్మణుడు, "భీష్మ"లో అర్జునుడు, "లవకుశ"లో శత్రుఘ్నుడు వంటి పాత్రలలో నటించారు. "పుణ్యవతి", "చదువుకున్న అమ్మాయిలు", "పూలరంగడు", "ఇద్దరమ్మాయిలు", "బుద్ధిమంతుడు" వంటి సినిమాలలో కూడా నటించారు."వీరాభిమన్యు" సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. మొదట ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన శోభన్ బాబు 1965 వచ్చిన "వీరాభిమన్యు"తో సోలో హీరోగా నిలదొక్కుకున్నారు. అప్పటి నుంచి 1997లో "మనుషులు మారాలి" సినిమా వరకు ఆయ
న వెనక్కి చూడలేదు. "గోరింటాకు", "మల్లెపువ్వు", "శారద", "బలిపీఠం", "ముందడుగు", "కార్తీక దీపం" వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు ఐదు సార్లు "నంది అవార్డులు" వచ్చాయి. నాలుగు సార్లు ఆయన "ఫిల్మ్ ఫేర్ అవార్డులు" అందుకున్నారు. తన సమకాలీన నటుడు కృష్ణతో కలిసి ఆయన మంచిమిత్రులు, "కురుక్షేత్రం" వంటి సినిమాల్లో నటించాడు. ఏ మాత్రం బేషజాలు లేని నటుడిగా శోభన్ బాబుకు పేరుంది.శోభన్ బాబు మొత్తం 220పైగా చిత్రాలలో నటించారు. భూలోకంలో మరో డ్రాగన్ వార్ "డి-వార్"
కొరియాలో నిర్మింపబడి ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన "డి-వార్" చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ భారత దేశంలో విడుదల చేయనుంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులలో తప్ప మిగిలిన అన్ని రాష్టాలలో ఈ చిత్రాన్ని పిరమిడ్ విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రంపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి.
Wednesday, March 19, 2008
రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (19-03-2008)
(Courtesy: Motion Picture Association of America, Inc)
Ratings for Movies Debuting in Theaters This Week
DRILLBIT TAYLOR
Rating: PG-13
(for crude sexual references throughout, strong bullying, language, drug references and partial nudity)
Rating: PG-13
(for crude sexual references throughout, strong bullying, language, drug references and partial nudity)
THE HAMMERRating: R
(for brief language)
SHUTTERRating: PG-13
(for terror, disturbing images, sexual content and language)
TYLER PERRY'S MEET THE BROWNSRating: PG-13
(for drug content, language including sexual references, thematic elements and brief violence)
UNDER THE SAME MOONRating: PG-13
for some mature thematic elements
RATINGS GUIDEG: GENERAL AUDIENCES (All Ages Admitted)
PG: PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శివ "భవాని(రఘువరన్)" ఇక లేరు
ప్రముఖ సినీనటుడు రఘువరన్ నేటి ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. అనేక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన ప్రధానంగా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించారు."మిస్టర్ భరత్" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు వచ్చిన రఘువరన్కు 59 ఏళ్లు. "శివ" చిత్రంలో ప్రతినాయుకుడుగా అత్యుత్తమనటన కనబరిచి అశేషాంధ్రప్రేక్షకులకు దగ్గరయ్యారు. రఘువరన్ మృతి పట్ల యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. పలు
వురు సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.1982లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రఘువరన్ అనేక దక్షిణాది చిత్రాల్లో నటించారు.ఏ పాత్ర వేసినా అందులో నిమగ్నం కావడం , ఆ పాత్ర తప్ప అయన ప్రేక్షకులకు కన్పించకపోవడం ఆయన ప్రత్యేకత.1989 లో "శివ" సినిమాతో ఆయన విలన్ గా ప్రాచుర్యం పొందారు. "భాషా","ముత్తు", "అరుణాచలం", "ఒకే ఒక్కడు" సినిమాల్లో ఆయన నటన అమోఘం. ఇటీవల "శివాజీ", "భీమ", "ఎవడైతే నాకేంటి" సినిమాల్లో నటించారు.
Tuesday, March 18, 2008
ప్రపంచ సినిమాపై పోస్టల్ స్టాంప్స్ (ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ)
Moviemaker D W Griffith
Director Alfred Hitchcock
Hollywood legend Charlie Chaplin
Exclusive Stamps Collecton on "James Bond 007" films
Exclusive Stamp on "Lord of the Rings"
Exclusive Stamp on Marlyn Monroe
Exclusive Stamp collection on Hollywood Movie Monsters
Russian Stamp on Moviemaker, Director Shostakov
Exclusive Stamp on "Shrek"
Exclusive Stamp on "Star Wars- YODA"Movie Maker A.V.Meyyappa Chettiyar
Monday, March 17, 2008
పవన్ కళ్యాణ్, ఇలియానాల "జల్సా"...(ఒక సరదా కథ)
ఏం చేద్దామబ్బా, డిస్కోకు వెల్లక చాన్నాళ్ళవుతోంది, కూడా రావడానికి ఒక్క అమ్మాయీ దొరకట్లేదు
అరె, పవన్ కళ్యాణ్ లాగుందే, డిస్కోకు రమ్మంటే వస్తాడా, ట్రై చేసి చూద్దాం...
నువ్వు, ఇలియానావి కదూ, బలేగా కలుసుకున్నాం, ఈ సందర్బంలో పబ్ కు వెల్దామా...తంతే గారెల బుట్టలో పడ్డట్లు, పవన్ తో డిస్కో, భలే మజాగా ఉందిలే......(ఇలియానా)
తంతే బూరెల బుట్టలో పడ్డట్లు, ఇలియానాతో డిస్కో, భలే హాయిగా ఉందిలే...(పవన్ కళ్యాణ్)
Saturday, March 15, 2008
చిరంజీవి రాజకీయ పార్టీ: ఎక్స్ క్లూజివ్ డిటైల్స్
1. చిరంజీవి తన రాజకీయ పార్టీని ఏప్రిల్ నెలలో ప్రకటించనున్నట్లు తెలిసింది.
2. పార్టీ కార్యాలయానికి సంబంధించిన డిజైనింగ్ పనులు పూర్తయ్యాయి. మునిసిపల్ ఇతరత్రా పర్మిషన్లకోసం త్వరలో అప్లై చేయనున్నారు.
3. పార్టీ కార్యాలయం కోసం జూబిలీ హిల్స్ లోని రోడ్ నంబర్ 46లో 1800ల చదరపు గజాల ప్లాట్ ను ఎన్నుకోవడం జరిగింది.
4. లండన్ కు చెందిన డా.మిత్ర ఆర్గనైజేషనల్ చార్ట్ తయారు చేశారు. దీనికి చిరంజీవి అనుమతి కూడా లభించింది. ఈ డా.మిత్రా నెల్లూరు జిల్లాకు చెందిన ఒకప్పటి ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుని పెద్ద కుమారునిగా తెలిసింది.
5. కోస్తా జిల్లాలలో అభిమానులతో సమావేశాలు పూర్తి చేసిన చిరంజీవి సోదరుడు నాగబాబు, ఈ నెల 18వ తేదీనుంచి రాయలసీమ జిల్లాలలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన తొలి సమావేశాన్ని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఒక అజ్ణాత ప్రాంతంలో జరిగే ఈ సమావేశానికి తమ అభిమాన సంఘాలవారిని, మద్దతుదారులను సెల్ ఫోన్లు లేకుండా రావాలని నాగబాబు నిభంధన విధించినట్లు సమాచారం.
6. అల్లు అరవింద్, నాగ బాబులు డిల్లీలో తమ లాయర్లతో చర్చించి త్వరలోనే ఎలక్షన్ కమిషన్ కు తమ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ ను పెట్టనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్లు సమాచారం.
7. "ప్రత్యేక తెలంగాణా" అంశానికి కాకుండా, "సమ్యుక్త ఆంధ్రప్రదేశ్" నినాదంతో చిరంజీవి ప్రజలలోకి వెళ్ళనున్నట్లు సమాచారం.అలగే తమ తొలి రాజకీయ సమావేశాన్ని, పార్టీకి సంబంధించిన ప్రకటనను విజయవాడలో జరిపే బహిరంగ సభలో ప్రకటించనున్నట్లు తెలిసింది. అందరూ భావిస్తున్నట్లు చిరంజీవి తొలి రాజకీయ సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించక పోవచ్చు.
8. పార్టీకి సంబంధించిన అభ్యర్తులను ప్రకటించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు అభ్యర్తనలను, బయోడేటాలను చిరంజీవి స్వీకరించి, పరిశీలిస్తున్నట్లు సమాచారం.
9. చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాన్ మాత్రం ఎలక్షన్ల అనంతరం రాజకీయ రంగంలో కాకుండా, సినీ రంగంలోనే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిసింది.
2. పార్టీ కార్యాలయానికి సంబంధించిన డిజైనింగ్ పనులు పూర్తయ్యాయి. మునిసిపల్ ఇతరత్రా పర్మిషన్లకోసం త్వరలో అప్లై చేయనున్నారు.
3. పార్టీ కార్యాలయం కోసం జూబిలీ హిల్స్ లోని రోడ్ నంబర్ 46లో 1800ల చదరపు గజాల ప్లాట్ ను ఎన్నుకోవడం జరిగింది.
4. లండన్ కు చెందిన డా.మిత్ర ఆర్గనైజేషనల్ చార్ట్ తయారు చేశారు. దీనికి చిరంజీవి అనుమతి కూడా లభించింది. ఈ డా.మిత్రా నెల్లూరు జిల్లాకు చెందిన ఒకప్పటి ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుని పెద్ద కుమారునిగా తెలిసింది.
5. కోస్తా జిల్లాలలో అభిమానులతో సమావేశాలు పూర్తి చేసిన చిరంజీవి సోదరుడు నాగబాబు, ఈ నెల 18వ తేదీనుంచి రాయలసీమ జిల్లాలలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన తొలి సమావేశాన్ని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఒక అజ్ణాత ప్రాంతంలో జరిగే ఈ సమావేశానికి తమ అభిమాన సంఘాలవారిని, మద్దతుదారులను సెల్ ఫోన్లు లేకుండా రావాలని నాగబాబు నిభంధన విధించినట్లు సమాచారం.
6. అల్లు అరవింద్, నాగ బాబులు డిల్లీలో తమ లాయర్లతో చర్చించి త్వరలోనే ఎలక్షన్ కమిషన్ కు తమ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ ను పెట్టనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్లు సమాచారం.
7. "ప్రత్యేక తెలంగాణా" అంశానికి కాకుండా, "సమ్యుక్త ఆంధ్రప్రదేశ్" నినాదంతో చిరంజీవి ప్రజలలోకి వెళ్ళనున్నట్లు సమాచారం.అలగే తమ తొలి రాజకీయ సమావేశాన్ని, పార్టీకి సంబంధించిన ప్రకటనను విజయవాడలో జరిపే బహిరంగ సభలో ప్రకటించనున్నట్లు తెలిసింది. అందరూ భావిస్తున్నట్లు చిరంజీవి తొలి రాజకీయ సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించక పోవచ్చు.
8. పార్టీకి సంబంధించిన అభ్యర్తులను ప్రకటించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు అభ్యర్తనలను, బయోడేటాలను చిరంజీవి స్వీకరించి, పరిశీలిస్తున్నట్లు సమాచారం.
9. చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాన్ మాత్రం ఎలక్షన్ల అనంతరం రాజకీయ రంగంలో కాకుండా, సినీ రంగంలోనే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిసింది.
"గజిని" భామిని ఆసిన్ (కొత్త ఫోటోలు)
పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదు:నమిత
పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదని నటి నమిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో తమిళ పత్రికలు అమె సెక్సీ ఫోటోలతో దాని మీద రకరకాల వ్యాఖ్యానాలను ప్రచురిస్తున్నాయి. గతంలో పెళ్ళికి ముందు సెక్స్ సుఖం అనుభవించడం తప్పు కాదని ఒక నాటి హీరోయిన్ ఖుష్బూ ధైర్యంగా చెప్పి వార్తల్లోకి వచ్చింది. తన మీద ఎంత దుమారం చెలరేగినా, కోర్టులో కేసులు పడినా ఆమె ఇప్పటికీ తన స్టేట్ మెంట్ మీద వెనక్కి తగ్గలేదు. ఆ వివాదంతో పాపులర్ అయిన ఆమెకు ఎడ్వర్టయిజ్ మెంట్లు, ఇతరత్రా చాలా అవకాశాలు కలిసి వచ్చాయి. సెక్స్ మీద సంచలన ప్రకటనలు చేసిన సుహాసిని, సమీరారెడ్డి, కరీనా వార్తల్లోకి వచ్చి ప్రచారంలో ఉండిపోయిన విషయం తెలిసిందే.తాజాగా నటి నమిత కూడా ఎప్పుడూ వార్తలలో ఉండటంకోసం, లేక భారీ ప్రకటన కర్తలను ఆకర్శించడం కోసమే ఈ రకమైన ప్రకటనలు చేస్తోందని తమిళనాట ఒక వర్గం అనుకుంటున్నా, తన చిత్రాలతో భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న నమిత ప్రకటనలకోసం కాకుండా, స్వయంగా తన అభిప్రాయాన్నే వ్యక్తం చేశారని తమిళనాట అధికంగా ప్రచారం జరుగుతోంది. మరి ఈమె ప్రకటనలకు ముందు ముందు ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో వేచిచూస్తేగానీ తెలీదు.
Friday, March 14, 2008
రజినీకాంత్ విడుదల చేయనున్న ఎన్టీఆర్ "కంత్రి" ఆడియో
యంగ్ ఎన్టీఆర్ "కంత్రి" సినిమా ఆడియోను ప్రముఖ దక్షిణాది నటుడు రజినీకాంత్ విడుదల చేయనున్నాడు. ఈ చిత్రం యొక్క విదేశీ ప్రదర్శన హక్కులను కెఎడి ఎంటర్ టైన్ మెంట్ సంస్ధ చేజిక్కించుకుంది. వైజయంతి మూవీస్ బ్యానరుపై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హన్సిక మోత్వాని, తనీష్ నటించారు. ఈ వేసవిలోనే విడుదల కానున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్ కు
అసోసియేట్ గా అనేక సినిమాలకు పని చేసిన మెహెర్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఎన్టీఆర్ గతంలో నటించిన "ఆంధ్రావాలా" చిత్రాన్ని కన్నడంలో దర్శకత్వం వహించి సంచలన విజయాన్ని చేకూర్చిన మెహర్ రమేష్ కు దర్శకుడిగా ఇది తొలి తెలుగు చిత్రం. మణీశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం పాటల సీడీ, కేసెట్లు ఈ నెల మూడో వారంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.
Wednesday, March 12, 2008
రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (12-03-2008)
(Courtesy: Motion Picture Association of America, Inc)
(అంతర్జాతీయంగా అత్యంత ప్రఖ్యాతి గాంచిన అమెరికన్ మోషన్ ఫిక్చర్ అసోసియేషన్ ఈ వారం హాలీవుడ్ లో విడుదలకాబోతున్న చిత్రాలకు రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ నిర్ణయించింది. ప్రతిష్టాత్మకమైన ఆ రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (12-03-2008) మీకోసం)
DOOMSDAY
Rating: R
(for strong bloody violence, language and some sexual content/nudity)
DOOMSDAY
Rating: R
(for strong bloody violence, language and some sexual content/nudity)
DR. SUESS' HORTON HEARS A WHO
Rating: G
(all ages admitted)
FUNNY GAMESRating: R
(for terror, violence and some language)
THE GRANDRating: R
(for language and some drug content)
NEVER BACK DOWNRating: PG-13
(for mature thematic material involving intense sequences of violence, some sexuality, partying and language - all involving teens)
SLEEPWALKINGRating: R
(for language and a scene of violence)
RATINGS GUIDEG: GENERAL AUDIENCES (All Ages Admitted)
PG: PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
Tuesday, March 11, 2008
దీపామెహతా దర్శకత్వంలో నటించనున్న "శ్రియ"

తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన హీరోయిన్ శ్రియ. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసిన లక్కీభామ. ఈ భామ తాజాగా బాలీవుడ్పై దృష్టిసారించింది. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు విరివిగా వస్తుండటంతో ఆమె దక్షిణచిత్ర సీమకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన దీపామెహతా దర్శకత్వంలో శ్రియ నటించనుంది. దీపా
మెహతా గతంలో "ఫైర్", "వాటర్" వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన విషయం తెల్సిందే.అమీర్ ఖాన్, నందితాదాస్, జాన్ అబ్రహాం లు దీపామెహతా దర్శకత్వంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.ఇప్పుడు వీరి సరసన శ్రియ చేరుతోంది.ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఈ తాజా చిత్రం షూటింగ్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైనట్లు తెలిసింది. ఇందులో సీమా బిశ్వాస్ కూడా ఒక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం శ్రియ, విక్రమ్ హీరోగా నటిస్తున్న "మల్లన్న" ద్విభాషా చిత్రంలో నటిస్తోంది.
మెహతా గతంలో "ఫైర్", "వాటర్" వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన విషయం తెల్సిందే.అమీర్ ఖాన్, నందితాదాస్, జాన్ అబ్రహాం లు దీపామెహతా దర్శకత్వంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.ఇప్పుడు వీరి సరసన శ్రియ చేరుతోంది.ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఈ తాజా చిత్రం షూటింగ్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైనట్లు తెలిసింది. ఇందులో సీమా బిశ్వాస్ కూడా ఒక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం శ్రియ, విక్రమ్ హీరోగా నటిస్తున్న "మల్లన్న" ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. Monday, March 10, 2008
మహానటి సావిత్రి
తెలుగు సినీ ప్రపంచం లో మహానటి, కొమ్మారెడ్డి సావిత్రి (1937 డిసెంబర్ 6 - 1981 డిసెంబర్ 26) . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది.తొలి జీవితం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1937 డిసెంబర్ 6 న కొమ్మారెడ్డి గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. తన ఆరవ యేటనే తండ్రిని కోల్పోవడము వలన మామ? యొక్క సహాయముతో విజయవాడ లోని కస్తూరీబాయి మెమోరియల్ పాఠశాలలో మూడవ ఫారం (8వ తరగతి) వరకు చదువుకున్నది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో చిన్నతనంలోనే ప్రదర్శనలు
ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా నవభారత నాట్యమండలిని నడిపింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.
ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా నవభారత నాట్యమండలిని నడిపింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.చలనచిత్ర జీవితం
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలతో తెలుగు సినిమాలలో అరంగేట్రం చేసింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ మిస్సమ్మ సినిమాలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.
ఆమె తమిళచిత్రాలలోనూ నటించి, పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. అయితే అది
అంత విజయం సాధించలేదు. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి చెడిపోయింది. ఆస్తిపాస్తులూ కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.
ఇతర విశేషాలు
ఆమె తమిళచిత్రాలలోనూ నటించి, పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. అయితే అది
అంత విజయం సాధించలేదు. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి చెడిపోయింది. ఆస్తిపాస్తులూ కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.ఇతర విశేషాలు
మల్లెపూలు, వర్షం సావిత్రి ఇష్టాలు. ఆమెది ఎడమచేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెటు మ్యాచు ఉంటే దానిని ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజులలోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగుదంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా ఆమె దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమం
దిని తరుచూ అనుకరించేవారు. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
ఆమె సినిమాలు
నటిగాసంసారం (1950) అగ్నిపరీక్ష (1951) పాతాళబైరవి (1951)లో నృత్యకారిణి పెళ్ళిచేసిచూడు (1952)లో సావిత్రి పల్లెటూరు (1952)లో సుగుణ ప్రతిఙ (1953) దేవదాసు (1953)లో పార్వతి బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు మేనరికం (1954) చంద్రహారం (1954)లో చంచల బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా) పరివర్తన (1954)లో సుందరమ్మ వదిన (1955) మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా) మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి అర్ధాంగి (1955) సంతానం (1955)లో శారద కన్యాశుల్కం (1955)లో మధురవాణి దొంగరాముడు (1955)లో సీత చరణదాసి (1956)లో లక్ష్మి భలేరాముడు (1956) అమరదీపం (1956)లో అరుణ వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి తోడికోడలు (1957)లో సుశీల ఎమెల్యే(ం.ళ్.ఆ.) (1957)లో నిర్మల మాయాబజార్ (1957)లో శశిరేఖ మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల మాంగల్యబలం (1958) అప్పుచేసిపప్పుకూడు (1958)లో మంజరి నమ్మినబంటు (1959) విమల (1960) శీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి శాంతినివాసం (1960) దీపావళి (1960) చివరకుమిగిలేది (1960)లో పద్మ పాపపరిహారం (1961) పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ పాండవవనవాసం (1961)లో ద్రౌపది కలసివుంటేనేకలదుసుఖం (1961) సిరిసంపదలు (1962) పవిత్రప్రేమ (1962) మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా) మంచిమనసులు (1962) ఆరాధన (1962)లో అనూరాధ గుండమ్మకధ (1962)లో లక్ష్మి రక్తసంబందం (1962) ఆత్మబంధువు (1962) రక్తతిలకం (1963)లో కమల మూగమనసులు (1963)లో రాధ కర్ణలో (1963) భానుమతి కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి ఘర్ బసాకేదేకో (1963) (హిందీ సినిమా) చదువుకున్నఅమ్మాయిలు (1963)లో సుజాత నర్తనశాల (1963)లో ద్రౌపది వెలుగునీడలు (1964)లో సుగుణ పూజాఫలం (1964)లో సీత నవరాత్రి (1964) కైకొడుతదైవం (1964) (తమిళ సినిమా) గంగా కీ లెహరైన్ (1964) (హిందీ సినిమా) డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి దేవత (1964) సుమంగళి (1965) తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిద రూపములలో నటించింది. నాదీఆడజన్మే (1965) మనుషులుమమతలు (1965) నవరాత్రి (1966) భక్తపోతన (1966)లో సరస్వతీదేవి ప్రాణమిత్రులు (1967) వరకట్నం (1968) తల్లితండ్రులు (1970)లో కౌసల్య మరోప్రపంచం (1970) అశ్వథామ (1970)లో కుంజుని భార్య జగన్మోహిని (1978) అందరికంటేమొనగాడు (1985) గోరింటాకు (చివరి సినిమా)
దిని తరుచూ అనుకరించేవారు. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.ఆమె సినిమాలు
నటిగాసంసారం (1950) అగ్నిపరీక్ష (1951) పాతాళబైరవి (1951)లో నృత్యకారిణి పెళ్ళిచేసిచూడు (1952)లో సావిత్రి పల్లెటూరు (1952)లో సుగుణ ప్రతిఙ (1953) దేవదాసు (1953)లో పార్వతి బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు మేనరికం (1954) చంద్రహారం (1954)లో చంచల బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా) పరివర్తన (1954)లో సుందరమ్మ వదిన (1955) మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా) మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి అర్ధాంగి (1955) సంతానం (1955)లో శారద కన్యాశుల్కం (1955)లో మధురవాణి దొంగరాముడు (1955)లో సీత చరణదాసి (1956)లో లక్ష్మి భలేరాముడు (1956) అమరదీపం (1956)లో అరుణ వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి తోడికోడలు (1957)లో సుశీల ఎమెల్యే(ం.ళ్.ఆ.) (1957)లో నిర్మల మాయాబజార్ (1957)లో శశిరేఖ మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల మాంగల్యబలం (1958) అప్పుచేసిపప్పుకూడు (1958)లో మంజరి నమ్మినబంటు (1959) విమల (1960) శీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి శాంతినివాసం (1960) దీపావళి (1960) చివరకుమిగిలేది (1960)లో పద్మ పాపపరిహారం (1961) పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ పాండవవనవాసం (1961)లో ద్రౌపది కలసివుంటేనేకలదుసుఖం (1961) సిరిసంపదలు (1962) పవిత్రప్రేమ (1962) మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా) మంచిమనసులు (1962) ఆరాధన (1962)లో అనూరాధ గుండమ్మకధ (1962)లో లక్ష్మి రక్తసంబందం (1962) ఆత్మబంధువు (1962) రక్తతిలకం (1963)లో కమల మూగమనసులు (1963)లో రాధ కర్ణలో (1963) భానుమతి కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి ఘర్ బసాకేదేకో (1963) (హిందీ సినిమా) చదువుకున్నఅమ్మాయిలు (1963)లో సుజాత నర్తనశాల (1963)లో ద్రౌపది వెలుగునీడలు (1964)లో సుగుణ పూజాఫలం (1964)లో సీత నవరాత్రి (1964) కైకొడుతదైవం (1964) (తమిళ సినిమా) గంగా కీ లెహరైన్ (1964) (హిందీ సినిమా) డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి దేవత (1964) సుమంగళి (1965) తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిద రూపములలో నటించింది. నాదీఆడజన్మే (1965) మనుషులుమమతలు (1965) నవరాత్రి (1966) భక్తపోతన (1966)లో సరస్వతీదేవి ప్రాణమిత్రులు (1967) వరకట్నం (1968) తల్లితండ్రులు (1970)లో కౌసల్య మరోప్రపంచం (1970) అశ్వథామ (1970)లో కుంజుని భార్య జగన్మోహిని (1978) అందరికంటేమొనగాడు (1985) గోరింటాకు (చివరి సినిమా)
నిర్మాతగా
ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)
దర్శకురాలిగా
మాతృదేవత (1970)
ఇతరములు
నవరాత్రి (1966) సినిమాలో నేపధ్య గాయని
Saturday, March 8, 2008
ఒక మంచి సినిమా "గమ్యం"

స్క్రీన్ప్లే ప్రధానంగా కొనసాగుతూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న "గమ్యం" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఒకప్పుడు "ఐతే", "ఆనంద్" ల లాగా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని పత్రికలు రివ్యూలను ప్రచురించాయి. శర్వానంద్ ముఖ్య భూమికతో, అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రతో సాగే ఈ చిత్రంలో కమిలినీ ముఖర్జీ హీరోయిన్గా నటించింది.
మూస పాత్రలు, కొత్తదనం లోపించిన కథలతో విసుగు చెందిన తెలుగు ప్రేక్షకుడు కాస్త రిలాక్స్ కావాలంటే గమ్యం చిత్రం చూడొచ్చు. కథా విషయాని కొస్తే డబ్బులోనే పుట్టి పెరిగిన ఓ యువకుడు బయట ప్రపంచాన్ని చూస్తే అందులో అతనికి ఎదురైన సంఘటనలు ఎలా ఉంటాయో అన్న పాయింటుకు తెర రూపమే ఈ చిత్రం.
ప్లాస్ బ్యాక్లను పక్కన పెట్టి చెప్పాలంటే అభిరామ్ (శర్వానంద్) ఓ ధనవంతుని కుమారుడు. పదివేల కోట్లకు వారసుడైన ఇతను డబ్బే లోకంగా పెరుగుతాడు. ఓ సారి స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళమివ్యడానికి వెళ్లి అక్కడి సేవ చేస్తున్న వైద్య విద్యార్ధిని జానకి (కమిలిని ముఖర్జీ)పై మనసు పడతాడు.
అయితే ఆమెను వారంలోనే ప్రేమలో పడేస్తానని మిత్రునితో ఛాలెంజ్ చేసిన అభిరామ్ జానకిని పుట్టినరోజు పార్టీకి ఆహ్వానిస్తాడు. ఆ పార్టీలో అభిరామ్కు తన ప్రేమను చెప్పాలని వచ్చే జానకికి అభిరామ్ పందెం విషయం తెలిసి అతన్ని అసహ్యించుకుంటుంది. కానీ తాను నిజంగానే ప్రేమిస్తున్నానని అభిరామ్ చెప్పినా జానకి నమ్మదు.
దీంతో అభిరామ్ ఆమెను కారులో ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. వీరి గొడవ సమయంలో కారు అదుపుతప్పి యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఆస్పత్రిలో కళ్లు తెరచిన అభిరామ్కు జానకి కన్పించదు. దీంతో ఆమెను వెతకడానికి బైక్ మీద బయలుదేరుతాడు అభిరామ్. ఈ సమయంలో అభిరామ్కు గాలి శ్రీను (అల్లరి నరేష్) పరిచయం అవుతాడు. అభిరామ్ తన పయనంలో అనేక మంది వ్యక్తుల్ని కలుస్తాడు. చివరకు నక్సలైట్లను సైతం కల్సుకుంటాడు. ఇలా అన్ని చోట్లా జానకి గురించి వెతికే అభిరామ్ చివరకు ఆమెను ఏవిదంగా కలుసుకున్నాడు, ఆ తర్వాతేం జరిందో తెలియజెప్పే చిత్రమే ఈ "గమ్యం". మొత్తంగా చూస్తే కథ బలహీనమైనా ప్రేక్షకునికి ఆ లోటు కన్పించకుండా కథనాన్ని ముందుకు నడిపిన తీరు బాగుంది. ఆర్టిస్టుగా శర్వానంద్ మంచి పరిణితి సాధించాడు. అల్లరి నరేష్ పాత్ర కూడా ఈ సినిమాకు హైలెట్గా నిలిచింది. హీరోయిన్గా కమిలిని నటన ఆకట్టుకుంటుంది. చిత్రంలోని సంభాషణలు కొన్ని చోట్ల అద్భుతంగా వచ్చాయి. సినిమా మలిచిన దర్శకుని ప్రతిభను ప్రశంసించవచ్చు. ఈ చిత్రానికి సంగీతం సైతం చక్కగా కుదిరింది.
మూస పాత్రలు, కొత్తదనం లోపించిన కథలతో విసుగు చెందిన తెలుగు ప్రేక్షకుడు కాస్త రిలాక్స్ కావాలంటే గమ్యం చిత్రం చూడొచ్చు. కథా విషయాని కొస్తే డబ్బులోనే పుట్టి పెరిగిన ఓ యువకుడు బయట ప్రపంచాన్ని చూస్తే అందులో అతనికి ఎదురైన సంఘటనలు ఎలా ఉంటాయో అన్న పాయింటుకు తెర రూపమే ఈ చిత్రం.
ప్లాస్ బ్యాక్లను పక్కన పెట్టి చెప్పాలంటే అభిరామ్ (శర్వానంద్) ఓ ధనవంతుని కుమారుడు. పదివేల కోట్లకు వారసుడైన ఇతను డబ్బే లోకంగా పెరుగుతాడు. ఓ సారి స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళమివ్యడానికి వెళ్లి అక్కడి సేవ చేస్తున్న వైద్య విద్యార్ధిని జానకి (కమిలిని ముఖర్జీ)పై మనసు పడతాడు.
అయితే ఆమెను వారంలోనే ప్రేమలో పడేస్తానని మిత్రునితో ఛాలెంజ్ చేసిన అభిరామ్ జానకిని పుట్టినరోజు పార్టీకి ఆహ్వానిస్తాడు. ఆ పార్టీలో అభిరామ్కు తన ప్రేమను చెప్పాలని వచ్చే జానకికి అభిరామ్ పందెం విషయం తెలిసి అతన్ని అసహ్యించుకుంటుంది. కానీ తాను నిజంగానే ప్రేమిస్తున్నానని అభిరామ్ చెప్పినా జానకి నమ్మదు.
దీంతో అభిరామ్ ఆమెను కారులో ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. వీరి గొడవ సమయంలో కారు అదుపుతప్పి యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఆస్పత్రిలో కళ్లు తెరచిన అభిరామ్కు జానకి కన్పించదు. దీంతో ఆమెను వెతకడానికి బైక్ మీద బయలుదేరుతాడు అభిరామ్. ఈ సమయంలో అభిరామ్కు గాలి శ్రీను (అల్లరి నరేష్) పరిచయం అవుతాడు. అభిరామ్ తన పయనంలో అనేక మంది వ్యక్తుల్ని కలుస్తాడు. చివరకు నక్సలైట్లను సైతం కల్సుకుంటాడు. ఇలా అన్ని చోట్లా జానకి గురించి వెతికే అభిరామ్ చివరకు ఆమెను ఏవిదంగా కలుసుకున్నాడు, ఆ తర్వాతేం జరిందో తెలియజెప్పే చిత్రమే ఈ "గమ్యం". మొత్తంగా చూస్తే కథ బలహీనమైనా ప్రేక్షకునికి ఆ లోటు కన్పించకుండా కథనాన్ని ముందుకు నడిపిన తీరు బాగుంది. ఆర్టిస్టుగా శర్వానంద్ మంచి పరిణితి సాధించాడు. అల్లరి నరేష్ పాత్ర కూడా ఈ సినిమాకు హైలెట్గా నిలిచింది. హీరోయిన్గా కమిలిని నటన ఆకట్టుకుంటుంది. చిత్రంలోని సంభాషణలు కొన్ని చోట్ల అద్భుతంగా వచ్చాయి. సినిమా మలిచిన దర్శకుని ప్రతిభను ప్రశంసించవచ్చు. ఈ చిత్రానికి సంగీతం సైతం చక్కగా కుదిరింది.
"జోధా అక్బర్" ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది: ఐశ్వర్య రాయ్
"జోధా అక్బర్" హిట్ కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ బాలివుడ్ నటి ఐశ్వర్య పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు దర్శకుడు రిసెర్చ్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రం విజయం తమ యూనిట్లో ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని పంచి పెట్టిందన్నారు. ఈ చిత్రాన్ని ను
తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.ఇటీవల హైదరాబాద్లో "జోధా అక్బర్" తెలుగు వెర్షన్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కథకు తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా చక్కగా సమకూరిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
దర్శకుడు అశుతోశ్ గోవారికర్ మాట్లాడుతూ హిందీ అర్ధం కాని తెలుగు సినీ అభి
మానులకు తమ కథను చూపాలనే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించామన్నారు. హీరో హృతిక్ మాట్లాడుతూ మొదట్లో కొంత సందేహం ఉన్నప్పటికీ, ఈ చిత్రంలో హీరో పాత్రను సవాల్గా తీసుకుని పోషించానన్నారు.
Friday, March 7, 2008
వేసవిలో ప్రేక్షకుల ముందుకు జగపతిబాబు "హోమం"
జగపతిబాబు, మమతామోహన్దాస్ జంటగా నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "హోమం" చిత్రం ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి సైతం ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను ముగించుకుని తదుపరి కార్యక్రమాల్లో కొనసాగుతోంది. ఈ చిత్ర కథ మాఫీయా నేపథ్యంలో కొనసాగుతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు నితిన్ రైక్వార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Thursday, March 6, 2008
పవన్ "పులి"లో కరీనా కపూర్ లేదా ప్రియాంక చోప్రా
పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం "పులి"లో హీరోయిన్ గా బాలీవుడ్ తారామణులు కరీనా లేదా ప్రియాంక నటించే అవకాశాలున్నాయి. వారిలో ఒకరిని ఫిక్స్ చేయడానికి పవన్ తరఫున ఆయన మ
నుషులు ప్రయత్నిస్తున్నారు.పవన్ "పులి" సినిమాకు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించనున్నారు. ఇలా ఉండగా పవన్ తాజా చిత్రం "జల్సా" బిజినెస్ రికార్డు స్ధాయిలో జరగడంతో నిర్మాత ఆనందంగా ఉన్నారు. జల్సా ఆడియో ఇటీవల విడుదలై అభిమానులను అలరిస్తోంది.
Wednesday, March 5, 2008
రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (05-03-2008)
అంతర్జాతీయంగా అత్యంత ప్రఖ్యాతి గాంచిన అమెరికన్ మోషన్ ఫిక్చర్ అసోసియేషన్ ఈ వారం హాలీవుడ్ లో విడుదలకాబోతున్న చిత్రాలకు రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ నిర్ణయించింది. ప్రతిష్టాత్మకమైన ఆ రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (05-03-2008) మీకోసం.
10,000 B.C.
Rating: PG-13
for sequences of intense action and violence
THE BANK JOB
Rating: R
for sexual content, nudity, violence and language
CJ7
Rating: PG
for language, thematic material, some rude humor and brief smoking
COLLEGE ROAD TRIP
Rating: G
all ages admitted
GIRLS ROCK!
Rating: PG
for thematic elements and language
MARRIED LIFE
Rating: PG-13
for some thematic elements and a scene of sexuality
MISS PETTIGREW LIVES FOR A DAY
Rating: PG-13
for some partial nudity and innuendo
PARANOID PARK
Rating: R
for some disturbing images, language and sexual content
SNOW ANGELS
Rating: R
for language, some violent content, brief sexuality and drug use
RATINGS GUIDE
G: GENERAL AUDIENCES (All Ages Admitted)
PG: PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
10,000 B.C.
Rating: PG-13
for sequences of intense action and violence
THE BANK JOBRating: R
for sexual content, nudity, violence and language
CJ7Rating: PG
for language, thematic material, some rude humor and brief smoking
COLLEGE ROAD TRIPRating: G
all ages admitted
GIRLS ROCK!Rating: PG
for thematic elements and language
MARRIED LIFERating: PG-13
for some thematic elements and a scene of sexuality
MISS PETTIGREW LIVES FOR A DAYRating: PG-13
for some partial nudity and innuendo
PARANOID PARKRating: R
for some disturbing images, language and sexual content
SNOW ANGELSRating: R
for language, some violent content, brief sexuality and drug use
RATINGS GUIDEG: GENERAL AUDIENCES (All Ages Admitted)
PG: PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
మహేశ్ బాబు, ఛార్మి ఇళ్ళపై ఇన్ కం ట్యాక్స్ దాడులు

సోమవారం టాలీవుడ్ సినీ ప్రముఖులు మహేశ్ బాబు, ఛార్మి, దిల్ రాజు, వి వి వినాయక్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేసి బ్యాంక్ లాకర్లను సీజ్ చేశారు. ఇదే సమయంలో చెన్నైలోని వారి ఆస్తులపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. మహేష్ బాబు ఇటీవల కాలంలో అత్యధిక పారితోషికం తీసుకోవటంతోపాటు పలు ప్రకటనా సంస్థల్లో అత్యధిక పారితోషికం, మల్టీ నేషనల్ కంపెనీలు మహేష్తో చిత్రాలు నిర్మించటం వంటి వార్తలు రావటంతో ఐటీ ఆయనపై దృష్టి సారించినట్లు
తెలిసింది. అదేవిధంగా "మంత్ర" చిత్రంతో హిట్ హీరోయిన్గా నిలిచిన ఛార్మి ఇంటిపైనా ఇటువంటి దాడులు జరిగాయి. "కృష్ణ" చిత్రంతో సంక్రాంతి డైరెక్టరుగా విజయం సాధించిన వినాయక్ కూడా ఐటీ దాడులకు గురయ్యారు. అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే వినాయక్ అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకునిగా పేరుంది. ఇక దిల్ రాజు "బొమ్మరిల్లు" విజయంతో భారీ ఆదాయాన్ని పొందారు. ఈ దాడులు జరిగేటపుడు ఎవరినీ అనుమతించకుండా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వరకూ ఐటీ దాడులు కొనసాగవచ్చునని టాలీవుడ్ సమాచారం. ఇదిలా ఉండగా, ఇటువంటి దాడులు తమకు సర్వసాధారణమేనని దిల్ రాజు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
తెలిసింది. అదేవిధంగా "మంత్ర" చిత్రంతో హిట్ హీరోయిన్గా నిలిచిన ఛార్మి ఇంటిపైనా ఇటువంటి దాడులు జరిగాయి. "కృష్ణ" చిత్రంతో సంక్రాంతి డైరెక్టరుగా విజయం సాధించిన వినాయక్ కూడా ఐటీ దాడులకు గురయ్యారు. అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే వినాయక్ అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకునిగా పేరుంది. ఇక దిల్ రాజు "బొమ్మరిల్లు" విజయంతో భారీ ఆదాయాన్ని పొందారు. ఈ దాడులు జరిగేటపుడు ఎవరినీ అనుమతించకుండా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వరకూ ఐటీ దాడులు కొనసాగవచ్చునని టాలీవుడ్ సమాచారం. ఇదిలా ఉండగా, ఇటువంటి దాడులు తమకు సర్వసాధారణమేనని దిల్ రాజు వ్యాఖ్యానించడం కొసమెరుపు. Tuesday, March 4, 2008
Monday, March 3, 2008
తమిళం, హిందీ, భోజ్ పురిలలోకి డబ్ అవనున్న" శ్రీ రామదాసు"
అక్కినేని నాగార్జునకు 2006వ సంవత్సరానికి ఉత్తమ నటుని అవార్డు అందించిన "శ్రీ రామదాసు" చిత్రం త్వరలో తమిళం, హిందీ, భోజ్ పురి భాషలలోకి అనువాదం కానుంది. తెలుగులో నిర్మించబడి అఖండ విజయం అందుకున్న ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడతగ్గ గొప్ప చిత్రంగా 2006వ సంవత్సరం నంది అవార్డును సహితం అందుకుంది. అక్కినేని నాగార్జున వ్యక్తిగత మేకప్ మెన్ రామచంద్రా రావు సహితం ఈ చిత్రానికిగాను ఉత్తమ మేకప్ మెన్ గా నంది అవార్డు అందుకోనున్నారు. ఈ చిత్రం పాటలు తెలుగులో బహుళ జనాదరణ చూరగొన్నాయి. కాగా ఈ చిత్రాన్ని చిత్ర నిర్మాత కొండా కృష్ణం రాజు తమిళం, హిందీ, భోజ్ పురి భాషలలోకి అనువదించాలని నిర్ణయించారు. కొన్ని ప్రముఖ కార్పోరేట్ కంపనీలు ఈ చిత్ర అనువాదం పట్ల ఆసక్తి చూయిస్తున్నాయనీ, దాంతో ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, భోజ్ పురి భాషలలోకి అనువదించాలని నిర్ణయించినట్లు నిర్మాత తెలిపారు.
Saturday, March 1, 2008
Subscribe to:
Posts (Atom)















































































Legendary Stamp on Hollywood Actress "Kelly Garland"
Exclusive Stamp on Hollywood 21st Century leaders














































































































రాణి ముఖర్జీ
కరిష్మా కపూర్, కరీనా కపూర్





