
తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్ కమిటీ కన్వీనర్లు మహేశ్వర రావు, భగీరథ, యాంకర్ సుమ లు అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఓటింగ్ ఆధారంగా ఈ అవార్డుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తమకు నచ్చిన చిత్రాలను ఎంపిక చేసుకుని ఎస్.ఎం.ఎస్ ల ద్వారా విజేతలను ఎన్నుకునే కొత్త ఒరవడికి తెలుగులో తాము శ్రీకారం చుడుతున్నామని వారు తెలిపారు.తొలిసారిగా 2006 ఉగాది నుంచి 2007 ఉగాది వరకు విడుదలైన ( శ్రీ రామదాసు నుంచి జగడం వరకు) చలన చిత్రాలలోని ఉత్తమ చిత్రాలను ఎస్.ఎం.ఎస్. ల ద్వారా ప్రేక్షకులు ఎన్నుకోనున్నారని వారు తెలిపారు.అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను ఇంకా రూపొందించాల్సి ఉంది.వాటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
శ్రీవెంకట్ బులెమోని.
1 comment:
THIS IS GOOD MOVEMENT FOR TELUGU CINEMA.
Post a Comment