Saturday, November 17, 2007

సంజయ్ దత్‌ను జైల్లో కలుసుకుని ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్న పాకిస్తాన్ క్రికెటర్


ముంబయి పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను పాకిస్థాన్ స్పీడ్‌స్టార్ షోయబ్ అక్తర్ కలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ కోరికను షోయబ్ అక్తర్ తన ప్రతినిధుల ద్వారా సంజయ్ సోదరి ప్రియాదత్ దృష్టికి తీసుకెళ్లాడు. ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారించబడిన సంజయ్ దత్ ప్రస్తుతం పూణేలోని యారవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.సంజయ్‌ను జైళ్లోనే కలుసుకునేందుకు అక్తర్ ప్రయత్నిస్తున్నట్లు పాక్ మీడియా పేర్కొంది. సంజయ్ దత్‌కు షోబయ్ అక్తర్ వీరాభిమాని. సంజయ్‌కు తాను వీరాభిమానినని, అతడు జైలు నుంచి విడుదల కావాలని ఎన్ని కుటుంబాలు కోరుకుంటున్నాయో తనకు తెలుసని అక్తర్ అన్నాడు.ఈ రావల్పిండీ ఎక్స్‌ప్రెస్ సంజయ్‌కు బహూకరించేందుకు ఓ ప్రత్యేక బహుమతిని కూడా కొనుగోలు చేశాడు. అయితే అదేమి బహుమతో వెల్లడించలేదు. సంజయ్‌ను జైళ్లో కలుసుకునే అవకాశం వస్తే అతనికి ఇచ్చేందుకు తానొక ప్రత్యేక బహుమతిని కూడా సిద్ధం చేసుకున్నానని మాత్రం అక్తర్ చెప్పాడు.

No comments: