Wednesday, September 19, 2007

రూ.7.5 కోట్లకు "చిరుత" నైజాం హక్కులు కొన్న దాసరి నారాయణ రావు.

ప్రముఖ దర్శక,నిర్మాత, కేంద్ర మంత్రి డా.దాసరి నారాయణ రావు చిరంజీవి తనయుడు రాం చరన్ నటించిన తొలి చిత్రం "చిరుత" నైజాం హక్కులను రూ.7.5 కోట్లకు కొన్నారు.
నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ హక్కులకోసం ఇంత పెద్ద మొత్తం తొలి చిత్రానికే సాధించడం ఒక రికార్డు. సాధారణంగా పెద్ద హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్.టి.ఆర్ ల చిత్రాలకే ఇంతదాకా సుమారు ఏడు కోట్ల రూపాయలు నైజాం ఏరియాలో డిస్త్రిబ్యూషన్ హక్కులకోసం బయ్యర్లు వెచ్చిస్తుంటారు. మరీ ప్రత్యేకమైన చిత్రాలకు మాత్రం 7.0 నుంచి 7.5 కోట్లదాకా వెచ్చిస్తుంటారు. అయితే రాం చరన్ తొలి చిత్రంపై పరిష్రమలో పెద్దయెత్తున అంచనాలు పెరిగిపోవడంతో దాసరి నారాయణ రావు ఇంత పెద్ద మొత్తం ఈ చిత్రంకోసం వెచ్చించినట్లు తెలిసింది. దీనిని ఆయన స్వంత బ్యానరైన సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పై విడుదలచేస్తారు. కాగా ఆంధ్రా, ఈస్ట్, వెస్ట్, రాయలసీమ ఏరియాలకుగాను సుమారు మరో పదికోట్ల రూపాయలదాకా ఈ చిత్రం డిస్త్రిబ్యూషన్ హక్కులకుగాను వసూలు చేసినట్లు తెలిసింది.

No comments: