Monday, August 20, 2007

చిరంజీవి తనయుని "చిరుత"లో "క్రిష్" పోలికలు...!?.




చిరంజీవి తనయుడు రాం చరన్ తేజ్ ను కథానాయకునిగా పరిచయం చేస్తున్న "చిరుత" సినిమాలో హిందీ చిత్రం "క్రిష్" పోలికలు చాలా ఉన్నాయని తెలిసింది. చిరంజీవికి మంచి గుర్తింపునిచ్చిన చిత్రం "అడవి దొంగ" మరుయు హృతిక్ రోషన్ "క్రిష్" ల సమ్మేళనమే ఈ "చిరుత" చిత్రం అని తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు కోడై కూస్తున్నారు. ఇందులో రాం చరన్ తేజ ఒక ధనవంతుల ఏకైక సంతానమై ఉంటాడు.కొన్ని వేల ఎకరాల భూమి, పాడి పంటలకు వీరు హక్కుదారులు.వీరి ఆస్థిని కాజేయాలనుకున్న దగ్గరివారు విహార యాత్రకు వీరిని అడవులకు తీసుకువెల్లి చంపివేయగా, వారి కొడుకైన చిన్నారి రాంచరన్ తేజ మాత్రం వారి నుంచి తప్పించుకుని అడవిలోకి వెలతాడు. అడవిలోని జంతువులకు అతను బలి అయ్యుంటాడని భావించిన ఆ హంతహులు వెళ్ళి పోతారు. తదనంతరం అడవిలోని జంతువులకు దగ్గరైన ఆ బాబు అడవిలోనే పెరిగి పెద్దవాడవుతాడు. కాల క్రమంలో జరిగిన పలు మలుపుల తర్వాత అతని దగ్గరున్న చైన్, మరియు పుట్టుమచ్చల అధారంగా అతన్ని గుర్తించిన అతని బందువులు అతని తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారం తీర్చుకునేలా అతన్ని తీర్చిదిద్దుతారు. అయితే ఇతనికి అడవిలో వుండగానే కొన్ని అద్భుత శక్తులు వచ్చి అతను మహా బలవంతుడవుతాడని, ఆ శక్తులు తన శతృవులను ఎదిరించడానికి అతనికి ఉపయోగపడతాయని తెలిసింది. తదనంతర కథనమంతా డర్శకుడు పూరీ జగన్నాథ్ స్టైల్లో వుంటాయని తెలిసింది.ఈ చిత్ర కథను గోప్యంగా వుంచడానికి షూటింగ్ మొత్తం జమైకా అడవులలో,బ్యంకాక్ అడవులలో చిత్రీకరించారు. ఇక పాటలను న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. ఈ పాటలను ఈ నెల 22న మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. కాగా ఇందులో చిన్నప్పటి 'చిరుతాగా పూరి జగన్నాథ్ కుమారుడు నటించాడు. ఇందులోని ఫైట్లు మహాద్భుతంగా వచ్చాయని సినీ విలేఖరులు అంటున్నారు. కాగా ఈ "చిరుత" తెలుగు సినీ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో వేచిచూస్థేగానీ తెలీదు.

శ్రీవెంకట్ బులెమోని.


1 comment:

Anonymous said...

Very good information.