Tuesday, April 29, 2008

పవన్ కళ్యాణ్ సరసన నటించనున్న కరీనా కపూర్...!?

పవన్ కళ్యాణ్ సరసన బాలీవుడ్ అగ్ర నటి కరీనా కపూర్ నటించనుందనే వార్త టాలీవుడ్ లో గుప్పుమంటోంది. పవన్ కళ్యాణ్, ఇలియనాలు నటించిన "జల్సా" విజయవంతంగా ప్రదర్శింపడుతున్న తరుణంలో ఈ కొత్త కాంబినేషన్ కు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాన్ హీరోగా, ఎస్ జె సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మించనున్న "పులి" చిత్రంలో బాలీవుడ్ నటీమణి కరీనా కపూర్ నటించనుందని సమాచారం. అదే జరిగితే ఈ చిత్రం కరీనా కపూర్ కు తొలి దక్షిణ భారతీయ చిత్రం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఎ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూడటం, బాలీవుడ్ సినెమాటోగ్రాఫర్ వినోద్ ప్రభాస్ కెమెరా మెన్ గా పనిచేస్తూండటం తోబాటు, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఫిట్స్ చిత్రీకరించనుండటం తో ఇప్పటికే సంచలనాలు సృస్టిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు కరీనా కపూర్ నటించనుందనే వార్తతో మరింత హాట్ కేక్ సమాచారంగా మారింది. ఈ విషయం అభిమానులకు ఖచ్చితంగా తీపి వార్తే.

No comments: