Friday, November 30, 2007

సింగపూర్ లో జరుగనున్న "చిరుత" 50 రోజుల పండుగ

చిరంజీవి తనయుడు రాం చరన్ నటించిన తొలి చిత్రం "చిరుత" 50 రోజుల ఉత్సవాన్ని సింగపూర్ లో ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్ లోని ప్లాజా థియేటర్ లో డిసెంబర్ 8వ తేదీన జరుగనున్న ఈ ఉత్సవాన్నికి చిత్ర హీరో రాం చరన్, చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, చిత్ర నిర్మాత అశ్వినీ దత్ లు హాజరు కానున్నారు. కాగా సింగపూర్ లో తొలిసారి 50 రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఘనత "చిరుత" చిత్రానికి దక్కనుంది. కాగా సింగపూర్ కు అతి దగ్గరలోని బ్యాంకాక్ లోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన భాగం షూటింగ్ జరగడం ఇక్కడ గమనార్హం.

No comments: