ప్రపంచ స్థాయి అందాల భామలలో ఒకరైన బాలీవుడ్ నటీమణి అందాల ఐష్వర్యా రాయ్ అంటే చాలామందికి చాలా చాలా ఇష్టం. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని అందరు అభిమానులూ ప్రత్యేక ఉత్సాహాన్ని చూయిస్తుంటారు. ఆమెకు సంబంధించిన పాస్ పొర్ట్ చూస్తే ఎలా వుంటుంది. భారత దేశ ప్రభుత్వం జారీచేసిన ఈ పాస్ పోట్ ఫొటో కాపీ ప్రత్యేకంగా మీకోసం. Monday, March 31, 2008
అందాల అభినేత్రి ఐష్వర్య రాయ్ "పాస్ పోర్ట్" చూద్దామా
ప్రపంచ స్థాయి అందాల భామలలో ఒకరైన బాలీవుడ్ నటీమణి అందాల ఐష్వర్యా రాయ్ అంటే చాలామందికి చాలా చాలా ఇష్టం. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని అందరు అభిమానులూ ప్రత్యేక ఉత్సాహాన్ని చూయిస్తుంటారు. ఆమెకు సంబంధించిన పాస్ పొర్ట్ చూస్తే ఎలా వుంటుంది. భారత దేశ ప్రభుత్వం జారీచేసిన ఈ పాస్ పోట్ ఫొటో కాపీ ప్రత్యేకంగా మీకోసం. Saturday, March 29, 2008
ఎన్ టి రామారావు బర్త్ డేకు విడుదలవనున్న బాలకృష్ణ "పాండురంగడు"

నందమూరి అభిమానులకు మే 28 పండుగ రోజు కానుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న "పాండురంగడు" చిత్రాన్ని స్వర్గీయ ఎన్ టి రామారావు పుట్టిన రోజైన మే 28వ తేదీన విడుదలచేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక,నిర్మాత కె రాఘవేంద్రా రావు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. "పాండురంగడు" చిత్రంలో బాలకృష్ణ కృష్ణుడు గానూ,భక్తుడు పాండురంగడు గా పించనున్నారు.రామోజీ ఫిలిం సిటి,రాయచూరు,ధాయలాండ్,ఇండోనేషియా,కంబోడియా లలో రమణీయంగా సన్నివేశాలు చిత్రీకరించారు.ఎప్పటిలానే రచయిత జె.కె.భారవి ఈ పౌరాణికానికి కొత్త సొగసులు అద్దారంటున్నారు. కీరవాణి సంగీతం,జయరాం కెమెరా,స్నేహా,టాబు,ప్రియమణి వంటి హీరోయిన్ల అభినయం చిత్రానికి అదనపు హంగులు అవుతుందంటున్నారు.ఈ చిత్రాన్ని ఆర్.కె బ్యానర్ పై కె.కృష్ణ మోహన్ నిర్మిస్తున్నారు.
Friday, March 28, 2008
చీరకట్టులో ఇలియానా
ఈ ఫోటోలు చూస్తే మీకేమనిపిస్తోంది. భారతీయ సాంప్రదాయ వస్త్రమైన చీరకట్టులో ఉండే అందం మరే వస్త్రాలలో రాదనిపించడం లేదూ. ఏప్రిల్ 2వ తేదీన విడుదలయ్యే "జల్సా" చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రేమ పాఠాలలో చీరకట్టులో ముద్దుగుమ్మలు ఎంత అందంగా ఉంటారో సెలవిచ్చినట్లున్నాడు. అందుకే "జల్సా"లో ఇలియానా చాలా సన్నివేశాలలో చీరకట్టులో దర్శనమిస్తుంది. చూస్తుంటే చీరకట్టు మళ్ళీ అమ్మాయిలకు ఫ్యాషన్ అవుతుందా ఏమిటనేలా ఉన్న ఫోటోలను మీరే చూడండి. 



బర్త్ డే బాయ్ రామ్ చరణ్ తేజ
"చిరుత" చరణ్ ఈ రోజు 24 వ సంవంత్సరం లోకి అడుగుపెడుతున్నాడు.మెదటి సినిమాతోనే తన దైన ముద్ర వేసి ముందుకెలుతున్న చరన్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. క్రిందటి బర్తడే ని బ్యాంకాక్ లో తల్లి,తండ్రి సమక్షంలో "చిరుత" సెట్ లో జరుపుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చితం సెట్లో, యూనిట్ అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోబోతున్నాడు.విష్ యూ హ్యాప్పీ బర్త్ డే రామ్ చరణ్.
Thursday, March 27, 2008
భారతీ రాజా కూరురు వివాహం సెప్టెంబర్ 1న
ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూతురు జనని వివాహం సెప్టెంబర్ 1వ తేదీన చెన్నైలో జరుగనుంది. మలేషియాలోని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ తో జరుగనున్న ఈ పెళ్ళికి సంబధించిన నిశ్చితార్తం ఈరోజు చెన్నైలో జరిగింది.కాగా ప్రస్తుతం మలేషియాలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న రాజ్ కుమార్ తమిళనాడులోని మధురై జిల్లాకు చెందినవాడు. ఈరోజు చెన్నైలోని ఆకార్డ్ మెట్రోపాలిటన్ హోటల్ లో జనని, రాజ్ కుమార్ ల వివాహ నిశ్చితార్తం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధువులు, కొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సెప్టెంబర్ లో జరిగే వివాహాన్ని తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని భారతీరజా భావిస్తున్నట్లు సమాచారం.
"ఆవకాయ బిర్యాని"
"ఆనంద్", "గోదావరి", "హ్యాప్పీడేస్" చిత్రాల దర్శక, నిర్మాత శేఖర్ కమ్ముల తన తాజా ప్రాజెక్టు "ఆవకాయ బిర్యానీ" ని ప్రారంభించాడు. "ఆవకాయ బిర్యానీ" పేరుతో నిర్మించే ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల నిర్మాతగా మాత్రమే ఉంటూ, దర్శకత్వ బాధ్యతలను అనీష్ కురువిల్లాకు అప్పగించాడు.అనీష్ శేఖర్ తొలి చిత్రం "ఆనంద్" లో రాజాకు ఫ్రెండ్ పాత్రలో నటించాడు. అనీష్ చెప్పిన కథ బాగా నచ్చడంతో అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త నటీనటులు బిందు, కమల్ లు ఇందులో నటిస్తున్నారు.
Wednesday, March 26, 2008
బాలకృష్ణ "పాండురంగడు" వివరాలు ఉగాదికి...
వరుస అపజయాలను ఎదుర్కొన్న నందమూరి బాలకృష్ణ భక్తిరస చిత్రం "పాండురంగడు" తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భక్తిరసాల చిత్రీకరణలో అందెవేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో "పాండురంగడు" చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీని పూర్తి వివరాలను ఉగాది శుభదినాన తెలియజేయాలని దర్శకేంద్రులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ "భక్త పుండరీకుని"గా, "శ్రీకృష్ణుని"గా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. స్నేహ, టబు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు వేశ్యగా నటించడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి భారవి, వేటూరి, సుద్దాల అశోక్ తేజ, వేదవ్యాస్ కలాల నుంచి జాలువారే పాటలు ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.గతంలో వైవిధ్య పాత్రలలో వచ్చిన "ఆదిత్య 369", "భైరవ ద్వీపం", "శ్రీకృష్ణార్జున విజయం" సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విభిన్న తరహాలో రాబోతున్న "పాండురంగడు" చిత్రం కూడా బాలయ్య నటనాచాతుర్యంతో సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని ఆశిద్దాం.
Tuesday, March 25, 2008
పాక్లో విడుదలవనున్న "తారే జమీన్ పర్"
నటుడు అమీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం "తారే జమీన్ పర్" చిత్రం పాకిస్థాన్లో విడుదల కానునంది. ఈ చిత్రంతో పాటు, "రేస్" సినిమాను ఈనెల 28వ తేదీన విడుదల చేసేందుకు యూటీవీ సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. "తారే జమీన్ పర్" చిత్రానికి పాకిస్థాన్ సెన్సార్ బోర్డు యూనివర్సల్ సర్టిఫికేట్ (యు)ను జారీ చేసింది. "తారే జమీన్ పర్" చిత్రానికి ఎ
క్కడా సెన్సార్ కత్తెర వేయకుండా పాకిస్తాన్ సెన్సార్ అనుమతిని ఇచ్చింది. అలాగే "రేస్" చిత్రంలో అక్కడకడ్కడా సెన్సార్ కట్ చేసి యూ/ఏ సర్టిఫికేట్తో విడుదల చేసేందుకు పాక్ బోర్డు అనుమతి ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ హక్కులను కలిగిన యూటీవీ సంస్థ పాకిస్థాన్లోని ఐదు ముఖ్య నగరాల్లో విడుదల చేయనుంది. ఒక్కో నగరం
లో ఐదు సినిమా థియేటర్లలో ఈ చిత్రాలు విడుదల చేస్తున్నారు. యూటీవీ గతంలో "గోల్" చిత్రాన్ని విడుదల చేసింది.
Monday, March 24, 2008
Saturday, March 22, 2008
అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తొలి పది మంది కథానాయికలు
(Courtesy: Show Buzz)
ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తొలి పది మంది కథానాయికలు వరుసగా ఈ క్రింది విధంగా ఉన్నారు.
Friday, March 21, 2008
Thursday, March 20, 2008
అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు

అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు. నటన భూషణ శోభన్ బాబు గురువారం ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. యోగా చేస్తుండగా ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. భక్త శబరి సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన శోభన్ బాబుకు అందాల నటుడిగా పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయనకు ఎనలేని అభిమానులున్నారు. ఇటీవల చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నటించిన చివరి సినిమా అడవి దొర. తెలుగు సినీ రంగంలో శోభన్ బాబుది ఒక ప్రత్యేక
అద్యాయం. శోభన్ బాబు పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ప్రముఖ తెలుగు కథానాయకులలో ఒకరిగా వెలుగొందిన ఈయన 14 జనవరి, 1937 రోజున జన్మించారు. అందమైన రూపం, క్రమశిక్షణ తో కూడిన సినీ జీవితం శోభన్ బాబుది. 1959లో విడుదలైన "దైవబలం" సినిమాలో శోభన్బాబుకు ఒక చిన్నపాత్ర లభించింది.1960లో విడుదలైన "భక్త శబరి"లో మునికుమారునిగా శోభన్ బాబుకు పాత్ర మరికాస్త ముఖ్యమైన పాత్ర లభించింది. ఇంకా "సీతారామ కళ్యాణం"లో లక్ష్మణుడు, "భీష్మ"లో అర్జునుడు, "లవకుశ"లో శత్రుఘ్నుడు వంటి పాత్రలలో నటించారు. "పుణ్యవతి", "చదువుకున్న అమ్మాయిలు", "పూలరంగడు", "ఇద్దరమ్మాయిలు", "బుద్ధిమంతుడు" వంటి సినిమాలలో కూడా నటించారు."వీరాభిమన్యు" సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. మొదట ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన శోభన్ బాబు 1965 వచ్చిన "వీరాభిమన్యు"తో సోలో హీరోగా నిలదొక్కుకున్నారు. అప్పటి నుంచి 1997లో "మనుషులు మారాలి" సినిమా వరకు ఆయ
న వెనక్కి చూడలేదు. "గోరింటాకు", "మల్లెపువ్వు", "శారద", "బలిపీఠం", "ముందడుగు", "కార్తీక దీపం" వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు ఐదు సార్లు "నంది అవార్డులు" వచ్చాయి. నాలుగు సార్లు ఆయన "ఫిల్మ్ ఫేర్ అవార్డులు" అందుకున్నారు. తన సమకాలీన నటుడు కృష్ణతో కలిసి ఆయన మంచిమిత్రులు, "కురుక్షేత్రం" వంటి సినిమాల్లో నటించాడు. ఏ మాత్రం బేషజాలు లేని నటుడిగా శోభన్ బాబుకు పేరుంది.శోభన్ బాబు మొత్తం 220పైగా చిత్రాలలో నటించారు.
అద్యాయం. శోభన్ బాబు పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ప్రముఖ తెలుగు కథానాయకులలో ఒకరిగా వెలుగొందిన ఈయన 14 జనవరి, 1937 రోజున జన్మించారు. అందమైన రూపం, క్రమశిక్షణ తో కూడిన సినీ జీవితం శోభన్ బాబుది. 1959లో విడుదలైన "దైవబలం" సినిమాలో శోభన్బాబుకు ఒక చిన్నపాత్ర లభించింది.1960లో విడుదలైన "భక్త శబరి"లో మునికుమారునిగా శోభన్ బాబుకు పాత్ర మరికాస్త ముఖ్యమైన పాత్ర లభించింది. ఇంకా "సీతారామ కళ్యాణం"లో లక్ష్మణుడు, "భీష్మ"లో అర్జునుడు, "లవకుశ"లో శత్రుఘ్నుడు వంటి పాత్రలలో నటించారు. "పుణ్యవతి", "చదువుకున్న అమ్మాయిలు", "పూలరంగడు", "ఇద్దరమ్మాయిలు", "బుద్ధిమంతుడు" వంటి సినిమాలలో కూడా నటించారు."వీరాభిమన్యు" సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. మొదట ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన శోభన్ బాబు 1965 వచ్చిన "వీరాభిమన్యు"తో సోలో హీరోగా నిలదొక్కుకున్నారు. అప్పటి నుంచి 1997లో "మనుషులు మారాలి" సినిమా వరకు ఆయ
న వెనక్కి చూడలేదు. "గోరింటాకు", "మల్లెపువ్వు", "శారద", "బలిపీఠం", "ముందడుగు", "కార్తీక దీపం" వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు ఐదు సార్లు "నంది అవార్డులు" వచ్చాయి. నాలుగు సార్లు ఆయన "ఫిల్మ్ ఫేర్ అవార్డులు" అందుకున్నారు. తన సమకాలీన నటుడు కృష్ణతో కలిసి ఆయన మంచిమిత్రులు, "కురుక్షేత్రం" వంటి సినిమాల్లో నటించాడు. ఏ మాత్రం బేషజాలు లేని నటుడిగా శోభన్ బాబుకు పేరుంది.శోభన్ బాబు మొత్తం 220పైగా చిత్రాలలో నటించారు. భూలోకంలో మరో డ్రాగన్ వార్ "డి-వార్"
కొరియాలో నిర్మింపబడి ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన "డి-వార్" చిత్రాన్ని పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ భారత దేశంలో విడుదల చేయనుంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులలో తప్ప మిగిలిన అన్ని రాష్టాలలో ఈ చిత్రాన్ని పిరమిడ్ విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రంపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి.
Wednesday, March 19, 2008
రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (19-03-2008)
(Courtesy: Motion Picture Association of America, Inc)
Ratings for Movies Debuting in Theaters This Week
DRILLBIT TAYLOR
Rating: PG-13
(for crude sexual references throughout, strong bullying, language, drug references and partial nudity)
Rating: PG-13
(for crude sexual references throughout, strong bullying, language, drug references and partial nudity)
THE HAMMERRating: R
(for brief language)
SHUTTERRating: PG-13
(for terror, disturbing images, sexual content and language)
TYLER PERRY'S MEET THE BROWNSRating: PG-13
(for drug content, language including sexual references, thematic elements and brief violence)
UNDER THE SAME MOONRating: PG-13
for some mature thematic elements
RATINGS GUIDEG: GENERAL AUDIENCES (All Ages Admitted)
PG: PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శివ "భవాని(రఘువరన్)" ఇక లేరు
ప్రముఖ సినీనటుడు రఘువరన్ నేటి ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. అనేక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన ప్రధానంగా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించారు."మిస్టర్ భరత్" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు వచ్చిన రఘువరన్కు 59 ఏళ్లు. "శివ" చిత్రంలో ప్రతినాయుకుడుగా అత్యుత్తమనటన కనబరిచి అశేషాంధ్రప్రేక్షకులకు దగ్గరయ్యారు. రఘువరన్ మృతి పట్ల యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. పలు
వురు సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.1982లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రఘువరన్ అనేక దక్షిణాది చిత్రాల్లో నటించారు.ఏ పాత్ర వేసినా అందులో నిమగ్నం కావడం , ఆ పాత్ర తప్ప అయన ప్రేక్షకులకు కన్పించకపోవడం ఆయన ప్రత్యేకత.1989 లో "శివ" సినిమాతో ఆయన విలన్ గా ప్రాచుర్యం పొందారు. "భాషా","ముత్తు", "అరుణాచలం", "ఒకే ఒక్కడు" సినిమాల్లో ఆయన నటన అమోఘం. ఇటీవల "శివాజీ", "భీమ", "ఎవడైతే నాకేంటి" సినిమాల్లో నటించారు.
Tuesday, March 18, 2008
ప్రపంచ సినిమాపై పోస్టల్ స్టాంప్స్ (ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ)
Moviemaker D W Griffith
Director Alfred Hitchcock
Hollywood legend Charlie Chaplin
Exclusive Stamps Collecton on "James Bond 007" films
Exclusive Stamp on "Lord of the Rings"
Exclusive Stamp on Marlyn Monroe
Exclusive Stamp collection on Hollywood Movie Monsters
Russian Stamp on Moviemaker, Director Shostakov
Exclusive Stamp on "Shrek"
Exclusive Stamp on "Star Wars- YODA"Movie Maker A.V.Meyyappa Chettiyar
















































































Legendary Stamp on Hollywood Actress "Kelly Garland"
Exclusive Stamp on Hollywood 21st Century leaders





