Friday, August 31, 2007

నాకూ ఒక్క జాతీయ అవార్డు కావాలి: త్రిష.



టాలీవుడ్, మరియు కోలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ అయిన త్రిష అవార్డుకోసం చకోర పక్షిలా ఎదురు చూస్తొంది. తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాల్లో నటించినా ఇంతవరకు ఒక్క జాతీయ అవార్డయినా రాక పోవడం ఆమెను చాలా బాధ పెట్టినట్లు తెలిసింది. దాంతో ఎలాగయినా ఒక్క జాతీయ అవార్డయినా సాధించాలనే లక్ష్యంతో ఆమె ఒక్క సమాంతర చిత్రం (ఆర్ట్ ఫిల్మ్) లో అయినా నటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అలాగే ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కూడా తన పాత్ర ప్రాధాన్యతను, ఆయా విషయాలు అవార్డు కమిటీలను తృప్తి పరిచేలా ఉన్నాయా, లేవా అని తరచి తరచి చూస్తున్నట్లు తెలిసింది. కమర్షియల్ చిత్ర నిర్మాతలు అవార్డు విషయాలకు అంత ప్రాధాన్యం ఇవ్వరని తెలిసినా తను మాత్రం ఆశగానే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం తను తెలుగులో ప్రభాస్ ప్రక్కన "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై", చిత్రంలో, అలాగే రవితేజ ప్రక్కన నటిస్తోంది. ఇక తమిళంలో విజయ్ తో "కురవి" చిత్రంలో, గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న "చెన్నయిల్ ఒరు మలై కాలం" చిత్రంలో, మరియు రాధా మోహన్ చిత్రంలో నటిస్తోంది. కాగా రాధా మోహన్ చిత్రంలో తండ్రీ కూతుళ్ళ మద్యన కొనసాగే ఆత్మీయానుభంధాలు కథాంశంగా నిర్మిస్తుండడం వల్ల ఆ చిత్రం తన కోరిక తీర్చొచ్చనే ఆశతో త్రిష ఉన్నట్లు తెలిసింది.ఎనీ హౌ త్రిషా బెస్ట్ ఆఫ్ లక్.

No comments: