తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా ప్రజలే న్యాయనిర్నేతలుగా "తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్" కు శీకారం చుట్టారు.తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్ కమిటీ కన్వీనర్లు మహేశ్వర రావు, భగీరథ, యాంకర్ సుమ లు అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఓటింగ్ ఆధారంగా ఈ అవార్డుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తమకు నచ్చిన చిత్రాలను ఎంపిక చేసుకుని ఎస్.ఎం.ఎస్ ల ద్వారా విజేతలను ఎన్నుకునే కొత్త ఒరవడికి తెలుగులో తాము శ్రీకారం చుడుతున్నామని వారు తెలిపారు.తొలిసారిగా 2006 ఉగాది నుంచి 2007 ఉగాది వరకు విడుదలైన ( శ్రీ రామదాసు నుంచి జగడం వరకు) చలన చిత్రాలలోని ఉత్తమ చిత్రాలను ఎస్.ఎం.ఎస్. ల ద్వారా ప్రేక్షకులు ఎన్నుకోనున్నారని వారు తెలిపారు.అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను ఇంకా రూపొందించాల్సి ఉంది.వాటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
శ్రీవెంకట్ బులెమోని.
1 comment:
THIS IS GOOD MOVEMENT FOR TELUGU CINEMA.
Post a Comment