
క్రేజీ హీరో విక్రం, తమిళనాడులో స్థిరపడిన తెలుగువాడైన దర్శకుడు లింగు స్వామి, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నంల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న "భీమ" విడుదలకు సిద్దమవుతోంది. తమిళంలో నిర్మించిన పితామగన్, అన్నియన్ చిత్రాల తెలుగు అనువాద చిత్రాలు శివపుతృడు,అపరిచితుడు లుగా విడుదలై ఘనవిజయం సాధించాయి. తెలుగు వాడైన విక్రం ఇప్పుడు తమిళ, తెలుగు భాషలలో ఏకకాలంలో నిర్మించిన ఈ "భీమ"లో నటించాడు. ఇందులో విక్రం సరసన త్రిశ జంటగా నటించింది. గుండెధైర్యమే బలమనుకునే ఒ మొరటోడికి సంబంధించిన కథతో రూపొందిన ఈ చిత్రంలో త్రిశ ది అదిక ప్రాధాన్యతగల పాత్ర అని నిర్మాత తెలియజేస్తున్నారు.

No comments:
Post a Comment