Tuesday, April 29, 2008

"కుచేలుడు" డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందిన పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్

రజినీకాంత్ నటించిన "కుచేలుడు" డిస్ట్రిబ్యూషన్ హక్కులు పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ స్వంతం చేసుకుంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ ఈ చిత్ర తమిళ, తెలుగు హక్కులు స్వంతం చేసుకుంది. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళంలో పశుపతి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తెలుగులో జగపతి బాబు చేస్తున్నారు. నయనతార, మమతా మోహన్‌దాస్ సహా పలువురు ప్రముఖ తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రజనీకాంత్ ఈ సినిమాలో తన పాత్ర కనిపించేది 25 శాతమే అయినా చిత్రానికి ప్రాణ ప్రతిష్ట చేసే అత్యంత అరుదైన పాత్రను రజినీ పోషిస్తుండటంతో ఈ చిత్ర హక్కులకు విపరీతమైన డిమాడ్ ఏర్పడింది. దాంతో తెలుగు, తమిళ వెర్షన్ల పంపిణీ హక్కుల కోసం పలు కార్పోరేట్ కంపెనీలు పోటీ పడ్డాయి. వాటిల్లో యాడ్‌లాబ్స్, అయ్యంగారన్ ఫిలిమ్స్ మరి కొన్ని కంపెనీలు ఈ చిత్ర హక్కులకోసం పోటీపడ్డాయి. చివరకు పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ ఈ చిత్ర హక్కులను స్వంతం చేసుకుంది. మార్కెట్లో "కుచేలుడు" సినిమాని చాలా విలువైన ప్రొజెక్టుగా భావించటంతో ఈ రేటు పలికిందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అంటే "కుచేలుడు" మరో అరుదయిన రికార్డుని జత చేసుకున్నట్లే.

No comments: