
Wednesday, April 30, 2008
అల్లు అర్జున్ "పరుగు"
అల్లు అర్జున్ హీరోగా, షీలా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పరుగు. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మిక దినోత్సవమైన మేడే రోజున ఈ చిత్రాన్ని నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. తెలుగు తెరపై విజయానికి చిరునామాగా నిలిచిన క్రేజీ కాంబినేషన్తో పరుగు చిత్రం రూపొందడంతో దీనిపై అందరిలోను ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో హీరోగా చేసిన అల్లు అర్జున్ తన తొలిచిత్రం గంగోత్రి నుంచి ప్రతి సినిమాను వైవిధ్యంగా మలుచుకుని విజయాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్కు ఇది రెండో చిత్రం. ఆయన తొలిచిత్రం బొమ్మరిల్లు ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం సాధించిన విజయంతో ఈ చిత్రం పేరు భాస్కర్కు ఇంటిపేరులా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు సైతం సక్సెస్ చిత్రాల నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఈయన గత చిత్రం బొమ్మరిల్లు సాధించిన విజయం గురించి చెప్పుకున్నాం కదా. ఇలాంటి ఓ అద్భుతమైన కాంబినేషన్తో రూపొందిన చిత్రానికి సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ తన గత చిత్రం బొమ్మరిల్లులో ఓ తండ్రి, కొడుకు మధ్య ఉండే సున్నితమైన అంశాన్ని తెరకెక్కించినట్టే ఈ చిత్రంలో ఓ తండ్రి, కూతురి మధ్య సంబంధాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు. తన గత చిత్రం సాధించిన విజయం లాగానే ఈ చిత్రం సైతం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ కెరీర్లో మరో ఉత్తమ చిత్రంగా భావిస్తున్న ఈ చిత్రం ఆడియోను అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ఆడియోను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇలాంటి అనేక ప్రత్యేకతలున్న ఈ చిత్రం గురువారం నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సందడి చేయనుంది.
Tuesday, April 29, 2008
పవన్ కళ్యాణ్ సరసన నటించనున్న కరీనా కపూర్...!?
పవన్ కళ్యాణ్ సరసన బాలీవుడ్ అగ్ర నటి కరీనా కపూర్ నటించనుందనే వార్త టాలీవుడ్ లో గుప్పుమంటోంది. పవన్ కళ్యాణ్, ఇలియనాలు నటించిన "జల్సా" విజయవంతంగా ప్రదర్శింపడుతున్న తరుణంలో ఈ కొత్త కాంబినేషన్ కు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాన్ హీరోగా, ఎస్ జె సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మించనున్న "పులి" చిత్రంలో బాలీవుడ్ నటీమణి కరీనా కపూర్ నటించనుందని సమాచారం. అదే జరిగితే ఈ చిత్రం కరీనా కపూర్ కు తొలి దక్షిణ భారతీయ చిత్రం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఎ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూడటం, బాలీవుడ్ సినెమాటోగ్రాఫర్ వినోద్ ప్రభాస్ కెమెరా మెన్ గా పనిచేస్తూండటం తోబాటు, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఫిట్స్ చిత్రీకరించనుండటం తో ఇప్పటికే సంచలనాలు సృస్టిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు కరీనా కపూర్ నటించనుందనే వార్తతో మరింత హాట్ కేక్ సమాచారంగా మారింది. ఈ విషయం అభిమానులకు ఖచ్చితంగా తీపి వార్తే.
"కుచేలుడు" డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందిన పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్
రజినీకాంత్ నటించిన "కుచేలుడు" డిస్ట్రిబ్యూషన్ హక్కులు పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ స్వంతం చేసుకుంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ ఈ చిత్ర తమిళ, తెలుగు హక్కులు స్వంతం చేసుకుంది. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళంలో పశుపతి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తెలుగులో జగపతి బాబు చేస్తున్నారు. నయనతార, మమతా మోహన్దాస్ సహా పలువురు ప్రముఖ తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రజనీకాంత్ ఈ సినిమాలో తన పాత్ర కనిపించేది 25 శాతమే అయినా చిత్రానికి ప్రాణ ప్రతిష్ట చేసే అత్యంత అరుదైన పాత్రను రజినీ పోషిస్తుండటంతో ఈ చిత్ర హక్కులకు
విపరీతమైన డిమాడ్ ఏర్పడింది. దాంతో తెలుగు, తమిళ వెర్షన్ల పంపిణీ హక్కుల కోసం పలు కార్పోరేట్ కంపెనీలు పోటీ పడ్డాయి. వాటిల్లో యాడ్లాబ్స్, అయ్యంగారన్ ఫిలిమ్స్ మరి కొన్ని కంపెనీలు ఈ చిత్ర హక్కులకోసం పోటీపడ్డాయి. చివరకు పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ ఈ చిత్ర హక్కులను స్వంతం చేసుకుంది. మార్కెట్లో "కుచేలుడు" సినిమాని చాలా విలువైన ప్రొజెక్టుగా భావించటంతో ఈ రేటు పలికిందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అంటే "కుచేలుడు" మరో అరుదయిన రికార్డుని జత చేసుకున్నట్లే.
Monday, April 28, 2008
Saturday, April 26, 2008
Tuesday, April 22, 2008
అల్లరి నరేష్ "ఫిట్టింగ్ మాస్టర్"

"సీమశాస్త్రి" , "అత్తిలి సత్తిబాబు", "బ్లేడు బాబ్జీ" అంటూ వెరైటీ టైటిల్స్ తో దూసుకుపోతున్న అల్లరి నరేష్ కొత్త సినిమా కి "ఫిట్టింగ్ మాస్టర్" అనే టైటిల్ పరిశీలుస్తున్నారు. ఈ చిత్రాన్ని నరేష్ తండ్రి ఇ.వి.వి.సత్యనారాయణ తన దర్సకత్వంలో స్వీయ బేనరు పై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నరేష్ హీరోగా చేసిన "బొమ్ననా బ్రదర్స్ చందనా సిస్టర్స్"రిలీజై ఫరవాలేదనిపించుకుంటోంది. తరువాత వేగిశ్న సతీష్ దర్శకత్వంలో వస్తున్న "దొంగల బండి" షూటింగ్ లో నరేష్ నటిస్తాడు. తరువాతే ఫిటింగు మాస్టర్ ఉంటుంది. అంటే ఈ వెరైటీ కామిడి రావటానికి కొంత టైము పడుతుందన్నమాట.
Monday, April 21, 2008
అమితాబ్ బచ్చన్ బ్లాగు చూస్తారా...!
బాలీవుడ్ ఎవర్-గ్రీన్ హీరో అమితాబ్ బచ్చన్ స్వంతంగా ఒక బ్లాగు ప్రారంభించాడు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ చలన చిత్ర జగత్తులో తనదైన ముద్ర వేసిన అమితాబ్ బచ్చన్ తన అభిమానులకోసం స్వంత బ్లాగు ప్రారంభించడం పట్ల సర్వతా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన శేఖర్ కపూర్, అమీర్ ఖాన్ ల బ్లాగులను వీక్షకులు అతధిక స్థాయిలో సందర్శిస్తూ వాటిని విజయవంతం చేశారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ బ్లాగు ప్రారంభించి నాలుగు రోజులైనా కాకుండానే ప్రపంచ వ్యాప్తంగా వీక్షకులు ఆ బ్లాగును సందర్శిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో త్వరలోనే మరి కొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా స్వంత బ్లాగులను ప్రారంభించనున్నట్లు సమాచారం.
Visit: http://blogs.bigadda.com/
రాజకీయాల్లోకి రానున్న వేణు మాధవ్, జీవిత, జయసుధ

తెలుగు సినీ రంగానికి రాజకీయాలేం కొత్త కాదు.అయితే కొత్తగా మరికొందరు సినీ తారలు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తంవుతున్నారు. తాజాగా సినీ నటీమణులు జయసుధ, జీవిత, హాస్య నటుడు వేణు మాధవ్ లు రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ముగ్గురూ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి రానున్న ఎన్నికలలో పోటీకి దిగనున్నట్లు తాజా సమాచారం. కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి తెలుగు సినీ హాస్యనటుడు వేణుమాధవ్ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. రాను
న్న ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలుగుదేశం పార్టీ సినీ గ్లామర్ ను కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్ తో ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వేణుమాధవ్ ను కమలాపూర్ నుంచి బరిలో దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వేణు మాధవ్ పోటీకి సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
కాగా, హైదరాబాదులోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి సినీ నటి జీవితను పోటీకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులు కాంగ్రెసుకు అనుకూలంగా, మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. వారిపై చిరంజీవి అభిమానులు దాడి చేసిన తర్వాతి కాలం నుంచి వారు కాంగ్రెసుకు మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇదిలా ఉంటే, సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి మరో సినీ నటి జయసుధను పోటీకి దింపనున్నట్లు వా
ర్తలు వస్తున్నాయి. మైనారిటీ వర్గాలైన క్రిస్టియన్లు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో క్రిస్టియన్ మతంలోకి చేరిన జయసుధ తమకు బలంగా పరిణమిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులుగా ముషిరాబాదు నుంచి నాయని నర్సింహారెడ్డి, సికింద్రాబాదు నుంచి పద్మారావు పోటీకి దిగనున్న విషయం తెలిసిందే.
న్న ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలుగుదేశం పార్టీ సినీ గ్లామర్ ను కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్ తో ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వేణుమాధవ్ ను కమలాపూర్ నుంచి బరిలో దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వేణు మాధవ్ పోటీకి సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.కాగా, హైదరాబాదులోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి సినీ నటి జీవితను పోటీకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులు కాంగ్రెసుకు అనుకూలంగా, మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. వారిపై చిరంజీవి అభిమానులు దాడి చేసిన తర్వాతి కాలం నుంచి వారు కాంగ్రెసుకు మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇదిలా ఉంటే, సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి మరో సినీ నటి జయసుధను పోటీకి దింపనున్నట్లు వా
ర్తలు వస్తున్నాయి. మైనారిటీ వర్గాలైన క్రిస్టియన్లు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో క్రిస్టియన్ మతంలోకి చేరిన జయసుధ తమకు బలంగా పరిణమిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులుగా ముషిరాబాదు నుంచి నాయని నర్సింహారెడ్డి, సికింద్రాబాదు నుంచి పద్మారావు పోటీకి దిగనున్న విషయం తెలిసిందే. Saturday, April 19, 2008
చైనా ప్రభుత్వంతో పిరమిడ్ సాయిమిరా ఒప్పందం
సినిమా నిర్మాణ, పంపిణీ రంగాలతోబాటుగా టెలివిజన్ సాప్ట్ వేర్ ను కూడా రూపొందిస్తున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ చైనా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతోంది. చైనాలోని మూడు వందల థియేటర్లను లీజుకు తీసుకుని సినిమాల ప్రదర్శనకు ఒప్పందం చేసుకోబోతున్నామని, అందుకోసం చైనా నుండి వచ్చిన ప్రతినిధుల బృందం చెన్నైలోనూ, హైదరాబ్ లోనూ తాము నిర్వహిస్తున్న కార్యకలాపాలను వీక్షించాయని సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ చైనా ఆపరేషన్స్ సి ఇ ఒ వెంకట్ తెలిపారు. ఏడుగురు సభ్యులు కలిగిన చైనా బృందం సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అరోనా టెక్నలజీస్ సంస్థ రూపొందిస్తున్న యానిమేషన్, ఆన్ లైన్ గేంస్ సాప్ట్ వేర్, శబ్దాలయా స్టూడియోలోని పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ను, పద్మాలయా స్టూడియోస్ తోబాటు, జంటనగరాలలోని కొన్ని థియేటర్లను సందర్శించారు. చైనా బృందంలో చైనా సోషల్ మ్యూజిక్ రీసెర్చ్ బోర్డ్ కు చెందిన లూ షి జంగ్, లంగ్జూ గ్రూప్ కు చెందిన యంగ్ లీ, యంగ్ జుడోంగ్, డింగ్ యాలీ, లీ గుపూ, కీ టైప్ టెక్నాలజీస్ లిమిటెడ్ సి ఇ ఒ లియు జున్(మైఖేల్) ఉన్నారు. ఆంద్ర ప్రదేశ్ లో జరుగుతున్న సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలను ఎ పి ఇంచార్జ్ తమ్మారెడ్డి భరద్వాజ ఈ బృందానికి వివరించారు.
"భయపడుతున్న" చిరంజీవి..?!

రాజకీయ రంగ ప్రవేశం పట్ల చిరంజీవి భయపడుతున్నారా?. ఏమో, పరిస్థితులు చూస్తే చిరంజీవి భయపడుతున్నట్లుగానే అనిపిస్తోందని టాలీవుడ్ సమాచారం. తెలుగు సినీ రంగంలో చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టకపోవచ్చన్న వదంతులు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుత రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక విధాలుగా చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆయనను రాజకీయాల్లోకి రాకుండా చూస్తోందన్న అభిప్రాయం సినీ రంగ ప్రముఖుల్లో ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న విషయాన్ని అధికారులు వైఎస్ కు నివేదించారట. ఈ విశయమై రాజశేఖర రెడ్డి ఇంటలిజెన్స్ అధికారులకు సంపూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా రహస్య ఆదేశాలిచ్చారని టాలీవుడ్ లో వదంతులు వినిపిస్తున్నాయి. అదీగాక చిరంజీవి ఆస్తులకు సంబంధించిన గుప్త సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని మరో వదంతి సినీ పరిశ్రమలో వ్యాపించింది. కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నుంచి ఈ సమాచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులు తెప్పించుకున్నట్టు పలువురు అనుకోవడం తెలుగు సినీ పరిశ్రమలో బహిరంగ రహస్యమే. అల్లు అరవింద్ సహా, పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, కొందరు మితృల వత్తిడికి తలొగ్గిన చిరంజీవి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారే కానీ ఆయనకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదని చెబుతున్నారు. చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బు పాడుచేసుకోవడం ఇష్టం లేదంటున్నారు. చిరంజీవి పార్టీపై మీడియాలో వార్తా కథనాలు బాగా తగ్గిపోయాయి. మరో నెలరోజుల్లో చిరంజీవి రాజకీయ పార్టీ విశయంలో ముందుకు రానట్టయితే ఆయన రాజకీయాల్లోకి శాశ్వతంగా రాకపోవచ్చన్ని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Friday, April 18, 2008
వరల్డ్ టాప్ 20 ఫైట్ (యాక్షన్) మూవీస్ ఫరెవర్
20. Road House
(Courtesy: Rotten Tomatos)
Thursday, April 17, 2008
"తెలుగుదేశం" పార్టీ లో చేరిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు
సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు తెలుగుదేశం పార్టీలో చేరారని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత బుధవారం పత్రికలవారితో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. పార్టీలో వారికి క్రియాశీలక విభాగంలో సభ్యత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ "సినీ నటుడు బాలకృష్ణ పార్టీలోనే ఉన్నారని,బాలకృష్ణ గతంలో కూడా అనేక సభల్లో పాల్గొన్నారని, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పార్టీ కోసం వాహనమే నడిపారని ఆయన మీడియా
ప్రతినిధులతో అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా పార్టీలోకి వచ్చారని తెలిపారు. పార్టీ కోసం వారు పనిచేయడంలో తప్పు లేదని ఆయన అన్నారు. పార్టీని కాపాడి ప్రజలకు సేవలు చేసేలా పార్టీని తీర్చిదిద్దదడం కోసం వారు పని చేయడంలో తప్పు లేదని ఆయన అన్నారు.




































































































