Wednesday, August 22, 2007

నిర్మాతల మండలి అధ్యక్షునిగా భరద్వాజ.



తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2007-09 సంవత్సరానికి గాను ఈ ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆరోగ్యకరమైన పద్దతిలో ఎన్నికలు లేకుండానే నూతన అధ్యక్షుడిని, ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. నూతన అధ్యక్షులుగా తమ్మారెడ్డి భరద్వాజ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా వడ్డే రమేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా టి.వి.డి.ప్రసాద్,సి.వి.రెడ్డి, సం యుక్త కార్యదర్శులుగా జి.వి.హెచ్.ప్రసాద్,వజ్జా శ్రీనివాస రావు, కోషాధికారిగా సి.కల్యాణ్ లు ఎంపికయ్యారు. సి.అశ్వినీ దత్, కె.యస్.రామా రావు,అల్లు అరవింద్,పి.వి.కిషోర్,డి.సురేష్ బాబు, కె.ఎల్.నారాయణ,కైకాల నాగేశ్వర రావు,కె.అశోక్ కుమార్,ఎం.యల్.కుమార్ చౌదరి, కొడాలి వెంకటేశ్వర రావు,నట్టి కుమార్,ఎస్.మల్లికార్జున రావు, టి.రామసత్యనారాయణ,పి.కల్యాణ్,కామిని వెంకటేశ్వరరావు లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

No comments: