Friday, November 30, 2007

డింపుల్ అడ్వర్టైజింగ్ లో 51 శాతం కొనుగోలు చేసిన పిరమిడ్ సాయిమిరా

ముంబై కి చెందిన ప్రముఖ సినీ అడ్వర్టైజింగ్ కంపెనీ డింపుల్స్ సినీ అడ్వర్టైజింగ్ ఆండ్ డింపుల్స్ సినీ యాక్టివేషన్స్ కంపెనీలో 51 శాతం వాటాను చెన్నైకి చెందిన పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. దేశంలోని అతిపెద్ద థియేటర్ చైన్ లింక్ కంపెనీ అయిన పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థకు ఇప్పటికే అమెరికా, సింగపూర్, మలేషియాలలో థియేటర్ల నిర్వహణ చేస్తోంది. భారత దేశంలోని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మళయాలం భాషలలో చలన చిత్రాలను విడుదలచేయడంతోబాటు, పలు చిత్రాలను నిర్మిస్తోంది.ఒక్క తమిళంలోనే ఏక కాలంలో పది చలన చిత్రాలను నిర్మిస్తున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ ఇప్పుడు ముంబైకి చెందిన డింపుల్ సినీ అడ్వర్టైజింగ్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా సినిమా పబ్లిసిటీ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లైంది.పిరమిడ్ సాయిమిరా సంస్థకు ఇప్పటికే అంతర్జాతీయంగా 790 థియేటర్లలో తన వ్యాపార సినీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.డింపుల్ సినీ అడ్వర్టైజింగ్ సంస్థ 200 థియేటర్లలో తన వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు డింపుల్ సంస్థలో పిరమిడ్ సాయిమిరా 51 శాతం కొనుగోలు చేయడం వల్ల ఈ గ్రూపు సంస్థలకు అంతర్జాతీయంగా సుమారు వెయ్యి థియేటర్ల వ్యాపార సామర్థ్యం ఏర్పడింది. 2010వ సంవత్సరానికల్లా 4000 డిజిటల్ థియేటర్ల వ్యాపార లక్ష్యంతో ముందుకు కదులుతున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ నిర్వహణా సంస్థగా వృద్ది చెందడమే లక్ష్యంగా పనిచేస్తోంది.పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ 51 శాతం వాటా కొనుగోలు చేసిన డింపుల్ అడ్వర్టైజింగ్ ఆండ్ డింపుల్ సినీ యాక్టివేషన్స్ ఇక ముందు పిరమిడ్ సాయిమిరా గ్రూప్ ఆఫ్ కంపెనీగా, ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.

తెలుగులోకొస్తున్న కన్నడ నటి సంజన



మరో కన్నడ నటి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "బుజ్జిగాడు-మేడ్ ఇన్ చెన్నై" చిత్రం ద్వారా పరిచయమవుతున్న ఈ నటి తెలుగులో కూడా తను రాణించగలననే నమ్మకంతో ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే త్రిష నటిగా కొనసాగుతుండగా, సంజన రెండవ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ కన్నడ సంజన తెలుగు సంజనగా పరిచయం అవుతుందా, లేక చెన్నై సంజనగా పరిచయం అవుతుందా అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా వుంచి చిత్రాన్ని శరవేగంగా రూపొందిస్తున్నారు.

సింగపూర్ లో జరుగనున్న "చిరుత" 50 రోజుల పండుగ

చిరంజీవి తనయుడు రాం చరన్ నటించిన తొలి చిత్రం "చిరుత" 50 రోజుల ఉత్సవాన్ని సింగపూర్ లో ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్ లోని ప్లాజా థియేటర్ లో డిసెంబర్ 8వ తేదీన జరుగనున్న ఈ ఉత్సవాన్నికి చిత్ర హీరో రాం చరన్, చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, చిత్ర నిర్మాత అశ్వినీ దత్ లు హాజరు కానున్నారు. కాగా సింగపూర్ లో తొలిసారి 50 రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఘనత "చిరుత" చిత్రానికి దక్కనుంది. కాగా సింగపూర్ కు అతి దగ్గరలోని బ్యాంకాక్ లోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన భాగం షూటింగ్ జరగడం ఇక్కడ గమనార్హం.

Thursday, November 29, 2007

అమెరికాలో ఘనంగా జరిగిన "యమదొంగ" 100 రోజుల పండుగ

యంగ్ ఎన్ టి ఆర్ నటించిన "యమదొంగ" చిత్రం 100 రోజులు పూర్తయిన సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లో చిత్ర విజయోత్సవాన్ని అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ సిటీలోని గ్లోబల్ మూవీ సెంటర్ లో వందల మంది యంగ్ ఎన్ టి ఆర్ అభిమానులు హాజరై ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. "యమదొంగ" చిత్రం అమెరికా డిస్ట్రిబ్యూటర్ రమన సంచుల, చిత్ర నిర్మాత చెర్రీ ల సహకారంతో జరిగిన ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయని కార్యక్రమ నిర్వాహకులు వెంకట్ గరికపాటి, కె పి చౌదరిలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎన్ ఆర్ ఐ చిత్రం అందించిన "దాన వీర సూర కర్ణ","యమదొంగ" చిత్రాలను అభిమానులు అత్యంత ఆదరణతో చూసి ఆనందించినట్లు నిర్వాహకులు తెలియజేశారు.

"సతీ లీలావతి"గా శిల్పా శెట్టి రియల్లీ హాట్ (ఎక్స్ కూజివ్ గ్యాలరీ)


160 థియేటర్లలో తెలుగులో విడుదలవనున్న "జోధా అక్బర్"

















హృతిక్ రోషన్, ఐష్వర్యా రాయ్ ల ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం "జోధా అక్బర్" పెద్ద యెత్తున తెలుగులో విడుదల కానుంది. మొగల్ చక్రవర్తి అక్బర్, జోధాభాయ్ ల ప్రేమ కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా యు టి వి విడుదలచేయనుంది. ఇటీవల మహేశ్ బాబు నటించిన "అతిధి" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడంతోబాటు, పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం "జల్సా' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న యు టి వి ఈ జోధా అక్బర్ చిత్రాన్ని విడుదల చేయనుండటంతో దీనిపై భారీ అంచనాలు పెరిగాయి. తెలుగులో 160 థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం హిందీలో 750 థియేటర్లలో, మరియు తమిళంలో 100 థియేటర్లలో విడుదలకానుంది. ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్న యు టి వి భారత దేశంలోనే 1000కి పైగా థియేటర్లలో విడుదల చేయనుండటం ఇక్కడ గమనార్హం.

Wednesday, November 28, 2007

హీరోయిన్ గా నటించనున్న కమల హాసన్ కూతురు




కమల్ హాసన్, సారికల గరాలపట్టి శృతీ హాసన్ ఇకపై తన తల్లిదండృలలాగానే తనూ సినిమాలలో నటించనుంది.న్యూయార్క్ లో సంగీతంలో శిక్షణ తీసుకున్న శృతీ హాసన్ తమిళంలో మాధవన్ సరసన నటించనుంది. మంచి గాత్రం కూడా వున్న శృతీ హాసన్ ప్రస్తుతం తన తండ్రి నటించిన "దశావతారం" చిత్రం కోసం ఒక పాట కూడా పాడటమే కాకుండా, స్వంతంగా ఒక ఆల్బం కూడా రూపొందిస్తోంది. ఒకేసారి గాయనిగా, నటిగా రాణించడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్న శృతీ హాసన్ తన తొలి చిత్రం లో తమిళంలో నటిస్తూ, త్వరలోనే దక్షిణ భారతీయ అన్ని భాషలలో విభిన్నమైన పాత్రలను ఒప్పుకోవడం తనకున్న కోరికగా ఆమె వెళ్ళడించడం తండ్రి పోలికలను పునికిపుచ్చుకున్నట్లు అనిపించడం లేదూ.

ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంటున్న లవర్ బాయ్


టాలీవుడ్ లవర్ బాయ్ తరున్ లండన్ లో ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.ఇటీవలి "నవవసంతం" చిత్రం రిలీజయిన వెంటనే లండన్ వెళ్ళిన తరున్ మరో నాలుగు నెలల పాటు ఈ శిక్షణ తీసుకోనున్నాడు.ఇందులో భాగంగా చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రాధమికస్థాయి విషయాలతోబాటు, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, ఎడిటింగ్, చిత్ర కథా రచనలకు సంబంధించిన విషయాలను కొంతమేరకు తెలుసుకోనున్నాడు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత తను నటించబోయే చిత్రాలపట్ల ఎక్కువ శ్రద్ద వహిస్తానని తరున్ తన సన్నిహితులతో చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇక ముందు చిత్రాలలో నటించడంతోబాటు, ఇతర రంగాలలో కూడా తను వేలు దూర్చే కార్యక్రమాలు చేయనుండటం మంచిదేగా...?!

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(28/11/2007)

(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
AWAKE : Rating-R
(for language, an intense disturbing situation, and brief drug use)

BADLAND :Rating-R
(for some strong disturbing violence and pervasive language)

THE DIVING BELL AND THE BUTTERFLY :Rating-PG-13
(for nudity, sexual content and some language)

THE SAVAGES :Rating-R
(for some sexuality and language)

RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED


శ్రీవెంకట్ బులెమోని

Tuesday, November 27, 2007

ఆసియాలోని 10మంది అత్యంత సుందరాంగులు-2007

ఆసియా ఖండంలోని అత్యంత సుందరాంగులు వీరేనని ఓ పత్రిక ఇటీవల పేర్కొంది.బిపాషా బసు అందరిలోకీ అయంత ఆకర్షనీయమైన, మోస్ట్ సెక్సీ యెస్ట్ ఉమన్ గా పేర్కొన్న ఈ పత్రిక ఆ తరువాత స్థానాలను వరుసగా మాధురీ దీక్షిత్, ప్రియాంక చోప్రా, ఐష్వర్య రాయ్,శిల్పా షెట్టి, కత్రినా కైఫ్, కరీనా కపూర్, లారా దత్తా,ఇషా కొప్పీకర్, మల్లికా షెరావత్ లకు కట్టబెట్టింది. వారి ఫోటోలను ఇక్కడ ప్రచురిస్తున్నాము. గమనించండి.








తమిళ "హ్యాప్పీడేస్" లో నటించాలనుందా...

సినిమా ఛాన్స్ కోసం ఆసక్తి పరులు నిర్మాతల చుట్టూ, దర్శకుల చుట్టూ తెగ తిరుగుతూ అలిసిపోయే ప్రతిభావంతులకు ఓ శుభ వార్త. ప్రతిభా వంతులైన నటీ నటులు, దర్శకుల కోసం తమిళ నాడుకు చెందిన డ్యూయట్ ఫిలింస్ ఓ మంచి అవకాశం కల్పించడానికి పూనుకుంది.ఈ డ్యూయట్ ఫిలింస్ పేరెక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా. అదే నండీ, ప్రముఖ నటుడు, నిర్మాత అయిన ప్రకాశ్ రాజ్ స్వంత సంస్థ ఇది.గతంలో పలు తమిళ చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం తమిళంలో అరడజను చిత్రాలను నిర్మిస్తోంది. తెలుగులో ఘన విజయం సాధించిన "హ్యాప్పీడేస్" చిత్రాన్ని అదే పేరుతో తమిళంలో నిర్మించనుందా సంస్థ. దీనికోసం ప్రతిభా వంతులైన నటీ, నటులు దర్శకుల కోసం ఈ సంస్థ వెతుకుతోంది.18 నుంచి 23 ఏళ్ళలోపు యువతీ,యువకులకోసం ఈ సంస్థ వెతుకుతోంది. మంచి ముఖ వర్ఛస్సు ఉండి, నటించగలమనే నమ్మకం ఉన్న ఆసక్తి పరులు తమ ఫోటోలు, దరఖాస్తులను వెంటనే duetmovies@gmail.com కు ఈ మెయిల్ చేయండి. అదృష్టం బావుంటే మీకే ఈ ఛాన్స్ వచ్చినా రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్.

"సాంగేసుకుందామా" ముమైత్ ఖాన్ ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ













































Monday, November 26, 2007

పవన్ కళ్యాణ్ "జల్సా" కు రూ.29/- కోట్ల భారీ ఆఫర్!!!!







పవన్ కళ్యాణ్ నూతన చిత్రం "జల్సా" నిర్మాణానికి ముందే సంచలనాలు సృష్టించడం ప్రారంభించింది. ముంబై కి చెందిన భారీ కార్పోరేట్ కంపెనీ యు టి వి ఈ చిత్ర దేశవ్యాప్త హక్కులకోసం ఏకంగా రూ.29/-కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ గా ఇచ్చింది.ఇంతవరకు మరే తెలుగు చిత్రానికీ ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ రాకపోవడం ఇక్కడ గమనార్హం. మెగా స్టార్ చిరంజీవి చిత్రానికి మించిన ఆఫర్ ఈ చిత్రానికి ఇవ్వడంపై రాబోయే చిరంజీవి చిత్రాన్ని(ఇంకా ప్రారంభం కాలేదు) ఇంకా పెద్ద మొత్తం వెచ్చించి కొనడానికి తాము సిద్దమేనని యు టి వి స్పష్టం చేయదలచిందని, అందుకే ఈ చిత్రానికి భారీ మొత్తంలో వెచ్చించడానికి ముందుకు వచ్చ్చిందని టాలీవుడ్ బిజినెస్ పండితులు తెలియజేస్తున్నా, దక్షిణ భారత దేశంలోని బలీయమైన తెలుగు భాషా చిత్రాలను తాము ఎక్కువగా కొనదలచినందులకే ఇక్కడి ప్రముఖ చిత్రాలను పెద్ద మొత్త వెచ్చించి కొంటున్నామని సంస్థకు సంబంధించినవారు ఇండస్ట్రీలో చెబుతున్నట్లు వినికిడీ.గతంలో మహేశ్ బాబు నటించిన "అతిధి" చిత్రాన్ని రూ.23/-కోట్లు వెచ్చించి కొన్న ఈ సంస్థ పవన్ కళ్యాణ్ "జల్సా" కు పెద్ద మొత్తం ఆఫ్ర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ ను చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఇంకా ఒప్పుకోలేదు. ముచ్చటగా ముప్పై కోట్ల రూపాయల ఆఫర్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు వినికిడి.

దొంగల కాలేజీ ప్రిన్సిపాల్ గా నటించనున్న "బ్రహ్మానందం"




"డా.ఆనందం,ప్రిన్సిపాల్,దొంగల కాలేజీ" పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోశిస్తున్న ఈ చిత్రానికి శరత్ ఉండవల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పెరిగిన హాస్య చిత్రాల కోవలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందే ఈ చిత్రంలో తెలుగు సినీ పరిశ్రమలోని హాస్య నటులంతా నటించనున్నట్లు తెలిసింది. ఈ "డా.ఆనందం,ప్రిన్సిపాల్,దొంగల కాలేజీ"చిత్రానికి "బిసైడ్, అసెంబ్లీ రెండో గేటు" అనే క్యాప్షన్ ను కూడా పెట్టి మరీ చిత్రం ద్వారా తము చెప్పదలచుకున్న విషయాన్ని దర్శక,నిర్మాతలు స్పష్టం చేయడంతో ఈ చిత్రం పై పరిశ్రమలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి.డిసెంబరు నెలాఖరులో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతల లక్ష్యంగా తెలుస్తోంది.

చిరంజీవి తదిపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే...!


తెలుగు సినీ అభిమానులు ముఖ్యంగా చిరంజీవి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిరంజీవి తదుపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే రూపొందనున్నట్లు తాజా సమాచారం. చిరంజీవి నటించనున్న 150వ చిత్రానికి "ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి" కథను ఎన్నుకోవడం, ఈ చిత్రానికి చిరంజీవే స్వయంగా దర్శకత్వం వహించనుండగా, ఆయన్ శ్రీమతి సురేఖ స్వయంగా నిర్మించనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కన్నా ముందు నిర్మించబడే 149వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అని ఇంతకాలం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చ కొనసాగింది. తమిళ దర్శకుడు శంకర్ మొదలుకుని కృష్ణ వంశీ, కోదండ రామి రెడ్డి,మురుగదాస్ ల పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. అయితే చివరికి చిరంజీవి వి వి వినాయక్ వినిపించిన రాజకీయ నేపధ్యం గల చిత్రం వైపు మొగ్గు చూయించారని చిరంజీవికి అతి సన్నిహితులు పేర్కొంటున్నారు. జనవరి నెలలోగానీ, లేక ఫిబ్రవరి నెలలోగానీ ఈ చిత్రం ప్రారంభం కావచ్చు. లేదా వచ్చే ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రారంభించవ్బచ్చు. ప్రస్తుతానికి కథను పరిపుష్టిగా తయారుచేయడంలో దర్శకుడు నిమగ్నమై ఉన్నందువల్ల ఇప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి తెలియజేయవద్దని చిరంజీవి, దర్శకుడు కూడా భావించడం వల్ల ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటక్నకోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.

Saturday, November 24, 2007

వీకెండ్ ఎక్స్-క్లూజివ్ :పాప్ గాయని ఛరిష్మా ఆగ్విలెరా (గ్యాలరీ)





































నాగార్జున "డాన్" లేటెందుకవుతోంది...?




అక్కినేని నాగార్జున నటిస్తున్న "డాన్" చిత్రం బాగా లేటుగా రిలీజయ్యేలా వుందని టాలీవుడ్ టాక్.అక్కినేని నాగార్జున, అనుష్క నాయికా నాయకులుగా, ఎం ఎల్ కుమార్ చౌదరి నృత్య దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం లేటవడానికి ప్రధానంగా అంచనాలకు మించిన బడ్జెట్టే కారణమని ఒక అంచనా. నిజానికి కూడా ఈ చిత్రానికి సుమారుగా 16నుంచి 18 కోట్ల రూపాయలను ముందుగా బడ్జెట్ గా అనుకున్నప్పటికీ, ఇప్పటికే దీని బడ్జెట్ 20 కోట్ల రూపాయలు దాటగా, ఇంకా చేయవలసిన షూటింగ్ భాగం కొంత పెండింగ్లో ఉండటం బట్టి ఈ చిత్రం నిర్మాత ప్రకటించిన డిసెంబర్ 20వ తేదీకి రిలీజు అవుతుందా, లేక మరికొంత ముందుకు జరుగుతుందా అని టాలీవుడ్ లో ఒకటే చర్చ కొనసాగుతోంది. అందునా చిత్రం ఆడియోను కూడా రానున్న డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు భావించినప్పటికీ, అది కూడా మరికొంత ముందుకు జరిగే అవకాశం ఉన్నట్లు సినీ పరిశీలకుల అభిప్రాయంగా తెలుస్తోంది. మరి అంచనాలకు మించిన వ్యయం, చిత్రం విడుదల తేదీ ఇలా మారుకుంటూ పోతే చివరికి ఎటువంటి రిజల్ట్ ఎదుర్కోవలసి వస్తుందోనని నిర్మాత తోబాటు, చిత్ర సంబందీకులూ ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ హాటెస్ట్ "బ్యూల్ఫ్" ఎక్స్ క్లూజివ్ ఫోటోస్









శ్రీవెంకట్ బులెమోని

త్రిశాయణం: ఫోటోలతో త్రిశ జీవిత చిత్రం(వీకెండ్ గ్యాలరీ)













శ్రీవెంకట్ బులెమోని

నేనూ, నా బుజ్జి కుక్క పిల్లలూ:హీరో విక్రం (ఎక్స్ క్లూజివ్ ఫోటో గ్యాలరీ)





శ్రీవెంకట్ బులెమోని

Friday, November 23, 2007

అమెరికా బాక్స్ ఆఫీస్ లో "బేవూల్ఫ్" హవా

1. Beowulf $28.1Millions2.Bee Movie $14.3Millions
3.American Gangster $13.2Millions
4.Fred Claus $12Millions
5.Mr. Magorium's Wonder Emporium $10Millions
6.Dan in Real Life $4.5Millions
7.No Country for Old Men $3.1Millions
8.Lions for Lambs $2.9Millions
9.Saw IV $2.3Millions
10.Love in the Time of Cholera $2.1Millions
శ్రీవెంకట్ బులెమోని

"బ్యాట్ ఉమన్" అలీసియా సిల్వర్ స్టోన్" ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీ


"కృష్ణ-అర్జున్" లను అభినందించిన రజినీకాంత్

అక్కినేని నాగార్జున మోడ్రన్ దేవునిగా, విష్ణు ఆధునిక భక్తునిగా నటిస్తున్న "కృష్ణ-అర్జున్" చిత్ర యూనిట్ ను ప్రముఖ నటుడు రజినీ కాంత్ అభినందించారు. ప్రముఖ నిర్మాత మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబుకు మంచి మితృడైన రజినీ కాంత్ చిత్రం షూటింగ్ కు వెళ్ళి అందరినీ పలకరించారు. మంచి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన పాత్రికేయులకు చెప్పారు.

Thursday, November 22, 2007

హాలీవుడ్ ఫోటో గ్రాఫర్ "అల్ఫ్రెడో" ట్రిక్ ఫోటోస్ (గ్యాలరీ)


ఆర్తి అగర్వాల్, ఉజ్వల్ కుమార్ ల పెళ్ళి ఫోటోలు





"ఆల్ టైం వరల్డ్ రికార్డ్ టాప్-20" ఫిలింస్

ప్రపంచ సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా ఆల్ టైం వరల్డ్ రికార్డ్ సృస్టించిన చిత్రాలను మీ ముందుంచుతున్నాము. వంద సంవత్సరాల సినీ చరిత్రలో ఇప్పటికి వీటి చరిత్రే రికార్డు. ఆయా చిత్రాలను, ఆయా చిత్రాలు సాధించిన కలెక్షన్ల వివరాలను ఇక్కడ ప్రచురిస్తున్నాము. చూడండి.
Titanic (1997) -$1,835,300,000The Lord of the Rings: The Return of the King (2003)-$1,129,219,252
Pirates of the Caribbean: Dead Man's Chest (2006) -$1,060,332,628
Harry Potter and the Sorcerer's Stone (2001) -$968,657,891
Pirates of the Caribbean: At World's End (2007) -$958,404,152
Harry Potter and the Order of the Phoenix (2007) -$936,580,420
Star Wars: Episode I - The Phantom Menace (1999) -$922,379,000
The Lord of the Rings: The Two Towers (2002) -$921,600,000
Jurassic Park (1993) -$919,700,000
Harry Potter and the Goblet of Fire (2005) -$892,194,397
Spider-Man 3 (2007) -$885,430,303
Shrek 2 (2004) -$880,871,036
Harry Potter and the Chamber of Secrets (2002) -$866,300,000
Finding Nemo (2003) -$865,000,000
The Lord of the Rings: The Fellowship of the Ring (2001) -$860,700,000
Star Wars: Episode III - Revenge of the Sith (2005) -$848,462,555
Independence Day (1996) -$811,200,000
Spider-Man (2002) -$806,700,000
Star Wars (1977) -$797,900,000
Shrek the Third (2007) -$791,106,665
శ్రీవెంకట్ బులెమోని

Wednesday, November 21, 2007

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ఫోటో సెషన్





పవన్ కళ్యాణ్ "జల్..సా.."గుతోందా?




పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా నటిస్తున్న "జల్సా" చిత్రం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు జంటగా నటిస్తున్న నటి ఇలియానా హిందీ చిత్రంలో నటించడానికి దక్షిణ ఆస్ట్రేలియా వెళ్ళనుండటమే ప్రధాన కారణంగా బయటికి కనిపిస్తున్నాప్పటికీ, కావాలనే ఈ చిత్రాన్ని సాగదీస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ "జల్సా" చిత్రాన్ని ముందుగా సంక్రాంతి చిత్రంగా బరిలోకి దించాలని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ భావించారు. అయితే అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ నటిస్తున్న దిల్ రాజు, బొమ్మరిల్లు భాస్కర్ల కాంబినేషన్లోని చిత్రం కూడా ఈ సంక్రాంతి విడుదలకు తేదీని కూడా ఖరారు చేసుకోవడంతో తప్పనిసరిగా, అల్లు అరవింద్ తన కుమారుని చిత్రం కోసం తను నిర్మిస్తున్న చిత్రాన్ని కావాలనే సాగదీస్తున్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే రెండు షెడ్యూల్లు షూటింగ్ జరిగిన "జల్సా" చిత్రం మరో షెడ్యూల్ జరిగితే పూర్తవుతుంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో బాగా లేటవడం వల్ల చిత్ర కథానాయిక ఇలియానా, తాను ముందుగా ఒప్పుకున్న హిందీ చిత్రంలో నటించడానికి ఈ వారంలోనే దక్షిణ ఆస్ట్రేలియా వెలుతోంది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ హిందీ చిత్ర షూటింగ్ దక్షిణ ఆస్ట్రేలియాలో మరో నెల రోజులు షూటింగ్ జరుగుతుంది. అంటే ఇలియానా జనవరిలోగానీ తిరిగి వచ్చి "జల్సా"లో పాల్గొనదన్న మాట.ఏదేమైనా చివరికి పవన్ కళ్యాణ్ జల్సా మాత్రం "సాగుతోందీ.

టబు,అబ్బాస్ ల "ఇదీ సంగతి" లేటెస్ట్ ఫోటో గ్యాలరీ






ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(21/11/2007)

(This post courtesy by Red Carpet Ratings)
(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
AUGUST RUSH : Rating-PG
(for some thematic elements, mild violence and language)

ENCHANTED : Rating-PG
(for some scary images and mild innuendo) HITMAN : Rating-R
(for strong bloody violence, language and some sexuality/nudity)

I'M NOT THERE : Rating-R
(for language, some sexuality and nudity)
NINA'S HEAVENLY DELIGHTS : Rating-PG-13
(for some sexual content)
STARTING OUT IN THE EVENING :Rating-PG-13
(for sexual content, language and brief nudity)
STEPHEN KING'S THE MIST :Rating-R
for violence, terror and gore, and language
THIS CHRISTMAS :Rating-PG-13
for comic sexual content and some violence



RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED

శ్రీవెంకట్ బులెమోని

Tuesday, November 20, 2007

ఫేమస్ హాలీవుడ్ 3డి ఆర్టిస్ట్ మార్టిన్ లిసెక్"3-D అర్ట్స్" గ్యాలరీ






బాక్స్ ఆఫీస్ రిపోర్ట్: తగ్గిన కలెక్షన్లు

1.తగ్గిన "హ్యాపీడేస్" హవాశేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మక చిత్రం "హ్యాపీడేస్" హవా కొంత తగ్గింది. అయినా ఇప్పటికీ ఈ చిత్రం మొదటి స్థానంలోనే కొనసాగుతోంది.ఎ సెంటర్లలో కలెక్షన్లు తగ్గగా, బి సెంటేలలో బాగా క్షీణించాయి.అయినా ఇప్పటికీ ఈ చిత్రం ఆరోగ్యకర స్థాయిలోనే కొనసాగుతోంది.
2.సాధారణ కలెక్షన్లతో "నవవసంతం"
ఈ వారం తరున్ చిత్రం "నవవసంతం" కలెక్షన్లు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి.అయితే "హ్యాపీడేస్" తరువాత ఎక్కువశాతం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
3.ఫన్నీ కామెడీతో మూడవ స్థానంలో నిలుచున్న"సీమ శాస్త్రి"
"సీమ శాస్త్రి" చిత్రం అల్లరి నరేశ్ కు బాగా ఊరట నిచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో నరేశ్ నటించిన ఏ చిత్రమూ కనీసం సాధారణ స్థాయిలో కూడా ఆడకపోవడంతో అతను బాగా నీరసించాడు. అయితే ఈ చిత్రంలోని రాయలసీమ నేపద్యంలో కామెడీని ప్రేక్షకులు బాగా ఆదరించడతో ఈ చిత్ర వసూళ్ళు ఆశించిన స్థాయిలోనే కొనసాగుతున్నాయి.బి,సి సెంటర్లలో ఈ చిత్రం కలెక్షన్లు బాగున్నాయి.
4.బాగా నిరాశ పరుస్తున్న"అతిధి"
మహేశ్ బాబు ప్రతిష్టాత్మకంగా భావించిన "అతిధి" చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది.ఈ చిత్రం కలెక్షన్లు బాగా తగ్గుముఖం పట్టాయి.కొన్ని సెంటర్లలో ముప్పై శాతం పబ్లిక్ కూడా లేకపోవడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
5.బి,సి సెంటర్లే "తులసి" జీవాధారం

వెంకటేశ్, నయనతారల "తులసి" కలెక్షన్లు మినిమం స్థాయిలో కొనసాగుతున్నాయి. ఎ సెంటర్లలో బాగ తగ్గిన కలెక్షన్లు బి, సి సెంటర్లలో నిలకడగా ఉండటం వల్ల ఈ చిత్రం ఫరవాలేదనే స్థాయిలో కొనసాగుతోంది.

శ్రీవెంకట్ బులెమోని

కన్నీళ్ళు,కాకరకాయలు లేని మెగా సీరియల్"యువ":అక్కినేని నాగార్జున


"హ్యాపీడేస్" చిత్ర ప్రభావంతో యువతే ప్రధానంశంగా అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ సినీ స్టూడియోస్ బ్యానరుపై నిర్మిస్తున్న మెగా సీరియల్ "యువ". సీరియల్స్ అనగానే రెగ్యులర్గా ఉండే ఏడుపులు, పెడబొబ్బలు, సెంటిమెంట్, కన్నీళ్ళు, కాకరకాయలు మాసీరియల్ లో ఉండవని అక్కినేని నాగార్జున ప్రకటించారు.రానున్న డిసెంబర్ 1నుంచి మాటీవీలో ప్రతి శనివారం,ఆదివారం సాయంత్రం 8.30నిమీహాలకు ప్రసారం చేయనున్న ఈ సీరియల్ మొత్తం "యువ" రక్తంతో కూడుకున్నదని, వారాంతంలో సరదాగా కాలక్షేపం చేయించడమే తమ సీరియల్ లష్యమని నాగార్జున ప్రకటించారు.

‘We want to become a giant theatre chain globally’ :PSTL MD P.S.Saminathan

"We believe in taking risk. This is something we have communicated to all our stakeholders. We are not shy about it. We do leverage really high"
Mr P. S. Saminathan, Managing Director,
Pyramid Saimira Theatres Limited.
Pyramid Saimira Theatres Ltd (PSTL), which went public in late 2006, has almost overnight become a company that straddles multiple segments of the film world, from production to exhibition. It has done so by being unconventional from the sta rt, be it leasing old single-screen theatres to ramp up its screen presence or acquiring theatre chains overseas even as all other players remain focussed on domestic markets.
In an interview with Business Line, Mr P. S. Saminathan, Managing Director, PSTL, is unabashedly confident of the company’s prospects, although sceptics may still consider some of its targets ambitious, considering that PSTL is still in its early growth phase.
Excerpts from the interview:
Pyramid Saimira’s IPO in December 2006 raised funds for expansion and digitalisation of theatres across India. Now the company appears to have expanded far beyond film exhibition. What is your strategy?
Digitalisation was part of the agenda to agglomerate the theatre chain. Now, we have climbed up the value chain. We have become the largest exhibitor in India and we are possibly the third largest exhibitor in the world. We have almost eliminated the distribution segment and have become an exhibitor-cum-distributor. We have climbed up the value chain further by entering film production. Secondly, we are also expanding laterally. We operate out of the US, Malaysia and Singapore and are expanding into other countries as well. There is a geographical as well as a value chain spread.
How is the company structured? Do all your businesses come under the PSTL fold?
PSTL is engaged in film exhibition and is the holding company of Pyramid Saimira Production (PSPL) and Pyramid Saimira Entertainment (PSEL). PSPL produces films and TV content. Singapore-based PSEL is a content agglomeration unit. The model is akin to Eros International. Eros buys films and distributes it abroad. PSEL not only buys films and distributes them abroad but also buys Hollywood films and distributes them in the Asia-Pacific region. PSEL is a 100 per cent subsidiary of PSTL. PSPL is majority-owned by PSTL and the balance is held by some individuals and venture capitalists.
Your move into production, distribution and other areas have taken place at a tremendously fast pace. What resources do you have to execute these projects?
Fortunately, we have been profitable from the beginning. We entered at a time when the industry was on an upswing. Second, we raised Rs 400 crore on our convertible bond issue. Third, each of our units is raising funds, both debt and equity, independently and no longer rely on the parent companyPSTL. Our Singapore-based unit PSEL has raised capital and debt and our production unit Pyramid Saimira Production is going public.
Now we have multiple entities. In Malaysia, we have Pyramid Saimira Malaysia. There we have a partner and we have raised some debt. We have an US-based company called Pyramid Saimira America. That will raise funds in the US for its expansion.
You straddle across production, distribution and exhibition and have set big targets across all three streams. Are you not spreading yourself too thin?
This company believes in taking risk. This is something we have communicated to all our stakeholders. We are not shy about it. We do leverage really high. In my view, the critical difference between this group and others is the speed with which we execute our projects.
If you look at any company that has grown quickly in the last ten years, it is because of the speed of execution. It is not because they were structurally sound. Most of the companies be it Google, Jump TV, Reliance, Mittal group….each of their moves were independently not justifiable. They had a high-risk element. L. N. Mittal took over sick companies and made them profitable.
Reliance’s execution speed is flawless. We also believe in that speed. We need to ramp up very fast. That is the core focus.
We have reached a stage where we have become big. We are actually doubling in size every three months.
Today we have more than 500,000 seats. We are spread across five countries. We have 703 screens. We produced close to 38 films this year and we think only Paramount Studios and Universal Studios would have beaten this number. We have distributed over 90-100 films. We have started TV serial production.
We will beat Balaji Telefilms in the next one or two months in terms of hours of programming. We have targeted eight channels. Our focus is to go to niche areas and control everything. We will also enter Hindi genre in the satellite television market. To an extent, we are not communicating this pace of growth. But every film in India has to pass through our hands, either at the production stage or at the distribution stage. We are present everywhere, so, without us, no film can be released at the exhibition stage.
How are you backed in terms of management bandwidth?
PSTL is one company that believes not just in taking business risks but in taking risks on people as well. We have a concept called network management in Tamil Nadu. We have removed the top management in TN. The divisional management is given the powers of the top management. And the powers are quite extensive.
The Tamil Nadu division alone, on a year-on-year basis, will have a Rs 600 crore turnover. It spends Rs 400-500 crore. Everyday, it spends Rs 1.5-2 crore. Everyday, it adds a theatre. The growth necessitates some kind of innovation in management practices also.
What is your strategy of going international? Are not those markets already saturated with multiplexes?
Yes, but there is no focus on the Asian population. We have two goals. The first is to be a giant in Asia-Pacific. Here we do not focus on Indian films alone but on the respective region’s appetite. For instance, in Malaysia, we do not focus on Indian films but on Malay, Chinese, English, and so on. We want to become a giant theatre chain here, so that we can agglomerate Hollywood content here.
The second is to go abroad and focus on Indian films, and target Asian audiences in the western territory. There is no company that has, so far, focussed on the ground level. They have focussed on the middle level, that is, distribution. No one has built the required infrastructure.We believe in ground level strength, and not on in trading alone. So we are building infrastructure so that we have a sustainable base.
What is the progress on the digitalisation front?
We have started digitalising. We have digitalised about 200-250 theatres. As a percentage of overall screens it is still low. We were not focussed on cost cutting. We are using digitalisation as an expansive mechanism. Digitalisation to me is like banks computerising their core banking operations. It is a technology solution that enables you to manage better. By 2009-10 most of the screens will be digitalised. Because by then we won’t be able to grow further.
I cannot expand more than 1000-1200 screens in South India. The focus will then shift to quality, digitalisation, improving network, and so on.
How does your margin profile differ from other multiplex players? Most of the names are focussed on the premium end.
Our ticket admission rates are lower and we have not focussed on improving infrastructure and raising the admission rate. Those improvements will happen only in 2009. We will still want to have low-margin high value on the box office. But that does not mean we will have low margins in foods and beverages. F&B is a very high margin business.
It gives you 100-250 per cent margin even without fleecing the public. You go to a theatre expecting coffee to be expensive, and popcorn that is available for Rs 5 outside to be Rs 10 inside. Your price expectations are higher. So if we sell it for Rs 7.50, it will be seen as cheap.
We want people to see our F&B as an independent business. We want more footfalls. Our operating margins will always be less than 20 per cent for our theatre business.
What would the typical occupancy rates be?
In the first quarter it was about 44 per cent, and in second quarter, around 34 per cent.
Is it because it has been a good year for South Indian films?
No, not really. Honestly, whether a film is good or bad does not make a difference to us. This Diwali, every Pyramid theatre had a new film. Nearby theatres did not. That is because we distribute all films. We have effectively denied content to competition.
Interviewed by Shanthi Venkataraman,Business Line.

Monday, November 19, 2007

పవర్ ఫుల్ & క్రేజీ "రాక్" గర్ల్ ఫ్రెండ్ అవ్రిల్ లావిగ్నె

హాలీవుడ్ లోని ఆధునిక మ్యూజిక్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రేజీ గాయని, సంగీత దర్శకురాలు, నటి ఆవ్రిల్ లావిగ్నె ను ఎరుగని ఆధునిక తరం కుర్రకారు దాదాపు ఉండరని చెప్పవచ్చు.
కెనడియన్ బిజినెస్ వీక్లీ అధికారిక ఓటింగ్ ప్రకారం హాలీవుడ్ లోని ఏడవ అత్యధిక శక్తివంతురాలయిన కెనడియన్ గా కీర్తిని అందుకుంటున్న ఆవ్రిల్ లావిగ్నె "బెస్ట్ బ్యాండ్ ఇన్ ద వరల్డ్" గా, మరియు ప్రపంచంలోని శక్తివంతులైన సంగీత కళాకారులలో తొమ్మిదవ వ్యక్తిగా రాణిస్తోంది.
2002లో "లెట్ గో" అంటూ తన రాక్, పాప్ సంగీత ప్రపంచాన్ని సృస్టించుకోవడం ఆరంభించిన "అండర్ మై స్కిన్(2004)","ది బెస్ట్ డ్యాం థింగ్(2007)"తో సంగీత ప్రపంచంలో ఆధునిక తారగా అవతరించింది. అమె సంగీత దర్శకత్వం వహిస్తూ, నటించిన పాప్ అండ్ రాక్ సాంగ్ లలో"కంప్లీటెడ్", "గర్ల్ ఫ్రెండ్" "ఐ యాం విత్ యు","హ్యప్పీ ఎండింగ్" పాటలు యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ముప్పై మిలియన్ల ఆల్బం లు అమ్ముకున్న కొత్త తారగా ఆవ్రిల్ లావిగ్నె రికార్డు సృస్టిస్తున్నారు. హాలీవుడ్ సినీ రంగంలోకి అడుగుపెట్టిన దాదాపు అందరు పెద్ద నటులు, నిర్మాతలు, దర్శకులు, నిర్మాణ సంస్థలతో పనిచేసి ప్రతిభావంతుతాలైన సంగీత దర్శకురాలిగా, గాయనిగా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
రిచర్డ్ గేరె నటించిన "ది ఫ్లిక్" చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి నాయైకగా కూడా పేరుతెచ్చుకున్న ఆవ్రిల్ లావిగ్నె నటిస్తూ, సంగీతాన్ని అందించిన "గర్ల్ ఫ్రెండ్" పాటను ఇక్కడ ఇస్తున్నాము. తిలకించండి.
శ్రీవెంకట్ బులెమోని
ఆవ్రిల్ లావిగ్నె క్రేజీ ఆల్బం "గర్ల్ ఫ్రెండ్" వీడియో
video

"సీమ శాస్త్రి" వెరీ గుడ్డు : ఆడియెన్స్ టాక్

రాయల సీమ ఫ్యాక్షనిజం నేపద్యంలో తాజాగా విడుదలైన "సీమశాస్త్రి" సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకర్శిస్తోంది. ఫ్యాక్షన్ నేపధ్యాన్ని, కితకితలు పెట్టడానికి సరైన పద్దతిలోనే దర్శకుడు వినియోగించుకున్నాడనీ, టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా పూర్తిగా కామెడీ ట్రాక్ మీదే సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని స్థానిక పత్రికల కథనం. సుబ్రమణ్య శాస్త్రి (అల్లరి నరేష్), సురేఖా రెడ్డి(ఫర్జానా) ప్రేమలో పడతాడు. ప్రేమలో పడ్డప్పుడు సురేఖా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలియదు. ప్రేమ ముదిరిన తరువాత సుబ్రమణ్య శాస్త్రికి తెలుస్తుంది సురేఖా రెడ్డి ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని. శాస్త్రి గారు కూడా ఫ్యాక్షన్ తరహాలోనే వెళ్లి సురేఖా రెడ్డి తల్లి దండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఏమైందన్నది సీమశాస్త్రిని అడిగితెలుసుకోండి కానీ ఆయన చేసే ప్రయత్నాలు మాత్రం ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి.హీరో హీరోయిన్ లిద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అల్లరిగా నటించే నరేష్ బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో చక్కగా నటించాడు. హీరోయిన్ అందంగా కనిపించింది. పాటలు బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే కామెడీ చిత్రంగా చెప్పవచ్చు. కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు వెంటనే సినిమాకు వెళ్లవచ్చు.

నటీనటులు: అల్లరి నరేష్, ఫర్జానా, జయప్రకాష్ రెడ్డి, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ఎల్ బి శ్రీరామ్, ముమైత్ ఖాన్, కోవై సరళ, రఘుబాబు తదితరులు.

టెక్నీషియన్లు:మాటలు-మరుధూరి రాజా,సంగీతం-వందేమాతరం శ్రీనివాస్,సినిమాటోగ్రాఫర్-అరుణ్,ఎడిటింగ్-రామ్ గోపాల్ రెడ్డి,నిర్మాత-చావలి రామాంజనేయులు,స్క్రీన్ ప్లే, దర్శకత్వం-జి నాగేశ్వర్ రెడ్డి.

అరుదైన ప్రపంచపు తొలి మాటల చిత్రం "జాజ్ సింగర్" (ఎక్స్ క్లూజివ్ ఫోటోస్ & వీడియో)

అతి అరుదైన ఈ వీడియో ప్రపంచపు తొలి టాకీ(మాటల) చిత్రం "జాజ్ సింగర్" లొనిది. వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రంలో 72 పాటలు ఉండటం గమనార్హం. 1927లో నిర్మించిన ఈ చిత్రంలో ఆల్ జాన్సన్, పాల్ డ్రెస్సర్స్ ముఖ్య తారాగణంగా నటించారు. మొట్ట మొదటి సారి చిత్రంలో నెగిటివ్ పై సౌండ్ ట్రాక్ ముద్రించి విడుదలచేయన్నున్న ఈ చిత్రంలో ముందుగా ఎలాంటి మాటలను ఉంచకూడదని అనుకున్నారు. కేవలం కొన్ని పెద్ద పాటలతోబాటు చిన్న చరణాలు ఉన్న సుమారు అరవై ఐదు పాటలను, కొంత సంగీతాన్ని మాత్రం ఈ చిత్రంలో ఉంచాలనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో ఈ చిత్రంలోని ముఖ్య నటుడైన ఆల్ జాల్సన్ తన పాట పాడాక, అకస్మాత్తుగా "హే వెయిట్, వెయిటె మినిట్, యూ హెవెంట్ హియర్డ్ నథింగ్ యట్!...వెయిటె మినిట్, ఐ టెల్ యూ.. యూ హెవెంట్ హియర్డ్ డర్టీ హ్యాండ్స్,..డర్టీ ఫేస్" అంటూ అర్థం, పర్థం లేకుండా మాట్లాడాడు. ఆల్ జాల్సన్ అలా అర్థం పర్థ లేకుండా మాట్లాడటమేమిటాని చిత్ర దర్శకుడు అలాన్ క్రాస్ లాండ్ చిర్రుబుర్రు లాడుటుంటే, చిత్ర సహ నిర్మాత మాత్రం "థట్ వర్డ్స్ ఆర్ ఇంప్రెస్ పబ్లిక్" అంటూ పట్టుబట్టి మరీ వాటిని చిత్రంలో అలాగే ఉంచి, చిత్రాన్ని విడుదలచేయించారు. చిత్రం విడుదల అనంతరం అందులోని పాటలు, మాటలు ప్రేక్షకూలను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.
శ్రీవెంకట్ బులెమోని
video

"My First Break" PSTL Cairman Natarajan

(To see full version please click on image)

నాగార్జున "లవ్ స్టోరీ...1,2,3..." ఆగిపోయింది


అక్కినేని నాగార్జున లవ్ స్టోరీ ఆగిపోయిందనే రూమర్లు తెలుగు సినీ పరిశ్రమలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. తెలుగు సినీ మన్మధునిగా పేర్గాంచిన అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజుల కాంబినేషన్లో "లవ్ స్టోరీ...1,2,3,..."చిత్రం రూపొందాల్సి ఉంది. దానికి సంబంధించిన కథాచర్చలు కూడా పూర్తయ్యాయి. వెంటనే ఈ చిత్రానికి "లవ్ స్టోరీ..1,2,3..."గా పేరుపెట్టడంతోబాటు, టైటిల్ ను ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. దాంతో నాగార్జున నటించే తదుపరి చిత్రం ఖచ్చితంగా "లవ్ స్టోరీ...1,2,3,..." అయి వుంటుందని అందరూ చర్చించుకున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రం అటకెక్కిందని టాలీవుడ్ లో ఒకటే దుమారం లేచింది. దానికి తగ్గట్లే చిత్ర దర్శకుడు గుణ్ణం గంగరాజు తన తదుపరి చిత్రం, తదుపరి సీరియల్ లపై దృష్టి సారించినట్లుగా తెలిసింది.అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకున్నా వీరిద్దరి మధ్యలో చిత్రం ఇప్పట్లో లేనట్లేనని టాలీవుడ్ అభిప్రాయం. సో నాగార్జున "లవ్ స్టోరీ...1,2,3,..." అటకెక్కినట్లేనా...???

యానిమేషన్ చిత్రంలో "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" గా నటిస్తున్న చిరంజీవి


తెలుగువారి మెగాస్టార్ అతి త్వరలో పరపంచవ్యాప్తంగా చిన్నారులను అలరించనున్నాడు. చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ రూపంలో చిన్నారులను అలరించడానికి చిరంజీవి సమాయత్తమవుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను, పెద్దలను ఎంతగానఓ అలరించిన "బాగ్దాద్ గజదొంగ" గా చిరంజీవి నటిస్తున్నారు. గతంలొ ఇదే పేరుతో చిరంజీవి నటిస్తూ ఆగిపోయిన ఇంగ్లీషు చిత్రం తనరూపు మార్చుకుని యానిమేషన్ ప్రక్రియలోకి పరాకాయ ప్రవేశం చేయనుంది. దాంతో మొత్తానికే ఆగిపోయిందనుకున్న "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" చివరికి తెరకెక్కడానికి సమాయత్తమవడమే, కాకుండా చిన్నారులకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ ప్రక్రియలో దర్శనమివ్వనుండటం నిజంగా తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా చిరంజీవిని అభిమానించే అతని అఖిలాంధ్ర ప్రేక్షకులకు సంతోషం కలిగించే విషయమమే మరి. అమెరికాకు చెందిన చలపతి అనే భారతీయ పారిష్రామిక వేత్త రూ.8.5కోట్ల రూపాయల పెద్దమొత్తంలో నిర్మించనున్న ఈ యానిమేషన్ చిత్రం అఖిల భారతీయ భాషలతోబాటు, ఇంగ్లీషు, ఫ్రెంచి, కొరియన్, మలై భాషలలో రూపొందనుంది. గతంలో ఆగిపోయిన "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" కు సంబంధించిన ఇంతవరకు షూటింగ్ జరిగిన పార్ట్ లోని క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన కొత్త యానిమేషన్ చిరంజీవి క్యారెక్టర్ ఆధారంగా ఇప్పుడు రూపొందబోయే కొత్త చిత్రం ఉంటుంది. మిగతా పార్ట్ కోసం చిరంజీవి అమెరికాలో ప్రయేకంగా బ్లూ డ్రెస్స్ ధరించి షూటింగ్ లో పాల్గొంటారు. కాగా ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి కృషిచేతున్నట్లు తెలిసింది. వచ్చే సంవత్సరం దసరా పర్వదినోత్సవం నాటికల్లా ఈ చిత్రాన్ని విడుదలచేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలిసింది.
శ్రీవెంకట్ బులెమోని

Saturday, November 17, 2007

150 కోట్ల రూపాయలతో మొదలైన సంక్రాంతి సమరం

తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సమరం మొదలైంది. సుమారు నూటయాభై కోట్ల రూపాయలను ఈ సంక్రాంతి పందెంలో పట్టడానికి తెలుగు సినీ పరిశ్రమ తయారయ్యింది.పెద్ద చిత్రాల దర్శక,నిర్మాతలు తమ చిత్రాలపై ఉన్న అపార నమ్మకంతో ఈ సంక్రాంతి పందేనికి సై అంటున్నారు. ఈ సంక్రాంతి పందెంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నాగార్జున, విష్ణు, అల్లు అర్జున్, ఎం ఎస్ రాజులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తమవుతున్నారు. దాంతో సంక్రాంతి పర్వదినోత్సవం సర్వాంగ సుందరంగా ముస్తాబైన తెలుగు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుని ముందు మోకరిళ్ళనుంది. మరి చివరికి ఈ సంక్రాంతి సమరంలో సగటు ప్రేక్షకుడు ఎవరిని అందలంపై కూర్చో బెడతాడో, మరెవరిని పాతాళానికి తొక్కేస్తాడో వేచిచూస్తేగానీ తెలీదు. సో సంక్రాంతి సమరంలో ఉన్న చిత్రాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం.
1. సెంటిమెంటుపై నమ్మకంతో ఉన్న "ఒక్క మగాడు"
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న బొమ్మరిల్లు ప్రొడక్షన్స్ వారి "ఒక్క మగాడు" చిత్రం పూర్తిగా సెంటిమెంటు ఆధారంగా సంక్రాంతికి విడుదలవుతోంది. చిత్రంలో తమండ్రీ, కొడుకుల పాత్రలు పోశిస్తున్న బాలకృష్ణ కథా పరంగా సెంటిమెంటు బాగా పండిందని భావిస్తున్నాడు. మరోవైపు సంక్రాతి సమరంలో గత "సమర సిం హా రెడ్డి", "నరసిం హనాయుడు"చిత్రాలలాగా ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడు. మరోవైపు చిత్ర దర్శక,నిర్మాత వై వి యస్ చౌదరి కూడా అదే నమ్మకంతో ముందుకుకదులుతున్నాడు.
2. కుర్రకారుపై నమ్మకంతో పవన్ కళ్యాణ్ "జల్సా"యువతరం పై ఉన్న నమ్మకంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన "జల్సా" చిత్రాన్ని సంక్రాంతికి విడుదలచేయడానికి ఒప్పుకున్నాడని టాలీవుడ్ కథనం. హాలీవుడ్ "లవ్ డాక్టర్" మూల కథగా రూపొముతున్న ఈ చిత్రంలో ఇలియానా తన అందాలను ఆరబోయబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం గత "ఖుషీ" రోజులను తిరిగితీసుకువస్తుందని పవన్ నమ్ముతున్నారు.
3.యువతరం ప్రేమ, భావోద్వేగాల కలయికలో వస్తున్న అల్లు అర్జున్
బొమ్మరిల్లు భాస్కర్, దిల్ రాజుల కలయికలో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం ఈ సంక్రాంతికి పోటీలోకి దిగుతోంది. దిల్ రజు బ్యానరుపై గతంలో అల్లు అర్జున్ చేసిన "ఆర్య", భాస్కర్ చేసిన "బొమ్మరిల్లు" చిత్రాలౌ అఖండ విజయాన్ని సాధించడంతో, వీరి కొత్త చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాలమధ్యన బరిలోకి దిగుతోంది.
4. దేవుడే రక్షిస్తాడన్న నమ్మకంతో వస్తున్న "కృష్ణార్జునులు"
అక్కినేని నాగార్జున, మంచు విష్ణు వర్ధన్ దేవుడూ, భక్తుడుగా నటిస్తున్న అధునిక చిత్రం సంక్రాంతి సమరంలో జవరి 14వ తేదీన విడుదలవుతోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రం "బ్రూస్ ఆల్మైటీ" ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రలో నాగార్జునది మాడ్రన్ దేవుని పాత్ర కాగా, విష్ణుది కామెడీ తరహాలో కొనసాగే పాత్ర. అన్నట్లు ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా మరో దేవునిగా ప్రత్యక్షం కానున్నారు.
5.ఎం ఎస్ రాజు ఆశలన్నీ "వాన"పైనే.

ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న "వాన" చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకమొతె ఉన్నారు. కన్నడంలో అఖండ విజయం సాధించిన "ముంగారు మాలై"(తొలకరి జల్లులు) చిత్రాన్ని ఆయన రీమేక్ చేస్తున్నారు. వినయ్ చోప్ర, మీరా చొప్రా లు ఈ చిత్రంలో నాయికా నాయకులుగా నటిస్తున్నారు.

శ్రీవెంకట్ బులెమోని

ఎక్స్ క్లూజివ్ వీకెండ్ గ్యాలరీ:షరాన్ స్టోన్










ప్రఖ్యాత "సిసిల్ డిమిల్లి" అవార్డు అందుకోనున్న స్టీవెన్ స్పీల్ బర్గ్







హాలీవుడ్ దర్శకరత్నం స్పీల్ బర్గ్ ప్రఖ్యాత "సిసిల్ డిమిల్లి" అవార్డు అందుకోనున్నారు. చలన చిత్ర పరిశ్రమకు తమ జీవితాన్ని అంకితం చేసిన అత్యున్నత సాంకేతిక నిపుణులకు మాత్రమే ఇచ్చే ఈ అవార్డును స్పీల్ బర్గ్ ఇప్పుడు అందుకోనున్నారు. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ల ప్రధానోత్సవం సందర్భంగా ఇస్తారు.60 సంవత్సరల వయస్సుగల స్పీల్ బర్గ్ గతంలో "ఇ.టి","జురాసిక్ పార్క్" తదితర పలు ప్రతిష్టాత్మక చిత్రాలను హాలీవుడ్ కు అందించారు. ఒక విధంగా బాక్స్ ఆఫీస్ చరిత్రను తన కలెక్షన్లతో తిరగరాసిన చరిత్ర స్పీల్ బర్గ్ ది. ప్రస్తుతం 65వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ప్రఖ్యాత "సిసిల్ డిమిల్లి" అవార్డును స్పీల్ బర్గ్ కు వచ్చే జనవరి13,2008న అందిస్తారు.గతంలో స్పీల్ బర్గ్ ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను, మూడు ఆస్కార్ అవార్డులను అందుకోవడమే కాకుండా, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నుంచి ప్రతిష్టాత్మక "లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు"ను సహితం అందుకున్నారు.

సంజయ్ దత్‌ను జైల్లో కలుసుకుని ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్న పాకిస్తాన్ క్రికెటర్


ముంబయి పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను పాకిస్థాన్ స్పీడ్‌స్టార్ షోయబ్ అక్తర్ కలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ కోరికను షోయబ్ అక్తర్ తన ప్రతినిధుల ద్వారా సంజయ్ సోదరి ప్రియాదత్ దృష్టికి తీసుకెళ్లాడు. ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారించబడిన సంజయ్ దత్ ప్రస్తుతం పూణేలోని యారవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.సంజయ్‌ను జైళ్లోనే కలుసుకునేందుకు అక్తర్ ప్రయత్నిస్తున్నట్లు పాక్ మీడియా పేర్కొంది. సంజయ్ దత్‌కు షోబయ్ అక్తర్ వీరాభిమాని. సంజయ్‌కు తాను వీరాభిమానినని, అతడు జైలు నుంచి విడుదల కావాలని ఎన్ని కుటుంబాలు కోరుకుంటున్నాయో తనకు తెలుసని అక్తర్ అన్నాడు.ఈ రావల్పిండీ ఎక్స్‌ప్రెస్ సంజయ్‌కు బహూకరించేందుకు ఓ ప్రత్యేక బహుమతిని కూడా కొనుగోలు చేశాడు. అయితే అదేమి బహుమతో వెల్లడించలేదు. సంజయ్‌ను జైళ్లో కలుసుకునే అవకాశం వస్తే అతనికి ఇచ్చేందుకు తానొక ప్రత్యేక బహుమతిని కూడా సిద్ధం చేసుకున్నానని మాత్రం అక్తర్ చెప్పాడు.

ఎం ఎస్ రాజు ప్రతిష్టాత్మక చిత్రం "వాన"

ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకునిగా మారి నిర్మిస్తున్న "వాన" చిత్రంపై సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడంలో సూపర్ హిట్ అయిన "ముంగారు మాలై" చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మాత్రం సంక్రాంతి పర్వదినోత్సవం సందర్బంగా జనవరి రెండవవారంలో విడుదలచేయనున్నారు.

"సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమన్-2007" గా ఎన్నికైన బిపాషా బసు

బాలీవుడ్ క్రేజీ కథానాయకి బిపాషా బసు "సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమన్-2007"గా ఎన్నికైంది. ప్రపంచంలోకెల్లా అత్యంత సుందరాంగియైన ఆసియన్ మహిళ అంటూ ఓటర్లు బిపాషాను కీర్తిస్తున్నారు. లండన్ లోని ప్రముఖ పత్రిక "ఈస్టర్న్ ఐ" నిర్వహించిన సర్వేలో 2007వ సంవత్సరానికి గాను బిపాషా బసు అత్యంత సుందరమైన, సెక్సీయెస్ట్ ఉమన్ గా ఎన్నికైంది. కాగా రెండవ స్థానాన్ని బాలీవుడ్ కే చెందిన ప్రముఖ నటీమణి మాధురీ దీక్షిత్ ఎన్నికైంది. గతేడాది ప్రధమ స్థానాన్ని సాధించిన ప్రియాంక చోప్రాకు ఈ సంవత్సరం మూడవ స్థానం దక్కింది. వీరి తర్వాత మొదటి పది స్థానాల్లో వరుసగా ఐశ్వర్యా రాయ్,లైలా రౌస్,శిల్పా శెట్టి,కత్రినా కైఫ్,కరీనా కపూర్,లారా దత్తా,ఇమాన్ అలీలు ఎన్నికయ్యారు.

మమతా మోహన్ దాస్ బర్త్-డే ఫంక్షన్లో "స్టార్" సందడి (ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీ)







Friday, November 16, 2007

"మిస్ గోల్డెన్ గ్లోబ్-2008"గా ఎన్నికైన బ్రూస్ విల్స్ కూతురు




"డై హార్డ్" ఫేం హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్స్ కూతురు రూమర్ విల్స్ "మిస్ గోల్డెన్ గ్లోబ్-2008" గా ఎన్నికైంది. అమెరికాలోని బేవర్లీ హోటల్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. 19సంవత్సరాల రూమర్ విల్స్ మొదటిసారి ఈ పోటీలలో పాల్గొని "మిస్ గోల్డెన్ గ్లోబ్-2008"గా ఎన్నికైనందుకు ఆమె తండ్రి బ్రూస్ విల్స్ సంతోశాన్ని వ్యక్తంచేశారు.

"పోర్టెరి డి బ్యాంకో" ఫ్రెంచ్ చిత్రంలో చార్లీ చాప్లిన్ బ్యాంకు కామెడీ(Part-2)

video

అమెరికాలో "జై హనుమాన్ రిటర్న్స్" కు డబ్బింగ్ చెబుతున్న చిరంజీవి


"జై హనుమాన్ రిటర్న్స్" యానిమేషన్ చిత్రానికి మెగా స్టార్ చిరంజీవి డబ్బింగ్ చెబుతున్నారు.గతంలో వచ్చిన "జై హనుమాన్" చిత్రం తొలి భాగానికి కూడా చిరంజీవి డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా మొదటి భాగానికి కొనసాగింపుగా వస్తున్న ఈ "జై హనుమాన్ రిటర్న్స్" రెండవ భాగానికి కూడా చిరంజీవి డబ్బింగ్ చెబుతున్నట్లు అమెరికానుంచి వార్తలు వస్తున్నాయి. 2-డి యానిమేషన్ ప్రక్రియలో రూపొందించిన ఈ "జై హనుమాన్ రిటర్న్స్" కథ రామాయణం నుంచి తీసుకోకుండా, ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా కొత్త కథతో రూపొందించినట్లు తెలిసింది. అంటే మాడ్రన్ కథతో రూపొందించిన కొత్త కథ అన్నమాట. తెలిసిన వివరాల ప్రకారం ఈ కొత్త హనుమాన్ భూలోకానికి శతృవులైన అంతరిక్ష గ్రహ వాసులకు బుద్దిచెప్పనున్నట్లు తెలిసింది. అంటే ఇక ముందు హనుమాన్ రామాయణానికి మాత్రమే సంబంధించిన పాత్ర మాత్రమే కాకుండా, కాల్పనిక పాత్రగా కూడా రూపొందుతుందేమోనని పలువురి అనుమానం.అన్నట్లు ఈ "జై హనుమాన్ రిటర్న్స్" చిత్రం ఈ డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇంకో విషయమేమిటంటే ఈ చిత్రం తెలుగుతోబాటు ఇంగ్లీషు, తమిళం, హిందీ, భోజ్పురి భాషలలో విడుదలకానుంది.

విష్ణు,నాగార్జున ల చిత్రానికి పేరు పెట్టండి


అక్కినేని నాగార్జున,మంచు విష్ణు వర్ధన్ నటిస్తున్న కొత్త చిత్రానికి పేరు పెట్టే అవకాశం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రముఖ ఇంగ్లీషు సినిమా "బ్రూస్ ఆల్మైటీ" ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున మాడ్రన్ కృష్ణునిగా కనిపించనున్న విశయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఇప్పుడు పేరు పెట్టే అవకాశాన్ని చిత్ర నిర్మాత మోహన్ బాబు ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇప్పటికే ఈ చిత్రానికి "కృష్ణార్జునులు", "కృష్ణార్జున్","మిత్రమా" అనే మూడు పేర్లను అనుకోవడం జరిగింది. వీటిలోంచి ఏదైనా పేరును ప్రేక్షకులు ఎన్నుకోవచ్చు. లేదా కొత్త పేరునూ సూచించవచ్చు. ఈ చిత్రానికి మంచి పేరును సూచించిన వారికి చిత్ర ఆడియో ఫంక్షన్లో భారీ మొత్తంలో నగదు బహుమతిని అందించనున్నట్లు నిర్మాత మోహన్ బాబు పత్రికలవారికి తెలియజేశారు. సో, మీరూ ఏదైనా మంచిపేరు పెట్టి పెద్ద మొత్తంలో బహుమతి మొత్తాన్ని తీసుకోవచ్చు. ట్రైచేయండి మరి.

చిరంజీవి వ్యాఖాతగా "జై హనుమాన్ రిటర్న్స్" ఎక్స్ క్లూజివ్ ఫొటో గ్యాలరీ





Thursday, November 15, 2007

"పోర్టెరి డి బ్యాంకో" ఫ్రెంచ్ చిత్రంలో చార్లీ చాప్లిన్ బ్యాంకు కామెడీ(Part-1)

video

చిరంజీవి "మంచమేసి దుప్పటేసి" రీమిక్స్ పాట "సీమశాస్త్రి"లో

చిరంజీవి నటించిన "కొండవీటి రాజా" చిత్రంలోని "మంచమేసి దుప్పటేసి"పాట మరోమారు ప్రేక్షకులను అలరించనుంది. "కొండవీటి రాజా" చిత్రంలో చిరంజీవి, విజయశాంతి లపై చిత్రీకరించిన ఈ పాట అప్పట్లో మంచి ఆదరణ చూరగొంది.ఈ పాటను నరేశ్ హీరోగా నటించిన "సీమ శాస్త్రి" చిత్రంలో రీమిక్స్ చేశారు.శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని చావలి రామాంజనేయులు నిర్మించగా, జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ విడుదలచేస్తోంది.

పౌరాణిక దేవునికీ, మాడ్రన్ దేవునికీ జరగనున్న బాక్స్ ఆఫీస్ యుద్దం


తెలుగు సినీ రంగంలో పౌరాణిక చిత్రాలకు లోటు లేదు. 1931లో నిర్మించిన తొలి తెలుగు చిత్రం "భక్త ప్రహ్లాద" మొదలుకొని కొన్ని వందల పౌరాణిక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే తెలుగు సినిమాలలో కొత్తగా మరో మాడ్రన్ దేవుడు అవతరించనున్నాడు. పి వాసు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్న "కృష్ణార్జునులు" చిత్రంలో విష్ణు కథానాయకునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే చిత్రంలో టాలీవుడ్ రోమాంటిక్ హీరో నాగార్జున పౌరాణిక పాత్ర ధరిస్తున్న విషయమూ తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రముఖ హాలీవుడ్ చిత్రం "బ్రూస్ ఆల్ మైటీ" ఆధారంగా రూపొందుతోంది. ఇందులో మాడ్రన్ దేవునిగా లా మోర్గన్ ఫ్రీమన్ నటించిన పాత్రను ఇప్పుడు నాగార్జున పోశిస్తున్నారు. అయితే ఈ దేవునికి మాడ్రన్ కృష్ణునిగా నామకరణం చేశారు. దాంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒకేసారి "రంగా పాండురంగా" చిత్రంలో బాలకృష్ణ కృష్ణునిగా నటిస్తుండగా, మరో వైపు నాగార్జున ఆధునిక కృష్ణునిగా నటిస్తున్నాడు. దాంతో తెలీకుండానే పౌరానిక కృష్ణునికీ,ఆధునిక కృష్ణునికీ బాక్స్ ఆఫెస్ పోరాటం మొదలైంది. కొంచెం అటూ, ఇటూగా 2008లో విడుదలవనున్న ఈ చిత్రాలలో ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తుందో వేచి చూస్తే గానీ తెలీదు.

బాలీవుడ్ క్రేజీ "క్రిష్" హృతిక్ రోషన్ స్పెషల్ గ్యాలరీ









Wednesday, November 14, 2007

పిరమిడ్ సాయిమిరా విడుదల చేయనున్న "హల్లా బోల్" చిత్రం పై ప్రెస్ టాక్ క్లిప్పింగ్స్

పిరమిడ్ సాయిమిరా ప్రొడక్షన్ లిమిటెడ్ ఆద్వర్యంలో అజయ్ దేవగన్ నటించిన ప్రతిష్టాత్మక "హల్లా బోల్" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించి ముమై ప్త్రికలు వెలువర్చిన అభిప్రాయాల క్లిప్పింగులను ఈ క్రింద ప్రచురిస్తున్నాము. గమనించండి.

































































బాటా దివాలీ హంగామా ఇన్ క్యాలిఫోర్నియా (జస్ట్ ఫోటోస్)







నిజమని భ్రమ కలిగించే "సావరియా" సెట్టింగ్స్ (ఫోటో ఫీచర్)








బాక్స్ ఆఫీస్ రిపోర్ట్: హ్యాప్పీయెస్ట్ "హ్యాపీడేస్"

1. యువతకు "హ్యాపీడేస్" జ్వరంతెలుగు యువతరానికి కొత్త జ్వరం పట్టుకుంది. దాని పేరు "హ్యాపీడేస్". దీనికి మందు "హ్యాపీడేస్" చిత్రాన్ని వారానికోసారి చొప్పున కనీసం రెండు మూడు నెలలపాటయినా చూడాలని, అదీ కూడా సమీప భవిష్యత్తులో "హ్యాపీడేస్" చిత్రం ఎక్కడ ప్రదర్శింపబడినా, తమ మితృలతో కలిసి చూస్తే ఈ జ్వరం అతి తొందరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సినీ పండిత డాక్టర్ల సూచన. అందుకని ఈ చిత్రాన్ని నంబర్ వన్ స్థానంలో కొనసాగించాలని వారి సూచన.
2. స్నేహం బాగానే ఉన్నట్లుందంటున్న "నవవసంతం"
"హ్యాపీడేస్" కొనసాగింపుగా "నవవసంతం" ను ప్రేక్షకులు స్వీకరిస్తే తప్పు లేదని టాలీవుడ్ సినీ పండితుల అభిప్రాయం. స్నేహం, ప్రేమ, కుటుంబ నేపద్యంలో వచ్చిన తరున్, ప్రియామణిల "నవవసంతం" ఈ వారం రెండవ స్థానాన్ని పొందింది.
3. బాగా వెనకబడిన "అతిధి"
మహేశ్ బాబు నటించిన అతిధి చిత్రం ఫెయిల్యూర్ దారి పట్టింది. కలెక్షన్ల పరంగా బాగా వెనకబడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. మహేశ్ బాబు మార్కు చిత్రంలో లోపించడం, పోకిరికి కొనసాగింపైన క్యారెక్టరైజేషన్ ల వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నిరుత్సాహ పరుస్తోందని సినీ విమర్షకుల కథనం.
4. ఇంకా వాడిన స్థితిలోనే ఉన్న "తులసి"

విక్టరీ వెంకటేశ్, నయనతారల చిత్రం "తులసి" కలెక్షన్ల వేటలో బాగా వెనకబడింది. శృతిమించిన హింసవల్లే ఈ చిత్రం వెనకబడిందని ట్రేడ్ రిపోర్ట్.

శ్రీవెంకట్ బులెమోని

వరల్డ్ గ్రేటెస్ట్ కమెడియన్ చార్లీ చాప్లిన్ ఫన్నీ బాక్సింగ్ (వీడియో)

video

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(14/11/2007)

(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
BEOWULF : Reting -PG-13
(for intense sequences of violence including disturbing images, some sexual material and nudity.)
LOVE IN THE TIME OF CHOLERA : Rating -R
(for sex content/nudity and brief language.)
MARGOT AT THE WEDDING : Rating -R
(for sexual content and language.)
MR. MAGORIUM'S WONDER EMPORIUM : Rating -G
(GENERAL AUDIENCES )
REDACTED :Raring -R
(for strong disturbing violent content including a rape, pervasive language and some sexual references/images.)
SOUTHLAND TALES : Rating-R
(for language, violence, sexual material and some drug use.)

RATINGS GUIDE

G : GENERAL AUDIENCES (All Ages Admitted)

PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)

PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)

R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)

NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని

Tuesday, November 13, 2007

హాలీవుడ్ హాటెస్ట్ భామ ఛరిస్మా కార్పెంటర్ ఇలా కామిక్ పాత్రలో ఒదిగిపోయింది (స్పెషల్ గ్యాలరీ)






జాన్ అబ్రహాం ప్రఖ్యాత "గోల్" చిత్రం ఎక్స్ క్లూజివ్ ట్రైలర్

video

పిరమిడ్ విడుదల చేయనున్న అజయ్ దేవగన్ ప్రతిష్టాత్మక చిత్రం "హల్లా బోల్" (గ్యాలరీ)





లాస్ ఏంజిల్స్ లో తెలుగు వారి "దీపావళి"

తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ క్యాలిఫొర్నియా ఆద్వర్యంలో లాస్ ఏంజిల్స్ లో జరిగిన "దీపావళ్" ఉత్సవాలు తెలుగువారి హృదయాలలో ఆనంద డోలికలను విహరింపజేశాయి. క్లాసికల్ నృత్యం మొదలుకొని సినీ నృత్యం, జానపదం, నాటకం, కామెడీ, ఫ్యాషన్ షో...ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగువారు పరవశులయ్యారని తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ క్యాలిఫోర్నియా అద్యక్షుడు అనిల్ అర్రబల్లి తెలియజేశారు.











"బాటా" ఆధ్వర్యంలో క్యాలిఫొర్నియాలో ఘనంగా జరిగిన "ఘంటసాల ఆరాధనోత్సవాలు"


అమెరికాలోని క్యాలిఫోనియాలో ఉన్న "బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా)" ఆద్వర్యంలో అమర గాయకుడు ఘంటసాల ఆరధనోత్సవాలు ఘనంగా జరిగాయి. గాయక శిరోమణి జి వి ప్రభాకర్, గాయక రత్న మణి శాస్త్రి, రాజు ఏడూరి, గాయత్రి అవ్వారి తదితర కళాకారులు బాటా ఆద్వర్యంలో మిల్పిటాస్(క్యాలిఫోర్నియా)లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆహూతులను అలరించారు. సుమారు 700మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు. ఇందులో జరిగిన ఇతర నృత్య కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నట్లు బాటా తెలిపింది.ఈ కార్యక్రమంద్వారా వసూలయిన $15000/- మొత్తాన్ని వేగ్నేశ ఫౌండేషన్ కోసం విరాళంగ ఇచ్చినట్లు బాటా తెలియజేసింది.




Monday, November 12, 2007

"హంసే నా టక్ రానేకా" పేరుతో హిందీలో అనువాదమవుతున్న మహేశ్ బాబు "సైనికుడు"


టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా రూపొందిన "సైనికుడు" చిత్రాన్ని హిందీలోకి అనువదిస్తున్నారు. తెలుగులో కమర్షియల్ విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో "కుమరన్" పేరుతో డబ్బింగ్ చిత్రంగా విడుదలచేయగా, అది అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోకి అనువదిస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్న ఈ చిత్రం డిసెంబర్లో విడుదలచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

హృతిక్ రోషన్ హీరోగా బ్రాడ్ పిట్ నిర్మించనున్న హాలీవుడ్ చిత్రం


బాలీవుడ్ ఛార్మింగ్ హీరో హృతిక్ రోషన్ కు అరుదైన అవకాశం లభించింది. "ది ట్రాయ్", "చాకొలెట్ ఫ్యాక్టరీ" లాంటి వైవిద్యమైన చిత్రాలు నిర్మించిన బ్రిల్ స్టైన్ గ్రే ఎంటర్టైన్మెంట్ హృతిక్ హీరోగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సంస్థ అధిపతి అయిన హీలీవుడ్ క్రేజీ యాక్షన్ హీరో బ్రాడ్ పిట్ హృతిక్ రోషన్ కు ఇచ్చిన అవకాశాన్ని హృతిక్ అంగీకరించాడని సమాచారం. గతంలో "పింక్ పాంథర్-2" చిత్రంలో నటించమని హృతిక్ రోషన్ కు ఆహ్వానం వచ్చినా అప్పుడు ఆ అవకాశాన్ని హృతిక్ త్రోసిపుచ్చారు. అయితే బ్రాడ్ పిట్ సంస్థ బ్రిల్ స్టైన్ గ్రే ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలపట్ల ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తుందని, అందులోనూ వీరు నిర్మించదలచిన కథ హృతిక్ కు ఎంతగానో నచ్చడం వల్ల హృతిక్ కూడా వెంటనే తన అంగీకారాన్ని తెలియజేశాడని సమాచారం. ఈ చిత్రం 2008లో నిర్మాణాన్ని ప్రారంభించుకుని 2009 ప్రధమార్థంలో విడుదలవుతుందని సమాచారం.

చిరంజీవి చిన్న కూతురు & ఫ్యామిలీ కేరాఫ్ హైదరాబాద్ కొత్తిల్లు (స్పెషల్ ఫోటో గ్యాలరీ)









పవన్ కళ్యాణ్ "రక్తదాన శిబిరం" @ కాప్ర కేరాఫ్ Hyd (ఎక్స్ క్లూజివ్ ఫోటోస్)








"సావారియా" ప్రివ్యూమే తారోం కా హల్ చల్..!!(ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ)











Saturday, November 10, 2007

పిరమిడ్ విడుదలచేయనున్న నరేశ్ "సీమశాస్త్రి"

అల్లరి నరేశ్ నటిస్తున్న హాస్య ప్రధాన చిత్రం "సీమశాస్త్రి" చిత్రాన్ని ఆంద్ర ప్రదేశ్ లో పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ విడుదల చేస్తోంది. ప్రస్తితం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తవుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నాము.


పాత్రికేయుల మధ్యన తన 19వ భర్త్ డే జరుపుకున్న శ్రీజ




చిరంజీవి కుమార్తె శ్రీజ శుక్రవారం నాడు తన 19వ జన్మదినోత్సవాన్ని న్యూఢిల్లీలో విలేకరుల మధ్యన, తన భర్త శిరీష్ భరద్వాజ్ తో కలిసి జరుపుకుంది.తన కుటుంబ సభ్యుల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోలేక పోవడం బాధగానే ఉందని ,తన కుటుంబ సభ్యుల ఆశిస్సులు తనకు ఉంటాయని భావిస్తున్నాని శ్రీజ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఒక హోటల్లో తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్న శ్రీజ త్వరలోనే హైదరాబాద్ వెల్తామని చెప్పింది.

హాలీవుడ్ హాటెస్ట్ "ద గర్ల్ నెక్స్ట్ డోర్" ఫేం ఎలీషా కుత్బర్ట్ (వీకెండ్ గ్యాలరీ)






టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపొర్ట్: సీజనల్ సూపర్ హిట్ "హ్యాపీడేస్"

1. "హ్యాపీడేస్" నెంబర్ వన్శేఖర్ కమ్ముల "హ్యాపీడేస్" కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృస్టిస్తోంది. రాష్ట్రం తో బాటు, తమిళనాడు, కర్నాటకలలో,మరియు అంతర్జాతీయంగా అమెరికా,ఆస్ట్రేలియా,సౌదీ,బ్రిటన్ లలో ఈ చిత్రం మంచి ఆదరణతో నడుస్తోంది. రాష్ట్రంలో ఏ సెంటర్లలో రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్న ఈ చిత్రం బి సెంటర్లలో మాత్రం సాధారణంగా కొనసాగుతోంది.
2. క్లైమాక్సే పెద్ద దెబ్బ
మహేశ్ బాబు చిత్రం "అతిధి" పరిస్థితి రెండవ స్థానంతో సరిపుచ్చుకోవలసి వస్తోంది. ఈ చిత్రం ఆరంభం నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్నా, చిత్రం క్లేమాక్స్ ఆశించిన స్థయిలో లేక పోవడం చిత్ర విజయాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ చిత్రం నడిపిస్తే నడిచే చిత్రం గా మారిందని కొందరు విమర్శిస్తున్నారు.
3. ఉదయ్ కిరణ్ కు తృప్తిని మిగిల్చే "వియ్యాలవరి కయ్యాలు"
ఉదయ్ కిరణ్, శ్రీహరి కలయికలో వచ్చిన "వియ్యాలవారి కయ్యాలు" చిత్రం ప్రేక్షకులను సాధారణంగా ఆక్ర్శిస్తోంది. పేరులోని వియ్యాలు, కయ్యాలు పదాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. కలెక్షన్ల పరంగా ఫిఫ్టీ ఫిఫ్టీ గా కొనసాగుతున్న ఈ చిత్రం మరో వారం ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉంది.
4. యాక్షన్ దెబ్బకు వాడిపోయిన "తులసి"
వెంకటేశ్ చిత్రాలనగానే ఎక్కువశాతం ప్రేక్షకులు కుటుంబ పరమైన కథలను ఆశిస్తారు. కొంత ప్రేమ, కొంత కుటంబ నేపద్య ఉన్నా శృతిమించిన హింస ఈ చిత్రాన్ని చతికిల పడేసింది. ఈ వారం కలెక్షన్లు బాగా పడిపోవడం తో ఈ చిత్ర పరాజయం దాదాపు ఖాయమైది.
5. పేరుకే "చిరుత"ది అయిదో స్థానం

పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే పదానికి అక్షరాలా అతికినట్లు సరిపోయే చిత్రం "చిరుత". వారసత్వం ప్రారంభాన్నిస్తుందే తప్ప చిత్రాన్ని నిలబెట్టదని ఈ చిత్రం మరోమారు నిరూపించింది. రాం చరన్ నటనతో ఏమాత్రం సంతోషపడని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని దాదాపు మరిచిపోయారు. దాంతో ఒకటీ, అరా అన్నట్లు కలెక్షనలతో ఈ చిత్రం "సా...గుతోంది".

శ్రీవెంకట్ బులెమోని

శంకర్, వినాయక్ లతో కథా చర్చలు కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం కథా చర్చల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన కథా చర్చల కోసం చిత్ర దర్శకుడు వి వి వినాయక్‌ను అమెరికాకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.మరో దర్శకుడు శంకర్ తో అల్లు అర్వైంద్ కథా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విశయాన్ని ఆయన ఎప్పటికి అప్పుడు చిరంజీవితో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇటు మీడియాకు, అటు అభిమానులకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ సంఘటనపై తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పి, తన అభిమానులు, రాజకీయనేతల్లో గౌరవం బాగా పెరిగింది.ఈ నేపథ్యంలో తన కుటుంబ బాధను మరచి పోయేందుకు కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లిన చిరంజీవి తన తదుపరి చిత్రంపైనే తన దృష్టంతా కేంద్రీకరించారు. వచ్చే సంక్రాంతి దాకా అమెరికాలోనే ఉండే ఆయన సంక్రాంతికి హైదరాబాద్‌కు ఆయన తిరిగి వచ్చిన తరువాత శంకర్ తో నేరుగా కథా చర్చలలో పాల్గొంటారు. ఇటీవల ఆయన నటించిన "శంకర్‌దాదా జిందాబాద్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెల్సిందే. దీంతో తదుపరి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

Friday, November 9, 2007

చూపులు కలిసిన శుభ వేళా.. (మాయాబజార్) వీడియో

video

యాంజెలినా జోలి ఏలియన్ గా నటిస్తున్న ప్రఖ్యాత "బ్యుల్ఫ్" చిత్రం ఎక్స్ క్లూజివ్ ట్రైలర్

video

మాధురీ దీక్షిత్ పునరాగమనం చేస్తున్న "ఆజా నాచ్ లే" చిత్రం ఎక్స్ క్లూజివ్ ట్రైలర్

video

కమల్ పై హత్యాయత్నం,బెదిరింపు కేసు: కోర్టు ఆదేశంతో కదిలిన పోలీసులు


కమల్ హాసన్ కోర్టునుంచి వ్యతిరేక తీర్పును ఎదుర్కొన్నారు. సెంథిల్ కుమార్ పై కమల్ హత్యాయత్నం బెదిరింపు కేసు నమోదు చేసుకోవాలని తాంబరం పోలీసులకు కోర్టు ఆదేశించింది.తను తయారు చేసిన "దశావతారం" చిత్ర కథను హీరో కమల్ హాసన్ దొంగిలించి తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ, చెన్నైలోని తాంబరంకు చెందిన సెంథిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ విషయం తెలిసిన కమల్ హాసన్ తన మేనేజర్ తో పాటు కొందరి దుండగులను తన గృహానికి పంపించి, కేసు ఉపసంహరించుకోవాలని, లేకుంటే హత్య చేస్తామని బెదిరించారని పేర్కొంటూ సెంథిల్ కుమార్ స్థానిక తాంబరం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన తాంబరం కోర్టు కమల్ హాసన్ పై కమల్ పై హత్యాయత్నం,బెదిరింపు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. సెంథిల్ కుమార్ కు భద్రత కల్పించాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది.అంటే "దశావతారం" కథ రసప్పట్టుకు వచ్చిందన్నమాటే కదా!

"దీపావళి" పండగంటే మహా ఇష్టం: మమతా మోహన్‌దాస్


"దీపావళి" పండగంటే మహా ఇష్టమని, తాను ఎక్కడున్నా దీపావళి చేసుకుంటానని అంటోంది టాలీవుడ్ కథానాయిక మమతా మోహన్ దాస్. చిన్నతనంలో స్కూల్ స్నేహితులతో కలిసి చేసుకునేవాళ్ళం. కొత్త బట్టలు, స్వీట్లు అవన్నీ తలచుకుంటేనే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మా స్కూల్లో చదివేవాళ్ళు మా ఇంటి పక్కపక్కనే ఉండేవారు. అంతా కలిసి చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం. హీరోయిన్ అయినా ఆ పండుగను కంటెన్యూ చేస్తునే ఉన్నాను. చిన్నప్పుడు మా బామ్మ ఓ మాట చెబుతుండేది. మతాబులు కాలిస్తే దోమలు, చిన్న పురుగులు రావని, అందుకే ఇంటిలో పొగవచ్చేదాకా వాటిని కాల్చేదాన్ని అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మమతా మోహన్ దాస్.

"ఆజా నాచ్ లే" అంటున్న మాధురీ దీక్షిత్ (ఎక్స్ క్లూజివ్ ఫోటో గ్యాలరీ)






ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై నడిచిన "శ్రీజ, శిరీష్ భరద్వాజ్"...!


ఆదినుంచి వార్తల్లో నిలుస్తున్న శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల జంట ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై నడిచి మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. చిరంజీవి కూతురిననే హోదా తనకు అక్కర లేదంటూనే, అదే హోదాతో ఈ ఫ్యాషన్ షోకు ముఖ్య అతిధులుగా హాజరై, తదనంతరం ఫ్యాషన్ షోలో ర్యాం పై నడవడమే కాకుండా, విజేతలకు మెగాస్టార్ తనయ హోదాలో బహుమతులను అందించారు. పొట్టి స్కర్టులతో నడుస్తున్న మోడల్స్ మధ్యన జీన్స్ దుస్తులు దరించిన శ్రీజ, భరద్వాజ్ లు ఇద్దరూ కలిసి జంటగా పాల్గొని ఆహూతులను ఆశ్చర్యపరిచారు. వెరు ఫ్యాషన్ షోలో ర్యాం పై నడవటం కొందరిని అలరించగా, మరి కొందరు నొచ్చుకునేలా చేసిందని ఢిల్లీ సమాచారం. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాందుకు శ్రీజ, భరద్వాజ్ ల జంటకు రెమ్యునరేషన్ బాగానే ముట్టిందని తెలిసింది.

దిల్ రాజు, సిద్దార్థ లకు "హీరోయిన్ కావలెను"

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న "కొత్త బంగారులోకం" చిత్రానికి, అలాగే యువ హీరో సిద్దార్థ నటిస్తున్న మరో కొత్త చిత్రానికి హీరోయిన్ లు కావలెను. "హ్యాపీదేస్" హీరో వరు తో దిల్ రాజు ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి "కొత్త బంగారు లోకం" అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈ చిత్రానికి సరైన హీరోయిన్ దొరకడంలేదు. 16నుంచి 19 సంవత్సరాల వయసుగల అందమైన అమ్మాయి తమ చిత్రానికి హీరోయిన్ గా కావాలని దిల్ రాజు ప్రకటించాడు. ఇక "లక్ష్మి","లక్ష్యం" చిత్రాల నిర్మాత నల్లమలుపు బుజ్జి సిద్దార్థ హీరోగా నిర్మిస్తున్న కొత్త చిత్రానికి కూడా హీరోయిన్ దొరకడం లేదు. దాంతెఒ ఆయనా హీరోయిన్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఆయనకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసున్న అందమైన హీరోయిన్ కావాలి. దిల్ రాజు సినిమాలో హీరోయిన్ గా అవకాశం కావలసిన వారు kbl.heroine@gmail.com ఈమెయిల్ లో సంప్రదించవచ్చు. ఇక నల్లమలుపు బుజ్జి చిత్రంలో అవకాశం కోసం నేరుగా వారి ఆఫీసులోనే సంప్రదించాలని నల్లమలుపు ప్రకటించాడు.

ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(09/11/2007)

(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
CHRISTMAS IN WONDERLAND : Rating-PG
(for rude language)

FRED CLAUS : Rating-PG
(for mild language and some rude humor)


I COULD NEVER BE YOUR WOMAN : Rating-PG-13
(for sexual content and language)

LIONS FOR LAMBS : Rating-R
(for some war violence and language)

NO COUNTRY FOR OLD MEN : Rating-R
(for strong graphic violence and some language)

P2 : Rating-R
(for strong violence/gore, terror and language)

POSTAL : Rating-R
(extremely crude humor throughout, including strong sexuality, graphic nudity, violence, and for pervasive language and some drug use)

RATINGS GUIDE
G
: GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children) PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED

శ్రీవెంకట్ బులెమోని

Wednesday, November 7, 2007

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి 149వ చిత్రం!?


ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చిరంజీవి 149వ చిత్రాన్ని రూపొందించడానికి రంగం సిద్దం అవుతోంది. ప్రముఖ నిర్మాత ఎన్ వి ప్రసాద్ నిర్మించతలపెట్టిన ఈ కొత్త చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించనున్నట్లు టాలీవుడ్ సమాచారం. నిర్మాత ఎన్ వి ప్రసాద్ అటు శంకర్ కు, ఇటు చిరంజెవికి కూడా మంచి స్నేహితుడు. మరో విషయం ఏమిటంటే దాదాపు నాలుగేళ్ళ క్రితమే శంకర్ తో చిత్రాన్ని చేయడాని, ప్రసాద్, శంకర్ లు ఒక ఒప్పందానికి వచ్చారు. అప్పట్లోనే శంకర్ కు అడ్వాన్సు కూడా ఇచ్చిన ఎన్ వి ప్రసాద్ శంకర్ తో చేయదగిన సందర్భం వెంటనే రాక, వచ్చినా అతి కొద్ది రోజుల్లోనే శంకర్ మరో ప్రాజెక్టులో మునిగిపోతూండటం తో వీరిద్దరి మధ్యన చిత్రం పెండింగ్ అవుతూనే వస్తోంది. శంకర్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలనే కోరిక ఉన్నా, అందుకు సమ్యం కలిసి రాలేదు. అయితే ఇటీవల శంకర్ హిందీ చిత్రం "రోబోట్" ఆగిపోయిన దృష్ట్యా , అతని దర్శకత్వంలో చిరంజీవితో తెలుగు సినిమాను నిర్మించాలనే ఆలోచనను ఎన్ వి ప్రసాద్ చిరంజీవి దగ్గర వ్యక్తం చేయగా, ఆయన సానుకూలంగా స్పందించడంతో మిగిలిన కార్యక్రమాలకు సిద్దమయ్యారని తెలిసింది. ప్రస్తుతం శంకర్ చిరంజీవికి చేయనున్న చిత్రానికి సంబంధించిన కథా రూపకల్పనలో తలమునకలైనట్లు టాలీవుడ్ సమాచారం. ఏదేమైనా చిరుతో శంకర్ చిత్రం అంటే ఎక్కువగా ఆనందపడేది ఆయన అభిమానులే అన్న విషయం నిర్వివాదాంశం.

హాలీవుడ్ హాటెస్ట్ క్రిస్టినా లోకెన్ న్యూ ఫోటో గ్యాలరీ






రజినీ కాంత్, వెంకటేశ్ "ఇద్దరూ...ఇద్దరే": నయనతార


"రజినీ వెరీ గ్రేట్, విక్టరీ వెంకీ నైస్ జెంటిల్‌మెన్" అంటోంది "లక్ష్మీ", "తులసి" చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించిన అందాలతార నయనతార. విక్టరీ వెంకటేష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ఇటీవల "తులసి" చిత్రం విడుదలైన సందర్భంగా నయనతార మాట్లాడుతూ, వెంకటేష్‌తో నటించటం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందనీ, ఆయన తనకు ఎన్నో మెలకువలు నేర్పారనీ, మొత్తంగా కలిసి ఆయన ఓ జెంటిల్‌మెన్ అనీ చెపుతోంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ఓ ఎన్ని సినిమాలలో నటించినా తానివి తీరదనీ, ఆయన వెంట ఒకే ఒక్క సన్నివేశంలో నటించినా అదో గొప్ప అనుభూతి అనీ సెలవిస్తోంది. ఎందుకంటే "రజనీ వెరీ వెరీ గ్రేట్" ఆయనను మరొకరితో పోల్చటం సాధ్యం కాదు అంటోంది.ఇందుమూలంగా అఖిల బ్లాగర్లకూ ఏం తెలుస్తోందంటే "నయనతార బ్రతక నేర్చిందని". కాదంటారా.

"హర్రర్ ఫిలిం ఫెస్టివల్-2007" కొత్త ట్రైలర్ (ఎక్స్ క్లూజివ్లీ మీకోసం)

video

ఆ పాత మధురాలు :"బృందావనమది అందరిదీ..." (పాట వీడియో)

video

టైం పత్రిక మెచ్చిన రోజా థీం వీడియో

video

టైం మ్యాగజైన్ మెచ్చిన వరల్డ్ టాప్-10 మ్యూజిక్ లో ఎ ఆర్ రెహమాన్ "రోజా"


భారతీయ హృదయాలను కొన్ని సంవత్సరాలుగా ఓలలాడిస్తున్న "రోజా" చిత్రంలోని "ఐసా హై క్యా" పాటకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని ప్రతిష్టాత్మకమైన టై మ్యాగజైన్ ఈ పాటను ప్రపంచంలోని టాప్ టెన్ పాటలలో ఒకటిగా కితాబు నిచ్చింది. గత 2005లో ఇదే పాటకు ప్రపంచంలోని 100 అతి మంచి పాటలలో ఒకటిగా గుర్తింపు రాగా, ప్రస్తుతం అది టాప్ టెన్ కు చేరి భారతీయ సంగీతానికి మరింత గౌరవాన్ని చేకూర్చింది. ప్రముఖ దర్శకుడు దేశభక్తి నేపధ్యంలో రూపొందించిన ఈ చిత్రం తమిళంలో రూపొందింది. ఆతర్వాత దాదాపు అన్ని భారతీయ భాషలలోకి అనువదింపబడ్డ ఈ చిత్రం సంచల