Friday, August 17, 2007

అమెరికాకు చెందిన 'బిజినెస్ వీక్' సర్వేలో "టాప్ 50"లో రజినీకంత్.





భారతీయ తొలి యాభై మంది ప్రముఖుల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకంత్ స్థానం సంపాదించారు. భారత 60వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన 'బిజినెస్ వీక్' పత్రిక భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా అగ్రగాములుగా ఉండటంతో పాటు అత్యంత ప్రజాదరణ కలిగిన మొదటి 50మంది ప్రముఖులు ఎవరనే అంశంపై ప్రత్యేక సర్వే నిర్వహించింది.సినీ, రాజకీయ, క్రీడ,వ్యాపార, వైద్య, శాస్త్రీయ రంగాలలో జరిగిన ఈ సర్వేలో సూపర్ స్టార్ రజినీకంత్ స్థానం సంపాదించుకున్నారు. ఈ పత్రిక రజినీకాంత్ ను దక్షిణాది చలన చిత్ర మహరాజుగా అభివర్నించింది.ఇటీవల విడుదలైన "శివాజి" చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృస్తిని ఆకర్శించిన నేపద్యంలో జరిగిన ఈ సర్వేలో "శివాజి" రజినీ ఫేం పెరిగేందుకు దోహదపడిందని పేర్కొంది.బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్,షారుఖ్ ఖాన్,అమీర్ ఖాన్,ఐశ్వర్యరాయ్ తదితరులు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

శ్రీవెంకట్ బులెమోని.

No comments: