Thursday, August 16, 2007

భక్తుడినుండి భగవంతునివరకు నాగార్జున ప్రయానం.


"కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు
కొండలంటి వరములు గుప్పెడు వాడూ"
అంటూ అన్నమయ్యలో,
"పలుకే బంగారమాయెనా కొదండరామా
పలుకే బంగారామాయెనా
పలుకే బంగారామాయె పిలచిన పలుకవేమి"
అంటూ 'శ్రీ రామదాసు"లో ప్రేక్షకులను భక్తిపారవష్యంలో ఓలలాడించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు భగవంతుని పాత్రలోకి పరాకాయ ప్రవేషం చేయనున్నారు. అక్కినేని నాగార్జునకు ఆప్తమితృడైన ఎం.మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రంలో నాగార్జున భగవంతుని పాత్రకు ఒప్పుకున్నారు. మోహన్ బాబు తనయుడు విష్ను వర్ధన్ బాబు ఇందులో భక్తునిగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్షర్స్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ఇంగ్లీషులో అఖండ విజయం సాధించిన "బ్రూస్ ఆల్మైటీ" చిత్రం ఆధారంగా నిర్మితమవుతోందని తెలిసింది. "చింద్రముఖి" లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు దీనికి దర్షకత్వం వహిస్తున్నారు. 2008 జనవరి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుందని తెలిసింది.
శ్రీవెంకట్ బులెమోని.

No comments: