Saturday, November 10, 2007

శంకర్, వినాయక్ లతో కథా చర్చలు కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం కథా చర్చల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన కథా చర్చల కోసం చిత్ర దర్శకుడు వి వి వినాయక్‌ను అమెరికాకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.మరో దర్శకుడు శంకర్ తో అల్లు అర్వైంద్ కథా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విశయాన్ని ఆయన ఎప్పటికి అప్పుడు చిరంజీవితో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇటు మీడియాకు, అటు అభిమానులకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ సంఘటనపై తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పి, తన అభిమానులు, రాజకీయనేతల్లో గౌరవం బాగా పెరిగింది.ఈ నేపథ్యంలో తన కుటుంబ బాధను మరచి పోయేందుకు కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లిన చిరంజీవి తన తదుపరి చిత్రంపైనే తన దృష్టంతా కేంద్రీకరించారు. వచ్చే సంక్రాంతి దాకా అమెరికాలోనే ఉండే ఆయన సంక్రాంతికి హైదరాబాద్‌కు ఆయన తిరిగి వచ్చిన తరువాత శంకర్ తో నేరుగా కథా చర్చలలో పాల్గొంటారు. ఇటీవల ఆయన నటించిన "శంకర్‌దాదా జిందాబాద్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెల్సిందే. దీంతో తదుపరి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

No comments: