Tuesday, April 15, 2008

వేసవి బరిలో "పరుగు", "కంత్రీ", "బుజ్జిగాడు"

తెలుగు సినీ పరిష్రమలో వేసవి సందడి మొదలైంది. రానున్న వేసవిలో అల్లు అర్జున్ నటించిన "పరుగు", యంగ్ ఎన్ టి ఆర్ నటించిన "కంత్రీ", ప్రభాస్ నటించిన "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై" చిత్రాలు ప్రధానంగా పోటీలో నిలుచోనున్నాయి. "పోకిరి" స్థాయి విజయం కోసం ఎదురు చూస్తున్న పూరీ జగన్నాధ్, ప్రభాస్‌ కాంబినేషన్‌లో తయారవుతున్న "బుజ్జిగాడు మేడిన్ ఇన్ చెన్నై" మే 9న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మేలోనే రానున్న "పరుగు", "కంత్రి" చిత్రాలతో "బుజ్జిగాడు" పోటీ పడబోతున్నాడు. మూడుచిత్రాలపైనా తెలుగు సినీ పరిష్రమలో ఎక్స్పెక్టేషన్స్ అధికంగా ఉండటంతో వేసవికి ముందే తెలుగు సినీ పరిష్రమ సినిమాలతో వేడిక్కబోతోంది.

No comments: