Thursday, April 3, 2008

గుణశేఖర్ దర్శకత్వంలో బాలకృష్ణతో ఎం ఎస్ రాజు భారీ చిత్రం

బాలకృష్ణతో భారీ చిత్రాల నిర్మాత ఎమ్.ఎస్.రాజు ఒక చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. "ఒక్కడు" వంటి మెగా హిట్ ని అందించిన గుణశేఖర్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. "సాధు" పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. నిజానికి ఈ కాంబినేషన్ చాలా అరుదైనది. ముగ్గురూ భారీ చిత్రాల కేటగిరికి సంభందిచిన వాళ్ళే. అంతే గాక వీరి మధ్య మరో పోలిక ఉంది. అది "ఆట","వాన" చిత్రాలతో ఎమ్.ఎస్.రాజు, "అర్జున్" ,"సైనికుడు" చిత్రాలతో గుణశేఖర్, "మహారధి", "ఒక్క మగాడు" లతో బాలకృష్ణ వరస భారీ ఫ్లాపులను ఎదుర్కొన్నవాళ్ళు. వరుస వైఫల్యాల నేపధ్యంలో గతంలో మెగా హిట్స్ ఇచ్చిన ఈ ముగ్గురూ ఓ సంచలన విజయంతో మరోమారు రికార్డు సృస్టించాలని భావిస్తున్నారు. ముగ్గురికీ మార్కెట్లో, ప్రేక్షకులలో మంచి క్రేజి ఉంది.దాంతో ఈ కాంబినేషన్ కి మంచి క్రేజీ ఎర్పడింది. ప్రస్తుతం బాలకృష్ణ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న "పాండురంగడు" చిత్రం లో నిమగ్నమై ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ఈ చిత్రంలో నటించనున్నారు. ఎమ్.ఎస్.రాజు పుట్టిన రోజైన మే 10న ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని తెలిసింది. అందరి అంచనాలను మించి ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

No comments: