Friday, August 31, 2007

మహేశ్ బాబు తో రూ.55 కోట్ల ఒప్పందం చేసుకున్న యు.టి.వి.


భారత దేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ అయిన యు.టి.వి. యంగ్ హీరో మహేశ్ బాబుతో రూ.55 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా యు.టి.వి.సంస్థ నిర్మించే మూడు చిత్రాలలో హీరో మహేశ్ బాబు నటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్ కూడా మహే బాబుకు ఇవ్వడం జరిగిందని పద్మాలయా స్టూడియోస్ తెలియజేసింది.

వీరి ఒప్పందంలోని మొదటి చిత్రం జనవరి,2008 లో ప్రారంభమౌతుంది. వీటిని ప్రముఖ యువ దర్శకులతో చిత్రించాలని యు.టి.వి.భావిస్తోందని తెలిసింది. అధికారికంగా తెలియజేయకున్నా ఇప్పటికే ఆయా చిత్రాలకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు నటించిన "అతిథి" చిత్రం దేశవ్యాప్త ప్రదర్శన హక్కులను యు.టి.వి.పెద్ద మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

No comments: