Monday, August 20, 2007

శరవేగంతో నిర్మిస్తున్న మహేష్ బాబు "అతిథి".

"పోకిరి" సంచలన విజయం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న "అతిథి" చిత్రంపై తెలుగునాట భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురెందర్ రెడ్డి దర్శకుడు. బొంబాయి నటి అమృతా రావు కథానాయికగా తెలుగు తెరకు పరిచయమౌతోంది. యు.టి.వి.సంస్థ భారీ మొత్తం చెల్లించి ఈ చిత్ర దేశవ్యాప్త ప్రదర్శన హక్కులను కైవసం చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్థుతం హైదరాబాద్ లో జరుగుతోంది. చక్కటి కుటుంబంలోని ఆప్యాయతలు, అనురాగాల కలయికగా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.ముంబై నటుడు మురళీ శర్మ ఈ చిత్రం ద్వారా విలన్ పాత్రలో పరిచయమవుతున్నారు.ఇందులో ఆశిష్ విద్యార్థి,సునీల్,బ్రహ్మానందం,వేణు మాధవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి మాటలు అబ్బూరి రవి,రచనా సహకారం వక్కంతం వంశీ,సంగీతం మణిశర్మ,కెమెరా సమీర్ రెడ్డి. కాగా ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అక్టోబర్లో చిత్రం విడుదల అవుతుంది.

శ్రీవెంకట్ బులెమోని.

No comments: