Monday, November 26, 2007

చిరంజీవి తదిపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే...!


తెలుగు సినీ అభిమానులు ముఖ్యంగా చిరంజీవి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిరంజీవి తదుపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే రూపొందనున్నట్లు తాజా సమాచారం. చిరంజీవి నటించనున్న 150వ చిత్రానికి "ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి" కథను ఎన్నుకోవడం, ఈ చిత్రానికి చిరంజీవే స్వయంగా దర్శకత్వం వహించనుండగా, ఆయన్ శ్రీమతి సురేఖ స్వయంగా నిర్మించనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కన్నా ముందు నిర్మించబడే 149వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అని ఇంతకాలం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చ కొనసాగింది. తమిళ దర్శకుడు శంకర్ మొదలుకుని కృష్ణ వంశీ, కోదండ రామి రెడ్డి,మురుగదాస్ ల పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. అయితే చివరికి చిరంజీవి వి వి వినాయక్ వినిపించిన రాజకీయ నేపధ్యం గల చిత్రం వైపు మొగ్గు చూయించారని చిరంజీవికి అతి సన్నిహితులు పేర్కొంటున్నారు. జనవరి నెలలోగానీ, లేక ఫిబ్రవరి నెలలోగానీ ఈ చిత్రం ప్రారంభం కావచ్చు. లేదా వచ్చే ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రారంభించవ్బచ్చు. ప్రస్తుతానికి కథను పరిపుష్టిగా తయారుచేయడంలో దర్శకుడు నిమగ్నమై ఉన్నందువల్ల ఇప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి తెలియజేయవద్దని చిరంజీవి, దర్శకుడు కూడా భావించడం వల్ల ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటక్నకోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.

No comments: