Tuesday, August 14, 2007

కేరళలో ప్రారంభమౌతున్న "పిరమిడ్" సంస్థ.

పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ కేరళ గడ్డపై అడుగుపెడుతోంది. భారతదేశంలోని అతిపెద్ద థియేటర్ చైన్ లింకింగ్ సంస్థ అయిన పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక,తమిళనాడు,హర్యానాలతోబాటు మలేషియాలలో కూడా విస్తరించింది.పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ కేరళలో చలనచిత్ర నిర్మాణం,పంపిణీ,ప్రదర్షణ విభాగాలలో సేవలందించనుంది. ఈ నెల 18వ తేదీన పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ కేరళ రాస్ట్ర కార్యాలయాన్ని రాస్త్ర విద్య,సాంస్కృతిక శాఖామంత్రి ఎం.ఎ.బేబి ప్రారంభిస్థారు.అలాగే పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకునిగా నిర్మించనున్న తొలి మళయాళ చిత్ర ప్రారంభోత్సవం జరుపనున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థల చైర్మెన్ వి.నటరాజన్,డైరెక్టర్ ఎన్.నారాయణన్,మేనేజింగ్ డైరెక్టర్ సామినాధన్, ట్రివేండ్రం మేయర్ జియన్ బాబు, కేరళ రాస్ట్ర కళాచిత్ర అకాడెమీ చైర్మెన్ కె.ఆర్.మోహన్ లు పాల్గొంటారు.కేరళ రాష్ట్ర కార్యాలయ చిరునామా:
పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
59/2082,ట్యాబ్ రోడ్,కొచ్చి-682016,కేరళ,ఇండియా.
శ్రీవెంకట్ బులెమోని.

1 comment:

Anonymous said...

పిరమిడ్ సంస్థ అందిస్తున్న సినీ సేవకు కృతఘ్నతలు. ఈ సేవ ఇలాగే కొనసాగించాలని కోరుతున్నం.
రమా ఆనంద్, వారణాసి.