Thursday, April 17, 2008

"తెలుగుదేశం" పార్టీ లో చేరిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు

సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు తెలుగుదేశం పార్టీలో చేరారని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత బుధవారం పత్రికలవారితో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. పార్టీలో వారికి క్రియాశీలక విభాగంలో సభ్యత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ "సినీ నటుడు బాలకృష్ణ పార్టీలోనే ఉన్నారని,బాలకృష్ణ గతంలో కూడా అనేక సభల్లో పాల్గొన్నారని, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పార్టీ కోసం వాహనమే నడిపారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా పార్టీలోకి వచ్చారని తెలిపారు. పార్టీ కోసం వారు పనిచేయడంలో తప్పు లేదని ఆయన అన్నారు. పార్టీని కాపాడి ప్రజలకు సేవలు చేసేలా పార్టీని తీర్చిదిద్దదడం కోసం వారు పని చేయడంలో తప్పు లేదని ఆయన అన్నారు.

No comments: