Thursday, August 23, 2007

పన్నెండు మంది కథానాయికలతో బాలకృష్ణ సయ్యాట.
















పన్నెండు మంది కథానాయికలతో బాలకృష్ణ సయ్యాటాడనున్నాడు. దర్శకేందృడు కె.రాఘవేంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న "రంగా- పాండురంగా" చిత్రంలో కథానాయకుడు బాలకృష్ణ సరసన పన్నెండు మంది కథానాయికలు నటించనున్నారు. స్వర్గీయ ఎన్.టి.ఆర్. నటించిన "పాండురంగమహత్మ్యం" చిత్రం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలకృష్ణ భక్తుడిగా, భగవంతుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న "ఒక్క మగాడు" చిత్రం పూర్తవగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవి సెలవులకు విడుదలచేయాలని దర్శక,నిర్మాత కె.రాఘవేంద్ర రావు నిర్ణయించుకున్నారు. దీనికి సంబందించిన స్క్రిప్ట్ కార్యక్రమాలను రచయిత జె.కె.భారవి ఇటీవలే పూర్తిచేసారు. ఇప్పటికే కథానాయికలలో స్నేహ,ప్రియా మణి,పార్వతి మెల్టన్ ల కాల్షీట్లు బుక్ చేయడం జరిగింది.

No comments: