Tuesday, November 13, 2007

"బాటా" ఆధ్వర్యంలో క్యాలిఫొర్నియాలో ఘనంగా జరిగిన "ఘంటసాల ఆరాధనోత్సవాలు"


అమెరికాలోని క్యాలిఫోనియాలో ఉన్న "బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా)" ఆద్వర్యంలో అమర గాయకుడు ఘంటసాల ఆరధనోత్సవాలు ఘనంగా జరిగాయి. గాయక శిరోమణి జి వి ప్రభాకర్, గాయక రత్న మణి శాస్త్రి, రాజు ఏడూరి, గాయత్రి అవ్వారి తదితర కళాకారులు బాటా ఆద్వర్యంలో మిల్పిటాస్(క్యాలిఫోర్నియా)లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆహూతులను అలరించారు. సుమారు 700మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు. ఇందులో జరిగిన ఇతర నృత్య కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నట్లు బాటా తెలిపింది.ఈ కార్యక్రమంద్వారా వసూలయిన $15000/- మొత్తాన్ని వేగ్నేశ ఫౌండేషన్ కోసం విరాళంగ ఇచ్చినట్లు బాటా తెలియజేసింది.




No comments: