Friday, August 31, 2007

నటశేఖర కృష్ణ,ఇళయరాజా, అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డు.









ప్రముఖ నటుడు నటశేఖర కృష్ణ, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కన్నడ నటుడు, కేంద్ర మంత్రి అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు సంవత్సరాలక్రితం ప్రభుత్వం ఆపేసిన ఎన్.టి.ఆర్. అవార్డు లను తిరిగి పునరుద్దరిస్తూ వరుసగా మూడు సంవత్సరాలకు ఎన్.టి.ఆర్. అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా 2003,2004,2005వ సంవత్సరాలకు గాను నటశేఖర కృష్ణ,ఇళయరాజా, అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, ఒక లక్ష విలువైన వెండి జ్ఞాపికను ప్రదానం చేస్తారు. 2006,2007వ సంవత్సరాలకు గాను ఎన్.టి.ఆర్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఎంపిక చేయవలసి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ అవార్డులను ఈ నవంబరులో జరిగే నంది అవార్డుల ప్రధాన కార్య క్రమంలో గ్రహీతలకు అందజేస్తారు.

No comments: