Monday, August 20, 2007

డిజిటల్ రూపం లోకి రాజ్ కపూర్ చిత్రాలు.


భారతీయ ప్రముఖ దర్శకులలో ఒకరైన స్వర్గీయ రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన "బాబీ", "ప్రేం రోగ్","సత్యం శివం సుందరం" చిత్రాలు డిజిటల్ రూపాన్ని సంతరించుకోనున్నాయి.చలన చిత్రాలను డిజిటల్ రూపంలోకి మార్చడంలో అగ్రగామి సంస్థ అయిన యూఫో మీడియా సంస్థతో ఆర్.కె.స్టూడియోస్ సంస్థ ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఈ సినిమాలను డిజిటల్ రూపంలోకి మార్చడంతోబాటు 70 ఎం.ఎం.చిత్రాలుగా మార్చడానికి వీరు ఒక అవగాహనకు వచ్చారు.సినిమా డిజిటలీకరణ పూర్తయింతర్వాత వీటిని డిజిటల్ థియేటర్లలో ప్రదర్శించడానికి రాజ్ కపూర్ కుమారుడు రణధీర్ కపూర్ నిర్ణయించారు. దీనివల్ల రాజ్ కపూర్ చిత్రాలను ఎలాంటి నష్టం కలగకుండా కాపాడటంతోబాటు భావి తరాలకు అందించినవారమవుతామని ఆయన ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్ కపూర్ ఇతర చిత్రాలను కూడా డిజిటలీకరణ చేస్తామని ఆయన అంటున్నారు.
శ్రీవెంకట్ బులెమోని.

No comments: