Tuesday, August 21, 2007

పిరమిడ్ విడుదల చేయనున్న "చందమామ" చిత్రం.


పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన "చందమామ" చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేస్తోంది. నవదీప్,శివ బాలాజీ, కాజల్, సింధు మీనన్ నాయికా నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రేఖా కంబైన్స్ సమర్పణలో తేజ సినిమా పతాకంపై సి.కల్యాన్, ఎస్.విజయానంద్ లు నిర్మించారు.
ఈ సినిమా పాటలను సోమవారం విడుదల చేసారు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు. హృద్యమైన ప్రేమ కథతో నిర్మించిన ఈ చిత్రం గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలంటున్నారు. ఇందులో నాగేంద్ర బాబు మరియు ఆహుతి ప్రసాద్ లకు చాలా అద్భుతమైన పాత్రలు లభించినట్లు తెలిసింది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథగా రూపొందించిన ఈ చిత్రానికి కె.ఎం.రాధాకృష్నన్ సంగీతాన్ని అందించారు.
శ్రీవెంకట్ బులెమోని.



No comments: