Friday, August 17, 2007

రీమాసేన్ కు "గ్లామర్ క్వీన్" అవార్డు.

"చిత్రం" సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన హేరోయిన్ రీమా సేన్ కు ఇటీవల "గ్లామర్ క్వీన్" అవార్డు వచ్చింది. ఇటీవల సింగపూర్లో జరిగిన సినీ నటుల అవార్డు కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేసారు.పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన రీమాసేన్ ఇటీవల చిత్రాల పరంగా బాగా వెనకబడింది.తెలుగులో "చిత్రం" తర్వాత "మనసంతా నువ్వే" చిత్రం ఆమెకు బాగా గుర్తింపునిచ్చాయి. అయితే ఆతర్వాత చెప్పుకోదగ్గ విజయాలేమీ ఆమెకు రాలేదు.తమిళంలో పలు చిత్రాలలో నటించినా "చెల్లామె" చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఎందుచేతనో ఆమెకు అవకాశాలే రాలేదు. కాగా ప్రస్తుతం ఆమె సెల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న "ఆయిరత్తిల్ ఒరువన్" చిత్రంలో నటిస్తోంది.ఇప్పుడు వచ్చిన అవార్డుతో రీమాసేన్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది.తను ఎలాంటి డ్రెస్ వేసినా అందంగానే ఉంటానని అందుకే తనకీ అవార్డు వచ్చిందని ఆమె తెలిసిన వారిదగ్గరల్లా చెబుతూ మురిసిపోతోంది.
శ్రీవెంకట్ బులెమోని.

No comments: